నిన్న సికింద్రాబాద్‌ మహంకాళి అమ్మవారిని దర్శించుకున్న అనంతరం బయటకు వచ్చిన అమిత్‌ షా కు బండి సంజయ్‌ తన స్వహస్తాలతో చెప్పులు అందించారు.

దీనిపై  ఇతర పార్టీల నేతలు విమర్శలు గుప్పిస్తున్నారు. అయితే ఇలాంటి ఘటనలు రాజకీయాల్లో కొత్త కాదు.

గతంలో కూడా కొందరు నేతలు తమ విధేయులతో చెప్పులు మోయించుకున్న ఘటనలు  ఉన్నాయి.

రాహుల్‌ గాంధీ చెప్పులు మాజీ కేంద్రమంత్రి ఎంపీ వీ నారాయణస్వామి మోశారు.

రాజీవ్‌ గాంధీ చెప్పులు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ మాజీ ముఖ్య‌మంత్రి అంజ‌య్య మోశారు.

కేంద్ర మంత్రి కొత్తరఘురామయ్య సంజయ్ గాంధీ చెప్పులు మోశారు.

యూపీ ముఖ్యమంత్రిగా వున్న ఎన్‌ డి తివారీ సంజయ్‌ గాంధీ చెప్పులు  మోశారు.

నన్నపనేని రాజకుమారీ సీనియర్‌ ఎన్టీఆర్‌  కాళ్లు కడిగి, చెప్పులు తొడిగారు.