YS Jagan: ప్రజా సమస్యలపై మరింత గట్టిగా పోరాడాలి.. వైసీపీ నేతలకు జగన్ దిశానిర్దేశం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
YS Jagan: ప్రజా సమస్యలపై గతంలో మాదిరిగానే ఇకపై కూడా మరింత గట్టిగా పోరాడాలని వైసీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్ పార్టీ శాసనసభాపక్ష సభ్యులకు పిలుపునిచ్చారు. రానున్న అసెంబ్లీ, శాసనమండలి సమావేశాలకు పార్టీ సభ్యులంతా పూర్తి సన్నద్ధంగా ఉండాలని సూచించారు. అయితే, వైసీపీని ప్రధాన ప్రతిపక్షంగా గుర్తించేందుకు ప్రభుత్వం ముందుకు రావడం లేదని జగన్ ఆరోపించారు. ప్రధాన ప్రతిపక్ష హోదా కల్పిస్తే సభలో మాట్లాడేందుకు తగిన సమయం ఇవ్వాల్సి వస్తుందని, ప్రధాన ప్రతిపక్ష నాయకుడికి సభలో మాట్లాడే సమయం హక్కుగా లభిస్తుందని తెలిపారు. ఆ హక్కును ఇవ్వడం చంద్రబాబుకు ఇష్టం లేకపోవడం వల్లే వైసీపీకి ప్రధాన ప్రతిపక్ష హోదా ఇవ్వడం లేదని జగన్ వ్యాఖ్యానించారు. దీంతో అసెంబ్లీలో పార్టీ తరఫున చేయగలిగింది పరిమితంగా ఉంటోందని అన్నారు.
ప్రెస్మీట్ల ద్వారా ప్రజలకు సమాధానం
అసెంబ్లీలో ప్రభుత్వం ప్రస్తావించే అంశాలకు ఆధారాలు, సాక్ష్యాలతో తాను ప్రెస్మీట్లు నిర్వహిస్తానని జగన్ తెలిపారు. ప్రతి అంశంలోనూ ప్రజలకు నాణేనికి రెండోవైపు చూపిస్తామని చెప్పారు. ప్రభుత్వం సభలో ఏ అంశాన్ని ప్రస్తావించినా దానికి సంబంధించిన వాస్తవాలను ఆధారాలు, సాక్ష్యాలతో ప్రజల ముందుకు తీసుకెళ్లాలని పార్టీ నేతలకు సూచించారు. ప్రజా సమస్యలపై తమ పోరాటాన్ని మరింత బలోపేతం చేయాలని పిలుపునిచ్చారు.
Also Read
- RK Roja: స్థానిక ఎన్నికలకు సిద్ధం కావాలి.. ప్రతిచోటా పోటీ చేస్తాం..
- YS Jagan: వ్యవస్థలన్నీ కుప్పకూలాయి.. ప్రతి ఇంట్లో వైసీపీ, కూటమి పాలనపై చర్చ జరుగుతోంది..
- YS Jagan: ఏకగ్రీవాలకు అంగీకరిస్తే వచ్చే ఎన్నికల్లో టికెట్లు ఉండవు.. వైసీపీ నేతలకు జగన్ హెచ్చరిక
- Supreme Court: X, ఫేస్బుక్, ఇన్స్టా, యూట్యూబ్ పోస్టుల తొలగింపుపై వైసీపీ పిటిషన్.. సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు..
మండలిలో బలంతో పోరాడాలి
శాసనమండలిలో వైసీపీకి బలం ఉందని జగన్ పేర్కొన్నారు. ఈ బలాన్ని ప్రజా సమస్యల పరిష్కారం కోసం ఉపయోగించాలని, ప్రజల తరఫున మండలిలో గట్టిగా పోరాడాలని పార్టీ మండలి సభ్యులకు సూచించారు. రాబోయే సమావేశాల్లో సభ్యులంతా పూర్తి సన్నద్ధతతో ఉండాలని, ప్రజలకు సంబంధించిన ప్రతి అంశాన్ని సమర్థంగా ప్రస్తావించాలని జగన్ దిశానిర్దేశం చేశారు. అసెంబ్లీలో అవకాశాలు పరిమితమైనప్పటికీ, మండలి వేదికగా ప్రజల సమస్యలను బలంగా వినిపించాలని స్పష్టం చేశారు. ప్రజా సమస్యలపై వైసీపీ గతంలోనూ పోరాటం చేసిందని, ఇప్పుడు కూడా అదే స్ఫూర్తితో మరింత గట్టిగా పోరాడాల్సిన అవసరం ఉందని జగన్ అన్నారు. సభలో ప్రభుత్వ విధానాలను ప్రశ్నించడంతో పాటు, బయట కూడా వాస్తవాలను ప్రజలకు వివరించాలని పార్టీ నేతలకు సూచించారు వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి..
తాజావార్తలు
-
Paradise Second Single: ‘ది ప్యారడైజ్’ సెకండ్ సింగిల్.. ఇలాంటి లాంచ్ ఎప్పుడూ చూసి ఉండరు!
-
Geetu Mohandas: “నేను రాసిందొకటి.. తీసిందొకటి”.. టాక్సిక్ డైరెక్టర్ సంచలన వ్యాఖ్యలు.. కానీ..
-
Anil RaviPudi : అనిల్ రావిపూడికి సొంత ఐడియాలు లేవా?
-
Mahesh Babu: ‘వారణాసి’ తర్వాత మహేశ్బాబు నెక్స్ట్ మూవీ ఎవరితో? మళ్లీ ఆ డైరెక్టర్ పేరే వైరల్!
-
OdalaRevu Fishermens: 23 రోజుల అనంతరం.. స్వస్థలాలకు బయలుదేరిన ఓడలరేవు మత్స్యకారులు!
ట్రెండింగ్
-
Wedding Gift: వింత వెడ్డింగ్ గిఫ్ట్.. స్నేహితుడి భార్య ముఖాన్ని గుండెలపై శాశ్వతంగా వేయించుకున్న వ్యక్తి..!
-
September 1 Rules Changes: సెప్టెంబర్ 1 నుంచి మారనున్న 5 కీలక విషయాలు.. మీ జేబుపై నేరుగా ప్రభావం!
-
10.1 అంగుళాల టచ్స్క్రీన్, 310 కి.మీ రేంజ్, బాక్సీ డిజైన్తో Suzuki e-Sky లాంచ్..!
-
8000mAh బ్యాటరీ, 50MP కెమెరా, 144Hz AMOLED డిస్ప్లేతో Realme P4s 5G లాంచ్.. ధర, ఫీచర్లు ఇలా.!
-
165Hz డిస్ప్లే, 24GB RAM, 7,470mAh బ్యాటరీతో Lenovo Legion Tab Y700 AI టాబ్లెట్ లాంచ్.. ధర ఎంతంటే?