Plastic Notes: ప్లాస్టిక్ నోట్లకు కేంద్రం గ్రీన్ సిగ్నల్.. ఎప్పటి నుంచి అమల్లోకి వస్తాయంటే..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
భారతదేశంలో రూ.10, రూ.20 విలువ కలిగిన కరెన్సీ నోట్ల మన్నికను పెంచేందుకు ప్లాస్టిక్ (పాలిమర్) నోట్లను క్షేత్రస్థాయి పరిశీలన నిమిత్తం ప్రయోగాత్మకంగా తీసుకురావడానికి కేంద్ర ప్రభుత్వం ఆమోదం తెలిపింది. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) చట్టం 1934లోని సెక్షన్ 25 ప్రకారం పంపిన ఈ ప్రతిపాదన ఆధారంగా.. మొత్తం 200 కోట్ల పాలిమర్ నోట్లను మార్కెట్లోకి ప్రవేశపెట్టనున్నారు. కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఈ విషయాన్ని రాజ్యసభలో ప్రశ్నోత్తరాల సమయంలో ధృవీకరించారు. కాగితపు నోట్లతో పాటు సమాంతరంగా ఈ పాలిమర్ నోట్లు చలామణిలో ఉంటాయని ఆమె వివరించారు.
ప్రస్తుతం ఈ ప్రక్రియ ప్రారంభ దశలో ఉన్నందున, అధికారిక విడుదల తేదీ లేదా ఖర్చు వివరాలను ఇంకా నిర్ణయించలేదు. తదుపరి ఆర్థిక సంవత్సరం ప్రారంభం నుండి వీటిని చలామణిలోకి తెచ్చేలా ఆర్బీఐ ప్రణాళికలు రచిస్తోంది. ప్రపంచ వ్యాప్తంగా అనేక దేశాల్లో గత 30 ఏళ్లుగా పాలిమర్ నోట్లు విజయవంతంగా వాడుకలో ఉన్నాయి. కాగితపు నోట్లతో పోలిస్తే ఇవి 2 నుండి 4 రెట్లు ఎక్కువ కాలం మన్నికగా ఉండటమే కాకుండా, తక్కువ విలువ కలిగిన నోట్లు త్వరగా చిరిగిపోకుండా అరికడతాయి.
Also Read
- Smriti Mandhana: స్మృతి మంధాన అరుదైన మైలురాయి.. మూడో భారతీయ క్రికెటర్గా రికార్డు..
- XI Jinping: చైనా అధ్యక్షుడు జిన్పింగ్కు గుండెపోటు..? వారసుడిని ప్రకటిస్తే తిరుగుబాటు భయం.?
- Rohit Yadav: బిగ్ షాక్.. క్రికెటర్ రోహిత్పై రెండేళ్ల నిషేధం..
- Mahesh Kumar Goud: కొండా సురేఖ బర్తరఫ్పై తొలిసారి స్పందించిన పీసీసీ చీఫ్!
ఇదే సందర్భంలో దేశ ఆర్థిక పరిస్థితిపై మాట్లాడిన ఆర్థిక మంత్రి, దేశంలో ద్రవ్యోల్బణం నియంత్రణలోనే ఉందన్నారు. గత ఆర్థిక సంవత్సరాల్లో తగ్గుముఖం పట్టిన రిటైల్ ద్రవ్యోల్బణం, పశ్చిమాసియా సంక్షోభం, వాతావరణ మార్పుల కారణంగా 2026-27 మొదటి త్రైమాసికంలో 3.9 శాతానికి చేరినప్పటికీ, ఆర్బీఐ నిర్దేశించిన 4 శాతం పరిమితి లోపే ఉందని స్పష్టం చేశారు. అలాగే.. జీఎస్టీ రేట్ల క్రమబద్ధీకరణ ద్వారా పన్ను భారాన్ని తగ్గించామని, వార్షిక ఆదాయం రూ.12 లక్షల వరకు పన్ను మినహాయింపు ఇవ్వడం వల్ల ప్రజల వ్యయ సామర్థ్యం పెరిగిందని పేర్కొన్నారు. దీనివల్ల ప్రైవేట్ వినియోగ వ్యయం పుంజుకోవడంతో పాటు, తక్కువ మరియు మధ్యతరగతి కుటుంబాల కొనుగోలు శక్తికి రక్షణ లభిస్తోందని మంత్రి వెల్లడించారు.
తాజావార్తలు
-
Smriti Mandhana: స్మృతి మంధాన అరుదైన మైలురాయి.. మూడో భారతీయ క్రికెటర్గా రికార్డు..
-
XI Jinping: చైనా అధ్యక్షుడు జిన్పింగ్కు గుండెపోటు..? వారసుడిని ప్రకటిస్తే తిరుగుబాటు భయం.?
-
Rohit Yadav: బిగ్ షాక్.. క్రికెటర్ రోహిత్పై రెండేళ్ల నిషేధం..
-
Mahesh Kumar Goud: కొండా సురేఖ బర్తరఫ్పై తొలిసారి స్పందించిన పీసీసీ చీఫ్!
-
Tollywood : హాలీవుడ్ నుండి విలన్స్ను దిగుమతి చేస్తోన్న టాలీవుడ్
ట్రెండింగ్
-
Shubman Gill Uncle: అకాయ్కు ‘అంకుల్’గా శుభ్మన్ గిల్.. వైరల్గా స్కూల్ రీల్.. పగలబడి నవ్వుకుంటున్న ఫాన్స్!
-
243 కి.మీ రేంజ్, 90 కి.మీ టాప్ స్పీడ్.. రూ.1.10 లక్షలకే Simple Wave ఎలక్ట్రిక్ స్కూటర్ లాంచ్..!
-
Rohit Sharma Retirement: రిటైర్మెంట్కు అంగీకరించిన రోహిత్ శర్మ.. సంచలన రిపోర్ట్!
-
6 రోజుల బ్యాటరీ, 24 గంటల బీపీ మానిటరింగ్.. HUAWEI WATCH D3 లాంచ్.!
-
204hp పవర్, 480Nm టార్క్.. 7-సీటర్ SUVగా రీఎంట్రీ ఇవ్వబోతున్న Mitsubishi Pajero.!