IND vs SL Test: టీమిండియాకు మరో ఎదురుదెబ్బ.. రెండో టెస్టుకు స్టార్ ప్లేయర్ దూరం!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Washington Sundar Out: శ్రీలంకతో జరగనున్న రెండు మ్యాచ్ల టెస్ట్ సిరీస్కు ముందు టీమిండియాకు వరుస గాయాలు ఇబ్బందిగా మారుతున్నాయి. ఇప్పటికే స్టార్ పేసర్ జస్ప్రీత్ బుమ్రా, యువ బ్యాటర్ సాయి సుదర్శన్ గాయాల కారణంగా సిరీస్కు దూరమయ్యారు. తాజాగా స్టార్ ఆల్రౌండర్ వాషింగ్టన్ సుందర్ కూడా రెండో టెస్టుకు అందుబాటులో ఉండే అవకాశాలు లేవని సమాచారం. దీంతో భారత జట్టుకు మరో ఎదురుదెబ్బ తగలనుంది.
శ్రీలంకతో జరగనున్న రెండో టెస్టు కోసం వాషింగ్టన్ సుందర్ను అదనపు ఆటగాడిగా బీసీసీఐ సెలెక్టర్లు ఎంపిక చేశారు. ప్రస్తుతం అతడు హ్యామ్స్ట్రింగ్ గాయం నుంచి కోలుకుంటున్నాడు. గాయం నుంచి పూర్తిగా కోలుకోకపోవడంతో కొలంబోలో జరిగే రెండో టెస్టుకు అతడు జట్టుతో కలిసే అవకాశాలు లేవని తెలుస్తోంది. ఒకవేళ పూర్తిగా కోలుకున్నా.. గాయం తర్వాత ఎక్కువగా క్రికెట్ ఆడకపోవడంతో వెంటనే టెస్ట్ మ్యాచ్లో ఆడించే సాహసం టీమ్ మేనేజ్మెంట్ చేయదు.
Also Read
- ICC Women's Champions Trophy 2027: మహిళల క్రికెట్లో కొత్త చరిత్ర.. ఛాంపియన్స్ ట్రోఫీకి భారత్ ఆతిథ్యం.. తేదీలు ఖరారు
- Quinton de Kock: 106 పరుగుల విధ్వంసం.. కోహ్లీ, వార్నర్ సరసన డి కాక్.. టీ20ల్లో అరుదైన రికార్డు
- Ravindra Jadeja: జడేజా చాలా హ్యాండ్సమ్, నా ఫేవరెట్ క్రికెటర్.. ఇంగ్లండ్ దిగ్గజం ఆసక్తికర వ్యాఖ్యలు!
- Hardik Pandya-MI: ముంబై ఇండియన్స్లోనే హార్దిక్ పాండ్యా.. కానీ బిగ్ ట్విస్ట్!
ఇంగ్లండ్ సిరీస్లో వాషింగ్టన్ సుందర్ గాయపడ్డాడు. అప్పటి నుంచి అతడి వర్క్లోడ్ను వైద్య బృందం పర్యవేక్షిస్తోంది. గాయం నుంచి కోలుకున్న వెంటనే మళ్లీ ఆటగాళ్లు గాయపడిన సందర్భాలు ఉండటంతో.. సుందర్ విషయంలో ఎలాంటి తొందరపాటు నిర్ణయం తీసుకోవద్దని బీసీసీఐ మెడికల్ టీమ్ భావిస్తున్నట్లు సమాచారం. సుందర్ను రెండో టెస్టు కోసం ఎంపిక చేసినప్పటికీ అతడు పూర్తి ఫిట్నెస్ సాధించడం అనేది ఇప్పటికీ సందేహంగానే ఉంది. ఫిట్నెస్పై వచ్చే వారం మరోసారి పూర్తి స్థాయిలో అంచనా వేసిన తర్వాత తుది నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. ఒకవేళ సుందర్ శ్రీలంకకు వెళ్లలేకపోతే.. అతడి స్థానంలో కొత్త ఆటగాడిని బీసీసీఐ ప్రకటించాల్సి ఉంటుంది.
ఇప్పటికే జస్ప్రీత్ బుమ్రా మోకాలి గాయం కారణంగా శ్రీలంక టెస్ట్ సిరీస్కు దూరమయ్యాడు. మరోవైపు సాయి సుదర్శన్ కూడా కాలికి గాయం కావడంతో జట్టుకు అందుబాటులో లేడు. ఇప్పుడు వాషింగ్టన్ సుందర్ కూడా దూరమైతే.. సిరీస్కు ముందు టీమిండియాకు ఇది ఎదురుదెబ్బ అవుతుంది. గాయాలతో ఇబ్బంది పడుతున్న బుమ్రా, ఆకాశ్ దీప్ ప్రస్తుతం రిహాబిలిటేషన్ కార్యక్రమాన్ని కొనసాగిస్తున్నారు. ఇద్దరి పునరాగమనానికి సంబంధించి ఇప్పటివరకు ఎలాంటి అప్ డేట్ లేదు. వరుసగా కీలక ఆటగాళ్లు గాయపడుతుండటంతో శ్రీలంకతో టెస్ట్ సిరీస్కు ముందు భారత జట్టు మేనేజ్మెంట్పై ఒత్తిడి పెరుగుతోంది.
తాజావార్తలు
-
Story Board: తెలంగాణ కాంగ్రెస్ రాజకీయం ఏ మలుపు తిరుగుతుంది..?
-
Swara Bhasker: ఇతర మహిళల్ని గౌరవించడం నేర్చుకో.. స్వరా భాస్కర్ వ్యాఖ్యలపై బీజేపీ..
-
CM Vijay: సీఎం విజయ్ను కలిసిన టీఎంసీ రెబెల్ ఎంపీ సయానీ ఘోష్
-
YS Jagan: నీటి విడుదలపై పొలిటికల్ వార్.. క్రెడిట్ కోసం చంద్రబాబు ఆరాటం.. వైఎస్ జగన్ సంచలన వ్యాఖ్యలు
-
CM Revanth Reddy : రాహుల్నే ప్రధాని చేయాలి.. వైఎస్సార్కు అదే నివాళి
ట్రెండింగ్
-
204hp పవర్, 480Nm టార్క్.. 7-సీటర్ SUVగా రీఎంట్రీ ఇవ్వబోతున్న Mitsubishi Pajero.!
-
7050mAh బ్యాటరీ, 144Hz AMOLED డిస్ప్లే, 50MP సోనీ కెమెరాతో VIVO T5 ఫోన్ లాంచ్!
-
6000mAh బ్యాటరీ, 128GB స్టోరేజ్తో కొత్త వేరియంట్ రూ.14,499కే Lava Virat V1 5G ఫోన్ లాంచ్..!
-
Hardik Pandya-MI: ముంబై ఇండియన్స్లోనే హార్దిక్ పాండ్యా.. కానీ బిగ్ ట్విస్ట్!
-
IP69K రేటింగ్, 8,340mAh భారీ బ్యాటరీ,1.5K OLED డిస్ప్లేతో POCO X8 5G స్మార్ట్ఫోన్ లాంచ్.!