IND vs AFG Schedule: భారత్, అఫ్గానిస్థాన్ టీ20 సిరీస్ ఖరారు.. పూర్తి షెడ్యూల్ ఇదే.. బంగ్లాదేశ్కు భారీ షాక్?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
IND vs AFG 2026 Schedule: భారత్, అఫ్గానిస్థాన్ జట్ల మధ్య మూడు మ్యాచ్ల టీ20 సిరీస్కు షెడ్యూల్ ఖరారు అయింది. సెప్టెంబర్లో భారత పర్యటనకు టీమిండియా రానున్నట్లు అఫ్గానిస్థాన్ క్రికెట్ బోర్డు (ఏసీబీ) ధ్రువీకరించింది. సెప్టెంబర్ 13 నుంచి 17 వరకు టీ20 సిరీస్ జరగనుంది. మూడు మ్యాచ్లూ ఢిల్లీలోని అరుణ్ జైట్లీ స్టేడియంలోనే జరగనున్నాయి. భారత పర్యటనకు సంబంధించిన షెడ్యూల్ను తమ వాణిజ్య భాగస్వాములు, సంబంధిత సంస్థలకు ఏసీబీ లేఖ ద్వారా తెలియజేసింది.
భారత్, అఫ్గానిస్థాన్ టీ20 సిరీస్లో తొలి మ్యాచ్ సెప్టెంబర్ 13న జరగనుంది. రెండో టీ20 సెప్టెంబర్ 15న, మూడో టీ20 సెప్టెంబర్ 17న జరగనుంది. మూడు మ్యాచ్లకు ఢిల్లీలోని అరుణ్ జైట్లీ స్టేడియమే వేదిక కానుంది. ఈ సిరీస్కు సంబంధించిన తేదీలు, వేదికలను బీసీసీఐతో చర్చించి ఖరారు చేసినట్లు అఫ్గానిస్థాన్ క్రికెట్ బోర్డు తెలిపింది. సెప్టెంబర్ 13 నుంచి 17 వరకు సిరీస్ జరగనున్నట్లు ఏసీబీ సీఈఓ నసీబ్ ఖాన్ ధ్రువీకరించారు. బీసీసీఐతో తేదీలు, వేదికలపై అంగీకారం కుదిరిందని కూడా వెల్లడించారు.
Also Read
- Shubman Gill: భారత క్రికెట్ చరిత్రను మార్చనున్న కెప్టెన్ గిల్.. విరాట్, రోహిత్కి కూడా సాధ్యం కాలేదు..
- Rocky Flintoff: తండ్రిని మించిన కొడుకు.. 18 ఏళ్ల రాకీ ఫ్లింటాఫ్ విధ్వంసం.. తండ్రి రికార్డులే టార్గెట్!
- BCCI: బీసీసీఐపై వీవీఎస్ లక్ష్మణ్ సంచలన వ్యాఖ్యలు.. షాక్లో మాజీ క్రికెటర్!
- Ind Vs SL: లంక టీమ్కు చుక్కలే.. రిషభ్ పంత్కు భయపడుతున్న లంక ప్లేయర్లు.. కారణం ఇదే..
అయితే ఈ సిరీస్పై అభిమానులకు అధికారిక ప్రకటన ఇంకా వెలువడాల్సి ఉందని ఏసీబీ స్పష్టం చేసింది. మీడియా హక్కుల సంస్థలు, ఇతర భాగస్వాములు ముందస్తు ఏర్పాట్లు చేసుకునేందుకు షెడ్యూల్ను అధికారికంగా తెలియజేసినట్లు పేర్కొంది. ఈ సిరీస్లో మరో ఆసక్తికర అంశం కూడా ఉంది. విదేశీ క్రికెట్ బోర్డు భారత్లోనే టీమిండియాకు ఆతిథ్యం ఇవ్వడం ఇదే తొలిసారి. సాధారణంగా భారత జట్టు స్వదేశంలో ఆడే సిరీస్లను బీసీసీఐ ఆధ్వర్యంలో నిర్వహిస్తుంటుంది. అయితే ఈసారి అఫ్గానిస్థాన్ క్రికెట్ బోర్డు ఈ సిరీస్కు ఆతిథ్య బాధ్యతలు తీసుకుంది.
అఫ్గానిస్థాన్తో సిరీస్ ఖరారు కావడంతో సెప్టెంబర్లో బంగ్లాదేశ్తో భారత్ సిరీస్ జరిగే అవకాశాలు పూర్తిగా తగ్గినట్లు తెలుస్తోంది. సెప్టెంబర్ 1 నుంచి 13 వరకు భారత్తో ఆరు మ్యాచ్ల వైట్బాల్ సిరీస్ నిర్వహించాలని బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు భావించినట్లు సమాచారం. అయితే తాజా పరిణామాల నేపథ్యంలో ఆ సిరీస్పై అనిశ్చితి నెలకొంది. ప్రస్తుతం భారత్-అఫ్గానిస్థాన్ మూడు టీ20ల సిరీస్కు తేదీలు, వేదికలు ఖరారయ్యాయి. సెప్టెంబర్ 13న ఢిల్లీలో తొలి టీ20తో ఈ సిరీస్ ప్రారంభం కానుండటంతో.. ఇరు జట్ల అభిమానుల్లో ఆసక్తి పెరిగింది. అధికారిక ప్రకటన వెలువడిన తర్వాత జట్ల వివరాలు, మ్యాచ్ సమయాలపై మరింత స్పష్టత రానుంది.
తాజావార్తలు
-
IND vs AFG Schedule: భారత్, అఫ్గానిస్థాన్ టీ20 సిరీస్ ఖరారు.. పూర్తి షెడ్యూల్ ఇదే.. బంగ్లాదేశ్కు భారీ షాక్?
-
Best FD Interest Rates August 2026: FDపై 8.50 శాతం వరకు వడ్డీ.. ఆగస్టు 2026లో టాప్ రేట్లు అందిస్తున్న బ్యాంకుల పూర్తి జాబితా
-
Srinu Vaitla : జార్జ్క్రిష్తో కంబ్యాక్ ఇచ్చేందుకు శ్రీనువైట్ల భారీ స్కెచ్
-
Mallika Sherawat: ‘టామ్ క్రూజ్కు నాపై క్రష్’.. వీడియో కూడా ఉంది.. 49 ఏళ్ల మల్లికా కామెంట్స్ వైరల్
-
Tirupati Crime: వారంలో ప్రియుడు వివాహం..! ప్రియురాలు ఆత్మహత్య
ట్రెండింగ్
-
4K 180Hz డిస్ప్లేతో 55, 65, 75 అంగుళాల్లో Hisense UR8S MiniLED TVలు లాంచ్..!
-
9,070mAh బ్యాటరీ, IP69 రేటింగ్, AMOLED డిస్ప్లేతో REDMI K100 Pro Max లాంచ్..!
-
200MP ట్రిపుల్ కెమెరా సెటప్, 8,580mAh బ్యాటరీ, 185Hz డిస్ప్లేతో REDMI K100 Pro లాంచ్.. ధర ఎంతంటే?
-
Abishek Porel Arrest: అత్యాచారం, బెదిరింపులు.. ఐపీఎల్ స్టార్ అరెస్ట్!
-
Gold Rate Today: బంగారం, వెండి ధరలకు రెక్కలు.. ఏకంగా రూ.10 వేలు!