IND vs AFG Schedule: భారత్, అఫ్గానిస్థాన్ టీ20 సిరీస్ ఖరారు.. పూర్తి షెడ్యూల్ ఇదే.. బంగ్లాదేశ్కు భారీ షాక్?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
IND vs AFG 2026 Schedule: భారత్, అఫ్గానిస్థాన్ జట్ల మధ్య మూడు మ్యాచ్ల టీ20 సిరీస్కు షెడ్యూల్ ఖరారు అయింది. సెప్టెంబర్లో భారత పర్యటనకు టీమిండియా రానున్నట్లు అఫ్గానిస్థాన్ క్రికెట్ బోర్డు (ఏసీబీ) ధ్రువీకరించింది. సెప్టెంబర్ 13 నుంచి 17 వరకు టీ20 సిరీస్ జరగనుంది. మూడు మ్యాచ్లూ ఢిల్లీలోని అరుణ్ జైట్లీ స్టేడియంలోనే జరగనున్నాయి. భారత పర్యటనకు సంబంధించిన షెడ్యూల్ను తమ వాణిజ్య భాగస్వాములు, సంబంధిత సంస్థలకు ఏసీబీ లేఖ ద్వారా తెలియజేసింది.
భారత్, అఫ్గానిస్థాన్ టీ20 సిరీస్లో తొలి మ్యాచ్ సెప్టెంబర్ 13న జరగనుంది. రెండో టీ20 సెప్టెంబర్ 15న, మూడో టీ20 సెప్టెంబర్ 17న జరగనుంది. మూడు మ్యాచ్లకు ఢిల్లీలోని అరుణ్ జైట్లీ స్టేడియమే వేదిక కానుంది. ఈ సిరీస్కు సంబంధించిన తేదీలు, వేదికలను బీసీసీఐతో చర్చించి ఖరారు చేసినట్లు అఫ్గానిస్థాన్ క్రికెట్ బోర్డు తెలిపింది. సెప్టెంబర్ 13 నుంచి 17 వరకు సిరీస్ జరగనున్నట్లు ఏసీబీ సీఈఓ నసీబ్ ఖాన్ ధ్రువీకరించారు. బీసీసీఐతో తేదీలు, వేదికలపై అంగీకారం కుదిరిందని కూడా వెల్లడించారు.
Also Read
- India vs Sri Lanka: చేయాల్సిందంతా చేశాం.. కొలంబో టెస్ట్ డ్రాపై గిల్ ఆసక్తికర వ్యాఖ్యలు..
- India Test Record: లంక గడ్డపై టీమ్ ఇండియా చరిత్ర.. 2010 నుంచి చెక్కుచెదరని రికార్డు
- India and Sri Lanka: 429/9 వద్ద మ్యాచ్కు తెర.. కొలంబోలో భారత్, శ్రీలంక డ్రా.. సిరీస్ మనదే..
- ICC: స్టార్ క్రికెటర్కు భారీ షాక్.. డోపింగ్ కేసులో 15 నెలల బ్యాన్
అయితే ఈ సిరీస్పై అభిమానులకు అధికారిక ప్రకటన ఇంకా వెలువడాల్సి ఉందని ఏసీబీ స్పష్టం చేసింది. మీడియా హక్కుల సంస్థలు, ఇతర భాగస్వాములు ముందస్తు ఏర్పాట్లు చేసుకునేందుకు షెడ్యూల్ను అధికారికంగా తెలియజేసినట్లు పేర్కొంది. ఈ సిరీస్లో మరో ఆసక్తికర అంశం కూడా ఉంది. విదేశీ క్రికెట్ బోర్డు భారత్లోనే టీమిండియాకు ఆతిథ్యం ఇవ్వడం ఇదే తొలిసారి. సాధారణంగా భారత జట్టు స్వదేశంలో ఆడే సిరీస్లను బీసీసీఐ ఆధ్వర్యంలో నిర్వహిస్తుంటుంది. అయితే ఈసారి అఫ్గానిస్థాన్ క్రికెట్ బోర్డు ఈ సిరీస్కు ఆతిథ్య బాధ్యతలు తీసుకుంది.
అఫ్గానిస్థాన్తో సిరీస్ ఖరారు కావడంతో సెప్టెంబర్లో బంగ్లాదేశ్తో భారత్ సిరీస్ జరిగే అవకాశాలు పూర్తిగా తగ్గినట్లు తెలుస్తోంది. సెప్టెంబర్ 1 నుంచి 13 వరకు భారత్తో ఆరు మ్యాచ్ల వైట్బాల్ సిరీస్ నిర్వహించాలని బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు భావించినట్లు సమాచారం. అయితే తాజా పరిణామాల నేపథ్యంలో ఆ సిరీస్పై అనిశ్చితి నెలకొంది. ప్రస్తుతం భారత్-అఫ్గానిస్థాన్ మూడు టీ20ల సిరీస్కు తేదీలు, వేదికలు ఖరారయ్యాయి. సెప్టెంబర్ 13న ఢిల్లీలో తొలి టీ20తో ఈ సిరీస్ ప్రారంభం కానుండటంతో.. ఇరు జట్ల అభిమానుల్లో ఆసక్తి పెరిగింది. అధికారిక ప్రకటన వెలువడిన తర్వాత జట్ల వివరాలు, మ్యాచ్ సమయాలపై మరింత స్పష్టత రానుంది.
తాజావార్తలు
-
PMSBY: రూ.20తో రూ.2 లక్షల బీమా.. ఈ ప్రభుత్వ పథకం గురించి తెలుసా?
-
OTR: సీట్ల పంపకానికి ముందే ‘నోట్ల’ పంచాయితీ! టీడీపీ-జనసేనలో కొత్త టెన్షన్
-
Off The Record: కొండా సురేఖ, చిన్నారెడ్డిపై యాక్షన్కు బ్రేక్! ఢిల్లీ నుంచి వచ్చిన సందేశమేంటి?
-
OTR: ఎమ్మెల్యే పదవిని వదిలి మేయర్ అవుతారా? విశాఖలో టీడీపీ నేతల కొత్త స్కెచ్!
-
Story Board : వీసా అపాయింట్మెంట్లు ఎందుకు నిలిపేశారు..?| ట్రంప్ కఠిన చర్యలు దేనికి సంకేతం..?
ట్రెండింగ్
-
Festival Recipes : రక్షా బంధన్ స్పెషల్.. ఇంట్లోనే సింపుల్గా కాజు కట్లీ రెడీ..!
-
MS Dhoni-CSK: సీఎస్కేలో ధోనీకి 25 శాతం వాటానా?.. ఫ్రీగా ఎవరైనా ఇస్తారా?.. మాజీ టీమిండియా ప్లేయర్ సంచలన వ్యాఖ్యలు!
-
కేవలం రూ.7,999కే.. 5000mAh బ్యాటరీ, LED ఫ్లాష్ కెమరాతో Lava Bold N4 Lite లాంచ్..!
-
రూ.14,999కే మిలిటరీ-గ్రేడ్ డ్యూరబిలిటీ, 6500mAh బ్యాటరీ, 120Hz డిస్ప్లే.. Realme C100i 4G ఫోన్ లాంచ్.!
-
Paneer Bhurji Recipe: పప్పు, కూరలతో బోర్ కొడుతోందా.? అయితే “పనీర్ భుర్జీ”తో కొత్త టేస్ట్ ఆస్వాదించండి..!