Punya Kshetra Yatra: భక్తులకు శుభవార్త.. అయోధ్య, కాశీ, పూరీ, ప్రయాగ్రాజ్.. పుణ్యక్షేత్ర యాత్ర స్పెషల్ రైలు.. వివరాలు ఇదిగో.!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Punya Kshetra Yatra: ఆధ్యాత్మిక యాత్ర చేయాలనుకునే భక్తులకు భారతీయ రైల్వే క్యాటరింగ్ అండ్ టూరిజం కార్పొరేషన్ (IRCTC) శుభవార్త చెప్పింది. “అయోధ్య-కాశీ: పుణ్యక్షేత్ర యాత్ర” పేరుతో ప్రత్యేక భారత్ గౌరవ్ టూరిస్ట్ రైలును ఆగస్టు 4, 2026 నుంచి నడపనున్నట్లు ప్రకటించింది. ఈ యాత్ర 9 రాత్రులు – 10 రోజుల ప్యాకేజీలో పూరీ, కోణార్క్, గయా, వారణాసి, అయోధ్య, ప్రయాగ్రాజ్ వంటి ఆరు ప్రముఖ పుణ్యక్షేత్రాలను సందర్శించే అవకాశం కల్పిస్తోంది.
ఈ టూర్లో మొత్తం 705 సీట్లు అందుబాటులో ఉన్నాయి. వీటిలో స్లీపర్ (SL) – 237, 3AC – 416, 2AC – 52 సీట్లు ఉన్నాయి. సికింద్రాబాద్ నుంచి ప్రారంభమయ్యే ఈ ప్రత్యేక రైలు చర్లపల్లి, కాజీపేట, వరంగల్, ఖమ్మం, విజయవాడ, గుడివాడ, భీమవరం, తణుకు, నిడదవోలు, రాజమండ్రి, సామర్లకోట, తుని, దువ్వాడ, పెందుర్తి, విజయనగరం స్టేషన్లలో ప్రయాణికులను ఎక్కించుకుంటుంది.
Also Read
- Vallabhaneni Vamsi: సీఎం చంద్రబాబుకు వల్లభనేని వంశీ లేఖ.. పట్టిసీమ నీటిపై జోక్యం చేసుకోండి..
- Gadikota Srikanth Reddy: 'ఫాల్స్ ప్రచారం చేస్తున్నారు'.. సీఎంపై గడికోట శ్రీకాంత్ రెడ్డి ఫైర్
- AI కోర్సులకు భారీ డిమాండ్.. TGEAPCET-2026 రెండో విడత సీట్ల కేటాయింపు పూర్తి..!
- Danish Kaneria: "రాముడు, మోడీ, హిందుత్వాన్ని తిట్టడమే నిరసనా?".. సీజేపీ ఆందోళనలపై పాక్ మాజీ క్రికెటర్ సంచలన వ్యాఖ్యలు..
ఈ యాత్రలో భక్తులు పూరీలో శ్రీ జగన్నాథ ఆలయం, కోణార్క్లోని సూర్యదేవాలయం, గయాలో విష్ణుపాద ఆలయం, వారణాసిలో కాశీ విశ్వనాథ ఆలయం, కాశీ విశాలాక్షి, అన్నపూర్ణ ఆలయం, గంగా హారతి, అయోధ్యలో శ్రీరామ జన్మభూమి, హనుమాన్గఢీ, సరయూ నది హారతి, అలాగే ప్రయాగ్రాజ్లో త్రివేణి సంగమం వద్ద పవిత్ర స్నానం చేసే అవకాశం పొందుతారు.
ఆగస్టు 4న సికింద్రాబాద్ నుంచి బయలుదేరిన రైలు ఆగస్టు 5న పూరీ చేరుకుంటుంది. అక్కడ జగన్నాథ ఆలయ దర్శనం అనంతరం మరుసటి రోజు కోణార్క్ సందర్శన ఉంటుంది. ఆ తర్వాత గయాలో విష్ణుపాద ఆలయం, వారణాసిలో కాశీ విశ్వనాథ ఆలయం, గంగా హారతి, అయోధ్యలో శ్రీరామ జన్మభూమి, హనుమాన్గఢీ, సరయూ హారతి, చివరగా ప్రయాగ్రాజ్లో త్రివేణి సంగమం సందర్శించిన అనంతరం తిరుగు ప్రయాణం ప్రారంభమవుతుంది. ఆగస్టు 13న సికింద్రాబాద్ చేరుకోవడంతో యాత్ర ముగుస్తుంది.
ప్యాకేజీ ధరలు:
ఈ యాత్రకు మూడు విభాగాల్లో బుకింగ్ అవకాశం ఉంది.
* ఎకానమీ (స్లీపర్) – రూ.16,500
* స్టాండర్డ్ (3AC) – రూ.25,600
* కంఫర్ట్ (2AC) – రూ.33,400
5 నుంచి 11 ఏళ్ల పిల్లలకు ప్రత్యేక రాయితీ ధరలు కూడా అందుబాటులో ఉన్నాయి. ఈ ధరల్లో ఇప్పటికే GSTతో పాటు భారత్ గౌరవ్ పథకం కింద భారతీయ రైల్వే అందిస్తున్న సుమారు 33% రాయితీ కూడా కలిపి ఉంటుంది.
ప్యాకేజీలో ఏమేమి ఉంటాయి?
ఈ టూర్ ప్యాకేజీలో రైలు ప్రయాణం, హోటల్ వసతి, అవసరమైన చోట వాష్ అండ్ చేంజ్ సదుపాయం, స్థానిక రవాణా, ఉదయం టీ, అల్పాహారం, మధ్యాహ్న భోజనం, రాత్రి భోజనం (శాకాహారం మాత్రమే), ట్రావెల్ ఇన్సూరెన్స్, టూర్ మేనేజర్ సేవలు, రైలులో భద్రత, వర్తించే పన్నులు అన్నీ ఉంటాయి. అయితే ఆలయాలు లేదా ఇతర ప్రదేశాల ప్రవేశ రుసుములు, వ్యక్తిగత ఖర్చులు, రూమ్ సర్వీస్ వంటి సేవలు ప్యాకేజీలో ఉండవు.
యాత్రకు వెళ్లే ప్రయాణికులు ఆధార్ లేదా ఓటర్ ఐడీ వంటి గుర్తింపు కార్డు తప్పనిసరిగా వెంట తీసుకెళ్లాలి. ఆరోగ్య పరిస్థితికి అనుగుణంగా ముందుగానే వైద్యుల సలహా తీసుకోవాలని IRCTC సూచించింది. రైల్లో ధూమపానం, మద్యం సేవించడం నిషేధం. ప్రయాణ సమయాలు రైళ్ల రన్నింగ్ పరిస్థితులను బట్టి మారే అవకాశం ఉన్నందున తదనుగుణంగా ప్రయాణ ప్రణాళిక సిద్ధం చేసుకోవాలని సంస్థ తెలిపింది. పూర్తి వివరాల కోసం https://www.irctctourism.com/pacakage_description?packageCode=SCZBG64 ఈ పేజీని చూడండి.
తాజావార్తలు
-
Punya Kshetra Yatra: భక్తులకు శుభవార్త.. అయోధ్య, కాశీ, పూరీ, ప్రయాగ్రాజ్.. పుణ్యక్షేత్ర యాత్ర స్పెషల్ రైలు.. వివరాలు ఇదిగో.!
-
Jeetendra: 4 లక్షల పెట్టుబడితో 450 కోట్ల జాక్పాట్ కొట్టిన నటుడు… అసలు విషయం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
-
Vallabhaneni Vamsi: సీఎం చంద్రబాబుకు వల్లభనేని వంశీ లేఖ.. పట్టిసీమ నీటిపై జోక్యం చేసుకోండి..
-
Land Grab Case: జూబ్లీహిల్స్లో భూ కబ్జా యత్నం.. ఇద్దరు ప్రముఖ సినీ నిర్మాతలపై కేసు నమోదు!
-
Sonam Raghuvanshi: సోనమ్ రఘువంశీకి షాక్.. బెయిల్ను రద్దు చేసిన సుప్రీంకోర్టు.. మూడు వారాల్లోగా లొంగిపోవాలని ఆదేశం
ట్రెండింగ్
-
Pachimirapakaya Pachadi: తిన్నకొద్దీ తినాలనిపించే “పచ్చిమిరపకాయ రోటి పచ్చడి” చేసేయండి ఇలా.!
-
IND vs ZIM 1st T20: వైభవ్ సూర్యవంశీకి షాక్.. కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ దోస్తుకు ఛాన్స్?
-
Dinesh Karthik vs Alastair Cook: ఐపీఎల్ గురించి వాడివేడి చర్చ.. ఇంటర్వ్యూలోనే కొట్టుకోబోయిన దినేష్ కార్తీక్, అలిస్టర్ కుక్!
-
6 ఏళ్ల తర్వాత ‘S’ సిరీస్ కమ్బ్యాక్.. ప్రీమియం ఫీచర్లతో అతి త్వరలో రాబోతున్న Vivo S2 స్మార్ట్ ఫోన్.!
-
అల్ట్రా స్లిమ్ డిజైన్, 200MP కెమెరా, 5000mAh బ్యాటరీతో ఫోల్డబుల్ ఫ్లాగ్షిప్ Samsung Galaxy Z Fold8 Ultra లాంచ్.!