Lal Darwaza Bonalu: బోనాల వేళ పోలీసుల సీక్రెట్ ఆపరేషన్.. 116 మంది అదుపులో..
- అనుమానితులపై పోలీసుల నిఘా
- ఫేషియల్ రికగ్నిషన్తో పాత నేరస్థుల గుర్తింపు
- మఫ్టీ పోలీసులతో పటిష్ట భద్రత
- బోనాల్లో చోరీలకు పూర్తిగా చెక్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Lal Darwaza Bonalu: పాతబస్తీలోని చారిత్రాత్మక లాల్దర్వాజ బోనాల ఉత్సవాల సందర్భంగా హైదరాబాద్ నగరం వ్యాప్తంగా సీసీఎస్ స్పెషల్ క్రైమ్ టీమ్ చేపట్టిన ముందస్తు నిఘా చర్యలు విశేష ఫలితాలను ఇచ్చాయి. ఆగస్టు 9, 10 తేదీల్లో అత్యంత వైభవంగా జరిగిన ఈ ఉత్సవాల్లో భక్తుల భద్రతే ధ్యేయంగా పోలీసులు విస్తృత తనిఖీలు చేపట్టారు. ఈ క్రమంలో అనుమానాస్పదంగా సంచరిస్తున్న 116 మందిని అదుపులోకి తీసుకుని విచారించినట్లు హైదరాబాద్ అడిషనల్ సీపీ (క్రైమ్స్ & సిట్) యం. శ్రీనివాస్ వెల్లడించారు. భక్తులకు ఎలాంటి ఆటంకం కలగకుండా, ఆస్తి సంబంధిత నేరాలను నివారించేందుకు స్పెషల్ క్రైమ్ బృందాలను రంగంలోకి దించినట్లు ఆయన తెలిపారు.
ఫేషియల్ రికగ్నిషన్తో నేరస్థుల గుర్తింపు.. 8 మంది పాత నేరస్థులు సీజ్!
లాల్దర్వాజ ఉత్సవ ప్రాంగణంతో పాటు ప్రధాన రహదారుల వద్ద అత్యాధునిక ఫేషియల్ రికగ్నిషన్ సిస్టమ్ (FRS) కెమెరాలను ఏర్పాటు చేశారు. పోలీస్ శాఖ వద్ద ఉన్న నేరస్థుల డేటాబేస్తో అనుమానితుల వివరాలను సరిపోల్చగా, అదుపులోకి తీసుకున్న 116 మందిలో 8 మంది పాత నేర చరిత్ర కలిగిన వ్యక్తులుగా ఆధారాలతో సహా నిర్ధారణ అయ్యింది. చైన్ స్నాచింగ్లు, జేబుదొంగతనాలకు అలవాటుపడిన ఈ పాత నేరస్థులను తదుపరి చట్టపరమైన చర్యల కోసం స్థానిక పోలీస్ స్టేషన్లకు అప్పగించినట్లు అధికారులు స్పష్టం చేశారు.
Also Read
- Tummala Nageswara Rao : పదవుల కోసం ఎప్పుడూ పాకులాడలేదు
- Tukkuguda Nurse Mu*rder: తుక్కుగూడ నర్సు హ*త్యకేసు.. సీన్ టు సీన్.. అసలేం జరిగిందంటే.!
- Se*xual Assault: తుక్కుగూడ నర్సు శిరీష హత్య కేసు.. లైంగిక దాడి చేసినట్లు నిర్ధారణ.. నిందితుడి అరెస్ట్.!
- Vem Narender Reddy: మార్చి 2027 వరకు లక్ష ఉద్యోగాల భర్తీ.. వారానికి ఒక నోటిఫికేషన్.!
మఫ్టీ పోలీసుల నిఘా.. ఒక్క చోరీ కేసు కూడా నమోదు కాలేదు
ప్రధాన ఎంట్రీ, ఎగ్జిట్ పాయింట్ల వద్ద ప్రత్యేక పహాడాతో పాటు భక్తుల రద్దీ ఎక్కువగా ఉన్న ప్రాంతాల్లో మఫ్టీ పోలీసులను మోహరించి నిరంతర పర్యవేక్షణ కొనసాగించారు. సీసీఎస్ స్పెషల్ టీమ్స్ , స్థానిక పోలీసులు సమన్వయంతో చేపట్టిన ఈ పటిష్ట బందోబస్తు కారణంగా లాల్దర్వాజ బోనాల్లో ఒక్క సెల్ఫోన్ చోరీ గానీ, చైన్ స్నాచింగ్ లేదా దొంగతనం ఘటన గానీ నమోదు కాలేదని అడిషనల్ సీపీ శ్రీనివాస్ హర్షం వ్యక్తం చేశారు. భక్తులు తమ విలువైన వస్తువుల పట్ల నిరంతరం అప్రమత్తంగా ఉండాలని, ఏదైనా అనుమానాస్పద కదలిక కనిపిస్తే తక్షణమే పోలీసులకు సమాచారం ఇవ్వాలని ఈ సందర్భంగా ఆయన సూచించారు.
తాజావార్తలు
-
Tummala Nageswara Rao : పదవుల కోసం ఎప్పుడూ పాకులాడలేదు
-
Noida: నోయిడాలో నిర్భయ తరహాలో ఘోరం.. బాలికపై గ్యాంగ్రేప్
-
Tilak Varma: ఒత్తిడిలోనూ చెక్కుచెదరని ఆత్మవిశ్వాసం.. మ్యాచ్ స్వరూపాన్ని మార్చేసిన తిలక్ వర్మ..
-
Modi-Pezeshkian: మోడీతో ఇరాన్ అధ్యక్షుడు పెజెష్కియాన్ భేటీ.. కీలక అంశాలపై చర్చ
-
Veta: ‘పెదరాయుడు’ లాంటి పవర్ఫుల్ పాత్రలో కేఎస్ రవికుమార్.. సంచలన ప్రాజెక్ట్ షురూ!
ట్రెండింగ్
-
9000mAh బ్యాటరీ, 1.5K AMOLED డిస్ప్లేతో POCO X8 5G సెప్టెంబర్ 4న లాంచ్..!
-
క్రిస్టల్స్తో మెరిసిపోనున్న Motorola కొత్త ఫోల్డబుల్ ఫోన్.. IFA 2026లో సరికొత్త స్వరోవ్స్కీ ఎడిషన్.!
-
Viral Video : గుండెలను పిండేస్తున్న దృశ్యం.. చెల్లెలితో చిన్నారి.. తల్లిదండ్రుల కోసం వెతుకులాట.!
-
Mouth Ulcer: చిన్న నోటిపుండే కదా అని లైట్ తీసుకుంటున్నారా? ఈ మార్పులు కనిపిస్తే తప్పక డాక్టర్ను సంప్రదించాల్సిందే.!
-
Rose Water: ముఖానికి ఫ్రెష్నెస్, హైడ్రేషన్ కావాలా.? అయితే ఇంట్లోనే రోజ్ వాటర్ ఇలా తయారు చేసుకోండి..!