PM Modi: ప్రధాని మోడీ, ప్రియాంకా గాంధీల మధ్య సరదా సంభాషణ..‘‘మీరు మారిపోయారు’’ అని ఖర్గే కౌంటర్..
- ప్రధాని మోడీ, ప్రియాంకా గాంధీల మధ్య సరదా సంభాషణ..
- ‘‘మీరు మారిపోయారు’’ అంటూ ఖర్గే కౌంటర్.. వైరల్ అవుతున్న వీడియో..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
PM Modi: ఎన్సిపి (ఎస్పి) నాయకురాలు సుప్రియా సూలే కుమార్తె వివాహ విందుకు పలువురు రాజకీయ నాయకులు హాజరయ్యారు. న్యూఢిల్లీలో జరిగిన ఈ కార్యక్రమానికి ప్రధాని మోడీ, హోం మంత్రి అమిత్ షా, ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ, ప్రియాంకాగాంధీ, కాంగ్రెస్ ప్రెసిడెంట్ మల్లికార్జున ఖర్గే వంటి వారు హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో నేతలు తమ రాజకీయ విభేదాలను పక్కన పెట్టి సరదాగా కాసేపు మాట్లాడుకున్నారు. ఈ నేపథ్యంలోనే ప్రధాని మోడీ, ప్రియాంకాగాంధీ, ఖర్గేల మధ్య సరదా సంభాషణ జరిగింది.
ఈ కార్యక్రమంలో ప్రధాని మోడీ ‘‘ప్రియాంకా గాంధీ గారు మీరు ఎలా ఉన్నారు.?’’ అని ప్రశ్నించారు. దీనికి బదులుగా ప్రియాంకాగాంధీ ‘‘నేను బాగున్నాను సార్, మీరు ఎలా ఉన్నారు?’’ అని అడిగారు. దీనికి మోడీ స్పందిస్తూ.. ‘‘నేను అంతే’’ అంటూ బదులిచ్చారు. ఇదే సమయంలో ఖర్గే చర్చలోకి చేరి ప్రధాని మోడీతో ‘‘సోదరా మీరు కొంచెం మారారు’’ అని అన్నారు. దీనికి ప్రధాని మోడీ స్పందిస్తూ.. ‘‘అచ్చా’’ అని అన్నారు. దీంతో అక్కడ ఉన్న నేతల మధ్య నవ్వులు విరబూశాయి. దీని తర్వాత ప్రధాని మోడీ అందరికి చేతులు జోడించి అభివాదం చేసి అక్కడి నుంచి వెళ్లారు. ఈ సమయంలో రాహుల్ గాంధీ కూడా అక్కడే ఉన్నారు. మోదీ, ఖర్గే మధ్య జరిగిన సంభాషణను విని రాహుల్ కూడా చిరునవ్వుతో కనిపించారు.
Also Read
- Nitin Gadkari: ట్రాఫిక్ రూల్స్ ఉల్లంఘిస్తే లైసెన్స్ రద్దు.. గడ్కరీ కీలక ప్రకటన
- Chatgpt: చాట్ జీపీటీలో అంతరాయం.. వినియోగదారుల్లో ఆందోళన
- Jaishankar in Kyiv: భారత్ రష్యా చమురు కొనుగోలును ఆపుతుందా? జెలెన్స్కీకి జైశంకర్ క్లారిటీ..
- Jaishankar-Zelenskyy: కీవ్లో జెలెన్స్కీతో జైశంకర్ భేటీ.. యుద్ధంలో శాంతి ప్రయత్నాలపై చర్చ
ఖర్గే చేసిన ‘మీరు మారిపోయారు’’ అనే వ్యాఖ్యలపై నెటిజన్లు తీవ్రంగా డీకోడ్ చేసేందుకు ప్రయత్నిస్తున్నారు. ఏ సందర్భానుసారం ఖర్గే ఈ వ్యాఖ్యలు చేశారా అని ఆలోచిస్తున్నారు. ఇటీవల ఢిల్లీలో విద్యార్ధుల నిరసన నేపథ్యంలో ‘‘జెన్ జీ’’ యువతను ఆకట్టుకోవడానికి మోడీ సెల్ఫీ తరహా ఇన్స్టాగ్రామ్ వీడియోలు చేశారు. ఈ ధోరణిపై ఖర్గే అన్నారని భావిస్తున్నారు. మరోవైపు, ఈ కార్యక్రమంలో ఎన్సీసీ ఎస్పీ నేత శరద్ పవార్తో మోడీ మాట్లాడుతూ కనిపించారు. ఎన్సీపీ ఎస్పీకి చెందిన ఎంపీలు ఎన్డీయే కూటమిలో చేరుతారనే వార్తలు వినిపించిన నేపథ్యంలో ఈ కలయిక ఆసక్తికరంగా మారింది.
Modiji interacting with Priyanka G & Kharge ji while RaGa stands there like a lost child! pic.twitter.com/q3JO9uSPkm
— 🦋Anjna🦋 (@SaffronQueen_) August 12, 2026
తాజావార్తలు
-
CM Chandrababu: స్థానిక ఎన్నికలకు సిద్ధం కండి.. కూటమిలో గ్యాప్ వద్దు.. అభ్యర్థుల ఎంపికపై చంద్రబాబు కీలక వ్యాఖ్యలు
-
Off The Record: కేసీఆర్ సీఎం అయ్యాకే అసెంబ్లీకి వస్తారా..?
-
Nitin Gadkari: ట్రాఫిక్ రూల్స్ ఉల్లంఘిస్తే లైసెన్స్ రద్దు.. గడ్కరీ కీలక ప్రకటన
-
Trump: ముదురుతోన్న అమెరికా-కెనడా వాణిజ్య యుద్ధం.. కార్నీపై ట్రంప్ ఆగ్రహం
-
Konda Surekha : కొండా సురేఖకు ఫైనల్ షాక్.. బర్తరఫ్కు గవర్నర్ ఓకే..
ట్రెండింగ్
-
243 కి.మీ రేంజ్, 90 కి.మీ టాప్ స్పీడ్.. రూ.1.10 లక్షలకే Simple Wave ఎలక్ట్రిక్ స్కూటర్ లాంచ్..!
-
Rohit Sharma Retirement: రిటైర్మెంట్కు అంగీకరించిన రోహిత్ శర్మ.. సంచలన రిపోర్ట్!
-
6 రోజుల బ్యాటరీ, 24 గంటల బీపీ మానిటరింగ్.. HUAWEI WATCH D3 లాంచ్.!
-
204hp పవర్, 480Nm టార్క్.. 7-సీటర్ SUVగా రీఎంట్రీ ఇవ్వబోతున్న Mitsubishi Pajero.!
-
7050mAh బ్యాటరీ, 144Hz AMOLED డిస్ప్లే, 50MP సోనీ కెమెరాతో VIVO T5 ఫోన్ లాంచ్!