MS Dhoni-CSK: చెన్నై సూపర్ కింగ్స్కు ఎంఎస్ ధోనీ గుడ్బై!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
MS Dhoni Unlikely to Play in IPL 2027: టీమిండియా దిగ్గజం, చెన్నై సూపర్ కింగ్స్ (సీఎస్కే) మాజీ కెప్టెన్ ఎంఎస్ ధోనీ భవిష్యత్తుపై మరోసారి ఆసక్తికర చర్చ మొదలైంది. ఇప్పటికే 45 ఏళ్ల వయసులో ఉన్న ధోనీ.. వచ్చే ఐపీఎల్ సీజన్లో ఆటగాడిగా కొనసాగుతాడా లేదా అన్నదానిపై ఇంకా స్పష్టత లేదు. అయితే ప్రముఖ జర్నలిస్ట్ రోహిత్ జుగ్లాన్ తాజాగా చేసిన వ్యాఖ్యలను బట్టి చూస్తే.. ఐపీఎల్ 2027లో అభిమానులు ధోనీని ఆటగాడిగా చూడటం కష్టమే. ధోనీ వచ్చే సీజన్లో ఆటగాడిగా బరిలోకి దిగకపోవచ్చని రోహిత్ జుగ్లాన్ పేర్కొన్నాడు.
అయితే ఎంఎస్ ధోనీ పూర్తిగా సీఎస్కేకు దూరమయ్యే అవకాశం లేదని తెలుస్తోంది. ఆటగాడిగా కాకుండా జట్టు సపోర్ట్ స్టాఫ్లో కీలక బాధ్యతలు చేపట్టే అవకాశం ఉందనే చర్చ సోషల్ మీడియాలో జోరుగా జరుగుతోంది. ధోనీ ఏ హోదాలో సీఎస్కేతో కొనసాగుతాడనే దానిపై ఇప్పటివరకు ఎలాంటి సమాచారం లేదు. మెంటార్గా లేదా జట్టులో మరింత కీలకమైన బాధ్యతల్లో అతడిని కొనసాగించే అవకాశం ఉందనే ఊహాగానాలు వినిపిస్తున్నాయి.
Also Read
- Imam ul Haq Ban: గాయం అంటూ నాటకాలు.. పాక్ ఓపెనర్ ఇమామ్ ఉల్ హక్పై రెండేళ్ల నిషేధం!
- Rohit Sharma Retirement: రిటైర్మెంట్కు అంగీకరించిన రోహిత్ శర్మ.. సంచలన రిపోర్ట్!
- Chamari Athapaththu: కెప్టెన్ సంచలనం.. 5 పరుగులిచ్చి 7 వికెట్లు డౌన్..! హ్యాట్రిక్ కూడాను..
- ICC Cricket World Cup 2027: ప్రపంచకప్లో టీమ్ఇండియా ఎక్స్ఫ్యాక్టర్ ఎవరు..? జాంటీ రోడ్స్ సంచలన వ్యాఖ్యలు..
చెన్నై సూపర్ కింగ్స్లో ఇప్పటికే మార్పులు మొదలయ్యాయి. చాలా ఏళ్లుగా హెడ్ కోచ్గా సేవలందించిన స్టీఫెన్ ఫ్లెమింగ్తో సీఎస్కే బంధం ముగిసింది. దీంతో వచ్చే సీజన్కు కొత్త హెడ్ కోచ్ రానున్నాడు. కొత్త కోచ్ రాకతో జట్టు కోచింగ్, సపోర్ట్ స్టాఫ్ వ్యవస్థలో కూడా మార్పులు జరిగే అవకాశం ఉంది. ఈ మార్పులన్నీ పూర్తయిన తర్వాతే ఎంఎస్ ధోనీ భవిష్యత్తుపై స్పష్టమైన నిర్ణయం వెలువడే అవకాశం ఉందని తెలుస్తోంది. ఆటగాడిగా ధోనీ రిటైర్ అయితే సీఎస్కేకు అతడి అనుభవం ఎంతో ఉపయోగపడనుంది. కెప్టెన్గా ఐదు ఐపీఎల్ టైటిళ్లు అందించిన ధోనీకి డ్రెస్సింగ్ రూమ్లోనే కాకుండా ఫ్రాంచైజీ నిర్ణయాల్లోనూ అపారమైన అనుభవం ఉంది. అందువల్ల మెంటార్ లేదా సపోర్ట్ స్టాఫ్లో కీలక వ్యక్తిగా అతడిని కొనసాగించే అవకాశం లేకపోలేదు.
ప్రస్తుతం సీఎస్కే కొత్త కోచ్ నియామకంపైనే ప్రధానంగా దృష్టి పెట్టినట్లు తెలుస్తోంది. కొత్త కోచ్ ఎవరు అనేది తేలిన తర్వాత ఎంఎస్ ధోనీని ఏ పాత్రలో కొనసాగించాలనే అంశంపై కూడా స్పష్టత వచ్చే అవకాశం ఉంది. వచ్చే సీజన్ వేలానికి ముందు రిటెన్షన్స్, ట్రేడ్స్, ఆటగాళ్ల విడుదల వంటి అంశాల్లో సీఎస్కేలో మార్పులు చోటుచేసుకునే అవకాశం ఉంది. తాజా సమాచారం ప్రకారం ఐపీఎల్ 2027లో ధోనీ ఆటగాడిగా కనిపించే అవకాశాలు చాలా చాలా తక్కువ. అయితే అతడు సీఎస్కేతో ఏదో ఒక కీలక పాత్రలో కొనసాగుతాడా లేదా అనేది మాత్రం ఇంకా తెలియరాలేదు. ధోనీ అభిమానులు మాత్రం తమ అభిమాన ఆటగాడిని మరోసారి మైదానంలో చూడాలని ఆశిస్తున్నారు. చూడాలి మరి ఏం జరుగుతుందో.
తాజావార్తలు
-
Kamal : సిద్ధా’ డైరెక్టర్తో కమల్ హాసన్ పవర్ ప్యాక్డ్ ప్రాజెక్ట్..
-
Whatsapp Update: ఇకపై వాట్సాప్ నుంచే కరెంట్, వాటర్ బిల్లులు.. 22 వేలకుపైగా బిల్లర్లతో సరికొత్త సేవలు.!
-
Yasha Nagula : యూట్యూబ్ను షేక్ చేసిన ‘యేషనాగుల’.. 5 రోజుల్లోనే 50 మిలియన్ల వ్యూస్!
-
Konda Surekha: నేనేం తప్పు చేశాను.. కాంగ్రెస్ అధిష్టానంతో యుద్ధానికి సిద్ధమవుతున్న మంత్రి సురేఖ!
-
Chadalawada : పదవులు కావాల్సింది సీఎంల పక్కన ఫోటోలకా?
ట్రెండింగ్
-
243 కి.మీ రేంజ్, 90 కి.మీ టాప్ స్పీడ్.. రూ.1.10 లక్షలకే Simple Wave ఎలక్ట్రిక్ స్కూటర్ లాంచ్..!
-
Rohit Sharma Retirement: రిటైర్మెంట్కు అంగీకరించిన రోహిత్ శర్మ.. సంచలన రిపోర్ట్!
-
6 రోజుల బ్యాటరీ, 24 గంటల బీపీ మానిటరింగ్.. HUAWEI WATCH D3 లాంచ్.!
-
204hp పవర్, 480Nm టార్క్.. 7-సీటర్ SUVగా రీఎంట్రీ ఇవ్వబోతున్న Mitsubishi Pajero.!
-
7050mAh బ్యాటరీ, 144Hz AMOLED డిస్ప్లే, 50MP సోనీ కెమెరాతో VIVO T5 ఫోన్ లాంచ్!