Speaker Ayyanna Patrudu: ఎమ్మెల్యేల హాజరుకు ఇక కెమెరాలే సాక్ష్యం.. స్పీకర్ అయ్యన్న సంచలన నిర్ణయం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Speaker Ayyanna Patrudu: వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు.. ముఖ్యంగా వైఎస్ జగన్ ఈ సారైనా అసెంబ్లీ సమావేశాలకు హాజరు అవుతారా అనే విషయంపై ఉత్కంఠ కొనసాగుతూనే ఉంది.. అయితే, కాకినాడ జిల్లా తునిలో ఏపీ అసెంబ్లీ స్పీకర్ అయ్యన్నపాత్రుడు కీలక వ్యాఖ్యలు చేశారు. అసెంబ్లీ సమావేశాలకు హాజరుకాని ఎమ్మెల్యేల జీతాలను వెనక్కి తీసుకునేలా పార్లమెంట్లో చట్టం చేయాలని కేంద్ర ప్రభుత్వాన్ని కోరినట్లు తెలిపారు. ప్రజలు తమ సమస్యలను అసెంబ్లీలో ప్రస్తావించి పరిష్కరిస్తారనే నమ్మకంతో ఎమ్మెల్యేలను ఎన్నుకుంటారని, అందువల్ల ప్రజా ప్రతినిధులు అసెంబ్లీ సమావేశాలకు తప్పనిసరిగా హాజరుకావాలని అన్నారు.
ఇక, మాజీ సీఎం, వైసీపీ అధినేత జగన్ అసెంబ్లీ సమావేశాలకు హాజరు కావాలని అయ్యన్నపాత్రుడు సూచించారు. ప్రజలు తమ సమస్యలను అసెంబ్లీలో చర్చించి పరిష్కరిస్తారనే ఉద్దేశంతోనే జగన్ను గెలిపించారని వ్యాఖ్యానించారు. ప్రజలకు జవాబుదారీగా ఉండాల్సిన ప్రజాప్రతినిధులు అసెంబ్లీకి వచ్చి తమ బాధ్యతలను నిర్వర్తించాలని అన్నారు. ఎమ్మెల్యేల హాజరుపై ఇక నుంచి ప్రత్యేక విధానం అమలు చేయనున్నట్లు స్పీకర్ తెలిపారు. అసెంబ్లీలో ఎమ్మెల్యేలకు కేటాయించిన సీట్లలో వారు కూర్చుంటే ఆటోమేటిక్గా కెమెరాలు ఆన్ అవుతాయని చెప్పారు. సీట్లో కూర్చున్నప్పుడే వారి హాజరును లెక్కల్లోకి తీసుకుంటామని స్పష్టం చేశారు.
Also Read
- Kakinada: కాలేజ్ యాజమాన్యం వేధింపులకి విద్యార్థి బలి.. మనస్దాపంతో ఉరి వేసుకుని విద్యార్ది ఆత్మహత్య.!
- Jyothula Nehru: ముద్రగడ సంస్మరణ సభకు వెళ్లడంపై స్పందించిన జ్యోతుల నెహ్రూ.. ఆసక్తికర వ్యాఖ్యలు
- Thota Trimurthulu: కాపులు గెలవకపోయినా గెలిపిస్తారు.. తోట త్రిమూర్తులు కీలక వ్యాఖ్యలు
- Mudragada Padmanabham: మరణానంతరం ఎలా ఉండాలో ముందే లేఖ రాసిన ముద్రగడ.. ఆసక్తికర అంశాలు
అసెంబ్లీ సమావేశాలు ఎన్ని రోజులు నిర్వహించాలనే అంశంపై ఈ నెల 17న జరిగే బీఏసీ సమావేశంలో నిర్ణయం తీసుకుంటామని అయ్యన్నపాత్రుడు తెలిపారు. సమావేశాల నిర్వహణ, చర్చించాల్సిన అంశాలపై బీఏసీలో చర్చించి నిర్ణయం తీసుకుంటామని పేర్కొన్నారు. మరోవైపు.. డీఎస్సీ అంశంపై కూడా స్పీకర్ అయ్యన్నపాత్రుడు వైసీపీ నేతలపై విమర్శలు చేశారు. డీఎస్సీపై జగన్, వైసీపీ నేతలు తప్పుడు ప్రచారం చేస్తున్నారని ఆరోపించారు. ఉద్యోగాలు పొందిన వారిని సైతం హేళన చేస్తున్నారని విమర్శించారు. జగన్కు ‘స్పోర్ట్స్ కోటా’ అంటే ఏమిటో తెలుసా? అంటూ ప్రశ్నించారు. ప్రభుత్వ పాలన నచ్చకపోతే ప్రజలే ప్రభుత్వాన్ని మార్చుతారని అయ్యన్నపాత్రుడు అన్నారు. ప్రభుత్వాన్ని మార్చడానికి జగన్ ఎవరు? అని ప్రశ్నించారు. ప్రజాస్వామ్యంలో అంతిమ నిర్ణయం ప్రజలదేనని, ప్రజలు కోరుకుంటేనే ప్రభుత్వం మారుతుందని వ్యాఖ్యానించారు ఏపీ అసెంబ్లీ స్పీకర్ అయ్యన్నపాత్రుడు..
తాజావార్తలు
-
Speaker Ayyanna Patrudu: ఎమ్మెల్యేల హాజరుకు ఇక కెమెరాలే సాక్ష్యం.. స్పీకర్ అయ్యన్న సంచలన నిర్ణయం
-
Priyanka Chopra : ప్రియాంకా చోప్రా గ్లోబల్ బ్రాండ్ ఇంత స్ట్రాంగ్గా ఎలా మారింది?
-
200MP ట్రిపుల్ కెమెరా సెటప్, 8,580mAh బ్యాటరీ, 185Hz డిస్ప్లేతో REDMI K100 Pro లాంచ్.. ధర ఎంతంటే?
-
Donald Trump: అమెరికా అధ్యక్షుడి రహస్య ప్రయాణం.. అసలు కారణం ఇదే!
-
Fauji vs Eta: ప్రభాస్ ‘ఫౌజీ’కి బిగ్ టెన్షన్.. హిందీ బెల్ట్లో గట్టి పోటీ!
ట్రెండింగ్
-
Abishek Porel Arrest: అత్యాచారం, బెదిరింపులు.. ఐపీఎల్ స్టార్ అరెస్ట్!
-
Gold Rate Today: బంగారం, వెండి ధరలకు రెక్కలు.. ఏకంగా రూ.10 వేలు!
-
Tulsi Plant Care Tips: వర్షాకాలంలో తులసి మొక్క గుబురుగా, పచ్చగా పెరగాలా.. సింపుల్గా ఈ చిట్కాలను ఫాలో అవ్వండి చాలు.!
-
Virat Kohli Bowler: బెస్ట్ బౌలర్గా విరాట్ కోహ్లీ.. షాక్ అవుతున్న క్రికెట్ ఫాన్స్!
-
YouTube Monetization Rules 2027: కొత్త యూట్యూబర్లకు బిగ్ షాక్.. మోనిటైజేషన్ నిబంధనలను రెట్టింపు చేసిన యూట్యూబ్..