నిత్యం తన పర్సనల్‌, ప్రొఫెషనల్‌ విషయాలను పంచుకుంటుంది. అలాగే తన సొంత యూట్యూబ్‌ ఛానెల్‌తో పంచుకుంటోంది.

ప్రముఖ యాంకర్ లాస్య మరోసారి తల్లికానుంది. ఇటీవల తాను గర్భం దాల్చినట్లు భర్త మంజునాథ్‌తో కలిసి సోషల్‌ మీడియా వేదికగా ప్రకటించిందీ.

తాజాగా ఆమె సీమంతం వేడుకలు గ్రాండ్‌గా జరిగాయి. పలువురు బుల్లితెర సెలబ్రిటీలు ఈ వేడుకకు హాజరయ్యారు. 

ఈ వేడుకకు సంబంధించిన ఫొటోలు, వీడియోలు ప్రస్తుతం సోషల్‌ మీడియాలో వైరల్గా మారుతున్నాయి. 

నెటిజన్లందరూ లాస్య దంపతులకు అభినందనలు తెలుపుతున్నారు. కాగా 2017లో మంజునాథ్‌ను ప్రేమ వివాహం చేసుకుంది లాస్య. 

వీరి ప్రేమకు ప్రతిరూపంగా 2019లో దక్ష్‌ అనే కుమారుడికి జన్మనిచ్చింది.