AP Government Schools: ప్రైవేట్ స్కూళ్లకు షాక్.. ప్రభుత్వ పాఠశాలల్లో భారీగా విద్యార్థుల చేరిక
- ప్రైవేట్ నుండి ప్రభుత్వ పాఠశాలల్లో లక్షకు పైగా విద్యార్థుల చేరిక..
- ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల హాజరు, అభ్యసన ఫలితాలపై దృష్టి సారించాలి..
- ప్రాథమికోన్నత పాఠశాలల్లో గరిష్ట సామర్థ్యానికి విద్యార్థుల ప్రవేశాలు..
- ప్రైవేటు పాఠశాలల్లో అధిక ఫీజుల నియంత్రణపై అధ్యయనం చేయండి..
- సెప్టెంబర్ 5 నుంచి 9,10 తరగతి విద్యార్థులకు ఏఐ ట్యూటర్ విధానం..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
AP Government Schools:ప్రభుత్వ పాఠశాలల్లో ఈ విద్యా సంవత్సరంలో విద్యార్థుల హాజరు శాతం, అభ్యసన ఫలితాల మెరుగుదలపై ప్రత్యేక దృష్టి సారించాలని విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ అధికారులను ఆదేశించారు. ఉండవల్లిలోని తన నివాసంలో పాఠశాల విద్యాశాఖ అధికారులతో నిర్వహించిన సమీక్ష సమావేశంలో ఆయన పలు కీలక సూచనలు చేశారు. విద్యారంగంలో చేపట్టిన సంస్కరణల ఫలితంగా ఈ ఏడాది ప్రైవేట్ పాఠశాలల నుంచి ప్రభుత్వ పాఠశాలలకు 1.06 లక్షల మంది విద్యార్థులు కొత్తగా చేరినట్లు అధికారులు వెల్లడించారు.
రాష్ట్రవ్యాప్తంగా 7,620 ప్రాథమికోన్నత పాఠశాలలు ఉండగా, వాటిలో 3,515 పాఠశాలలు (46.13 శాతం) గరిష్ట సామర్థ్యానికి చేరుకున్నాయని అధికారులు వివరించారు. విద్యా ప్రమాణాల మెరుగుదలతో పాటు ప్రభుత్వ పాఠశాలలపై తల్లిదండ్రుల విశ్వాసం పెరగడం వల్లే ఈ మార్పు సాధ్యమైందని పేర్కొన్నారు. అలాగే ఈ ఏడాది 159 పాఠశాలలు ఆదర్శ ప్రాథమిక పాఠశాలలుగా రూపాంతరం చెందాయని తెలిపారు.
Also Read
- Deputy CM Pawan Kalyan: గురువాయూరప్ప సన్నిధిలో ఏపీ డిప్యూటీ సీఎం.. ప్రత్యేక పూజలు చేసిన పవన్..
- AP Weather Alert: 2 రోజుల పాటు విస్తారంగా వర్షాలు.. ఈ జిల్లాలకు హెచ్చరికలు
- AP Government: వడ్డెర్లకు ఏపీ ప్రభుత్వం గుడ్న్యూస్.. 16 జిల్లాల్లో 32 చోట్ల క్వారీ భూములు.. 50% రాయితీ
- CM Chandrababu: Gen Zపై సీఎం చంద్రబాబు ఆసక్తికర వ్యాఖ్యలు..
సమావేశంలో ప్రైవేట్ పాఠశాలల్లో అధిక ఫీజుల నియంత్రణ అంశంపైనా చర్చ జరిగింది. ఇతర రాష్ట్రాలు అమలు చేస్తున్న విధానాలను అధ్యయనం చేసి, రాష్ట్రానికి అనువైన విధానాన్ని రూపొందించాలని మంత్రి అధికారులను ఆదేశించారు. ఇదే సమయంలో విద్యలో సాంకేతికత వినియోగాన్ని విస్తరించే దిశగా చర్యలు చేపడుతున్నట్లు అధికారులు వివరించారు. సెప్టెంబర్ 5 నుంచి తొలి దశలో 175 లీప్ పాఠశాలల్లో 9, 10 తరగతుల విద్యార్థులకు గణితం, సైన్స్ అంశాల్లో ఏఐ ట్యూటర్ను ప్రీ-పైలట్ ప్రాజెక్టుగా ప్రవేశపెట్టనున్నట్లు తెలిపారు. భవిష్యత్తులో క్లిక్కర్స్ వ్యవస్థతో ఏఐ ట్యూటర్ను అనుసంధానించాలని లోకేష్ సూచించారు.
అదేవిధంగా ఐఈఆర్పీఎస్ రెగ్యులరైజేషన్, హైస్కూల్ ప్లస్లలో గెస్ట్ లెక్చరర్ల నియామకంపై కూడా సమావేశంలో చర్చ జరిగింది. మరోవైపు అమరావతిలో స్టేట్ సెంట్రల్ లైబ్రరీ, విశాఖపట్నంలో జిల్లా కేంద్ర గ్రంథాలయం, మంగళగిరిలో స్కిల్ ఎక్సలెన్స్ సెంటర్ నిర్మాణ ప్రతిపాదనలను మంత్రి పరిశీలించారు. వచ్చే నెలలో అమరావతిలో స్టేట్ సెంట్రల్ లైబ్రరీ నిర్మాణానికి శంకుస్థాపన చేయనున్నట్లు అధికారులు వెల్లడించారు.
తాజావార్తలు
-
Best Investment Scheme: పథకం చిన్నదే.. కానీ కోటీశ్వరులను చేస్తుంది.. 18 ఏళ్లు నిండిన వారు అర్హులు..
-
Vijay – Trisha: దళపతి విజయ్ అలా ఎందుకు చేశాడు? పాపం త్రిష! వీడియో వైరల్..
-
Dinesh Karthik: టెస్టు క్రికెట్ను పాకిస్థాన్ మర్చిపోవడం మంచిది.. ఘోరమైన స్థితిలో పాక్ జట్టు..
-
Vaibhav Sooryavanshi Tears: వైభవ్ సూర్యవంశీ కంటతడి.. వీడియో, ఫొటోస్ వైరల్!
-
Ravi Shastri: పుతిన్, మోడీ, జిన్పింగ్.. బ్రిక్స్పై రవిశాస్త్రి సంచలన పోస్ట్..
ట్రెండింగ్
-
Smriti Mandhana: హార్డెస్ట్ నైట్.. స్మృతి మంధానను వెంటాడుతున్న ఆ జ్ఞాపకం!
-
Head Coach: హెడ్ కోచ్గా సౌరవ్ గంగూలీ.. అసిస్టెంట్ కోచ్గా యువరాజ్ సింగ్!
-
International Chocolate Day : చాక్లెట్ ప్రియులకు స్పెషల్ డే.. ఈ రోజు ఎందుకంత స్పెషల్?
-
Ganesh Chaturthi AI Prompts: మీ స్వంత ఫొటోలతో AI ఉపయోగించి గణపతి శుభాకాంక్షలు చెప్పండి.. ప్రాంప్ట్స్ ఇదిగో మీకోసం..!
-
Moto Buds 2 Fusion: 55dB ANC, 13 గంటల ప్లేబ్యాక్తో సెప్టెంబర్ 15న భారత్లో లాంచ్ కానున్న Moto Buds 2 Fusion.!