Apple Products: బిగ్షాక్ ఇచ్చిన యాపిల్.. వాటి ధరలు భారీగా పెంపు.. లక్ష వరకు పెరిగిన రేట్లు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
గ్లోబల్ సప్లై చైన్లో మెమొరీ భాగాల ధరలు విపరీతంగా పెరగడం వల్ల యాపిల్ సంస్థ భారతదేశంలో తన మ్యాక్బుక్, ఐప్యాడ్ ధరలను భారీగా పెంచింది. కొన్ని మోడళ్లపై ఏకంగా రూ. 1 లక్ష వరకు ధర పెరిగింది. ఈ ధరల పెరుగుదల అనివార్యమని యాపిల్ సీఈఓ టిమ్ కుక్ ముందే సూచించగా.. ప్రస్తుతం పెరిగిన కొత్త ధరలు యాపిల్ ఇండియా వెబ్సైట్లో అందుబాటులోకి వచ్చాయి.
మ్యాక్బుక్ కొత్త ధరల వివరాలిలా..
మ్యాక్బుక్ ఎయిర్ 13-ఇంచ్ (M5).. దీని లాంచ్ ధర రూ. 1,19,900 కాగా, ఇప్పుడు రూ. 30,000 పెరిగి రూ. 1,49,900 కి చేరింది. మ్యాక్బుక్ ఎయిర్ 15-ఇంచ్.. దీని ధర రూ. 1,44,900 నుండి రూ. 35,000 పెరిగి రూ. 1,79,900 అయింది. మ్యాక్బుక్ ప్రో 14-ఇంచ్.. దీనిపై ఏకంగా రూ. 70,000 పెరిగింది. లాంచ్ ధర రూ. 1,69,900 ఉండగా, ఇప్పుడు రూ. 2,39,900 కి చేరింది. మ్యాక్బుక్ ప్రో 14-ఇంచ్.. దీనిపై అత్యధికంగా రూ. 1,00,000 (లక్ష రూపాయలు) ధర పెరిగింది. మ్యాక్బుక్ నియో.. విద్యార్థులను ఉద్దేశించి తెచ్చిన ఈ బడ్జెట్ లాప్టాప్ ధర రూ. 69,900 నుంచి రూ. 10,000 పెరిగి రూ. 79,900 కి చేరింది.
Also Read
- ఓపెన్-ఇయర్ డిజైన్, AI కాలింగ్ ఫీచర్స్, 37 గంటల బ్యాటరీతో Sony LinkBuds Clip భారత్లో లాంచ్.!
- iQOO 16: ఐకూ 16 వచ్చేస్తోంది.. 8,500mAh భారీ బ్యాటరీ, Snapdragon ఫ్లాగ్షిప్ చిప్తో అదిరే ఫీచర్లు!
- 5G, 4G మోడళ్లతో ఎంట్రీ ఇవ్వనున్న Lava Virat V1 సిరీస్.. ఫీచర్స్ ఇవే.!
- Acer Sospiro A15: ఏసర్ సోస్పిరో A15 విడుదల.. డ్యూయల్ డిస్ప్లే, 64MP కెమెరా, 5000mAh బ్యాటరీ
ఐప్యాడ్ కొత్త ధరల వివరాలు..
ఐప్యాడ్ ఎయిర్ 11-ఇంచ్ (M4).. దీని ధర రూ. 64,900 నుంచి రూ. 25,000 పెరిగి రూ. 89,900 కి చేరింది. ఐప్యాడ్ ప్రో (256GB, M5).. గత ఏడాది రూ. 99,990 కి లాంచ్ అవ్వగా, ఇప్పుడు రూ. 39,910 పెరిగి రూ. 1,39,900 కి చేరింది.
ధరల పెరుగుదలకు కారణం..
యాపిల్ ఉత్పత్తులలో వాడే హై-పెర్ఫార్మెన్స్ మెమొరీ మోడ్యూల్స్ (RAM) ధరలు అంతర్జాతీయ మార్కెట్లో మునుపెన్నడూ లేనంత వేగంగా పెరిగాయి. దీనిపై యాపిల్ స్పందిస్తూ.. ‘మేము ఇంతవరకు ఈ భారాన్ని వినియోగదారులపై పడకుండా కాపాడుకుంటూ వచ్చాము, కానీ ప్రస్తుత పరిస్థితుల్లో ధరలు పెంచక తప్పలేదు’ అని తెలిపింది. భారతదేశంతో పాటు అమెరికా మార్కెట్లో కూడా యాపిల్ తమ ఉత్పత్తుల ధరలను పెంచింది. సైబర్ మీడియా రీసెర్చ్ వైస్ ప్రెసిడెంట్ ప్రభు రామ్ అభిప్రాయం ప్రకారం.. యాపిల్ లాంటి పెద్ద సంస్థే ధరలు పెంచిందంటే, రాబోయే రోజుల్లో ఇతర ఎలక్ట్రానిక్ బ్రాండ్స్ కూడా ధరలు పెంచే అవకాశం ఉంది. ఈ నిర్ణయం విద్యార్థులు, ప్రొఫెషనల్స్ కొనుగోలు నిర్ణయాలపై ప్రభావం చూపనుంది.
తాజావార్తలు
-
Rohit Sharma and Virat Kohli: రోహిత్-కోహ్లీ ఫ్లాప్ షో.. తొలి వన్డేలో వరుస ఓవర్లలో పెవిలియన్ బాట
-
Off The Record: నోరు అదుపులో లేక.. మాట పొదుపు లేక ఆ తండ్రి కొడుకులు ఇరుకున పడ్డారా?
-
OTR: సింగనమల వైసీపీలో సెగలు..
-
OTR: తాడేపల్లిగూడెం వైసీపీలో ముదిరిన వర్గపోరు..
-
Trump-Iran: ట్రంప్ సంచలన ప్రకటన.. హార్ముజ్ కార్గో ఫీజు రద్దు.. ఇరాన్ నౌకలపై దిగ్బంధం అమలు
ట్రెండింగ్
-
స్టైలిష్ డిజైన్, పానోరమిక్ సన్రూఫ్తో కొత్త Renault Duster Adventure ఎడిషన్ లాంచ్.! ధర ఎంతంటే.?
-
ఏడు నెలల్లో మూడోసారి ధరల పెంపు.. Mahindra Thar కొత్త రేట్లు ఇవే..!
-
CSK Head Coach: సీఎస్కే కొత్త కోచ్ రేసులో ముగ్గురు.. భారత్ నుంచి ఇద్దరు క్రికెట్ దిగ్గజాలు!
-
Poha: 10 నిమిషాల్లో టేస్టీ అటుకుల పులిహోర.. ఇలా చేస్తే రుచి అదిరిపోతుంది..!
-
Ashleigh Gardner Controversy: ఆసీస్ మహిళా క్రికెటర్ల మధ్య అక్రమ సంబంధం.. భార్య ఉండగానే సహచర ప్లేయర్తో ఎఫైర్!