Ketan Agarwal Case: కేతన్ హత్యకు ముందు, తర్వాత చాట్స్ డిలీట్.. సియా-చేతన్ ఫోన్లలో కీలక ఆధారాలు
- హత్యకు ముందు, తర్వాత చాట్ హిస్టరీ డిలీట్..
- కేతన్ హత్య కేసులో ఆధారాలు నాశనం చేసిన సియా, చేతన్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Ketan Agarwal Case: కేతన్ అగర్వాత్ హత్య కేసులో విచారణ వేగవంతమైంది. నిందితులు సియా గోయల్, ఆమె ప్రియుడు చేతన్ చౌదరిలు హత్యకు ముందు, ఆ తర్వాత తమ మొబైల్ ఫోన్లలో చాట్ హిస్టరీ డిలీట్ చేసినట్లుగా పోలీసులు గుర్తించారు. కీలక ఆధారాలను నాశనం చేసే ప్రయత్నంలోనే ఇలా చేసినట్లు తెలుస్తోంది. జూన్ 18న లోహ్గఢ్ కోటపై నుంచి కేతన్ను తోసేసి సియా హత్యకు పాల్పడింది. ఆ తర్వాత ఇద్దరూ చాట్ హస్టరీలను, రీసైకిల్ బిన్లోని డేటాను తొలగించినట్లు ప్రాథమిక దర్యాప్తులో తేలింది. దీంతో వారిద్దరి మొబైళ్లను ఫోరెన్సిక్ ల్యాబ్కు పంపించారు. డిలీట్ అయిన డేటాను రికవరీ చేసే ప్రయత్నాలు చేస్తున్నారు.
కేతన్తో వివాహం ఇష్టం లేని సియా పక్కా పథకం ప్రకారం హత్యకు పాల్పడింది. దీనికి ఆమె లవర్ చేతన్ సహకరించినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. హత్యకు ముందు ఏడాది కాలంలో సియా, చేతన్ మధ్య మొత్తం 2004 ఫోన్ కాల్స్ జరిగాయని, దాదాపుగా 238 గంటలు మాట్లాడుకున్నట్లుగా పోలీసులు గుర్తించారు. హత్యకు ముందు ఇద్దరూ ఓ కేఫేలో కలుసుకుని కుట్ర అమలు గురించి చివరిసారిగా చర్చించుకున్నట్లు తేలింది.
Also Read
- Tarun Tejpal: భారత మీడియాను ఊపేసిన కేసులో క్లైమాక్స్.. ‘తెహల్కా’ వ్యవస్థాపకుడికి హైకోర్టులో బిగ్ షాక్..
- Bear Kills Siblings: ఎలుగుబంటి బీభత్సం.. అన్నాచెల్లెళ్లపై దాడి, ఇద్దరి మృతి..!
- House Collapse: నిద్రలోనే తెల్లారిన బతుకులు.. 100 ఏళ్ల నాటి ఇల్లు కూలి ఒకే కుటుంబానికి చెందిన ఆరుగురు మృతి
- Sonam Wangchuk: అర్ధరాత్రి వేళ మాట ఇచ్చి మోసం చేశారు.. కేంద్ర మంత్రుల తీరుపై సోనమ్ వాంగ్చుక్ ఆవేదన
ఈ హత్యలో ప్లాన్ ప్రకారం, కోట వద్ద సియా నేలపై కూర్చోవడం ద్వారా చేతన్కు సిగ్నల్ ఇచ్చిందని, ఆ వెంటనే వెనక నుంచి వచ్చి కేతన్ను లోయలో తోసినట్లు పోలీసులు చెబుతున్నారు. మొదట సంఘటనా స్థలంలో తాను లేనట్లు చేతన్ అబద్ధాలు చెప్పినా, చివరకు ఇద్దరు ఈ హత్యలో తమ పాత్ర ఉన్నట్లు అంగీకరించారు. ఈ కేసులో సియా సోదరుడు, ఇతర కుటుంబ సభ్యుల్ని కూడా ప్రశ్నించే అవకాశం ఉంది. మరోవైపు, కేతన్ కుటుంబ కోరిక మేరకు మహారాష్ట్ర ప్రభుత్వం ఈ కేసును ఫాస్ట్ ట్రాక్ కోర్టులో విచారించేందుకు అంగీకరించింది. ప్రత్యేక పబ్లిక్ ప్రాసిక్యూటర్గా న్యాయవాది ఉజ్వల్ నికమ్ను నియమించింది. ఈయన ముంబై దాడుల ఉగ్రవాది కసబ్కు ఉరిశిక్ష పడేలా చేశారు.
తాజావార్తలు
-
Hero Pleasure Plus: మరింత స్టైలిష్గా హీరో ప్లెజర్ ప్లస్.. కొత్త Aqua Grey కలర్లో విడుదల!
-
YCP vs TDP: బెజవాడలో ఉద్రిక్తత.. వైసీపీ దీక్షా శిబిరం టెంట్ తొలగించిన టీడీపీ శ్రేణులు!
-
Preity Zinta: ‘సగం ఇండియన్, సగం అమెరికన్… పిల్లలకు ఇండియన్ రూట్స్… ఎనిమిదేళ్ల రీఎంట్రీపై ప్రీతి ఆసక్తికర వ్యాఖ్యలు!
-
Tarun Tejpal: భారత మీడియాను ఊపేసిన కేసులో క్లైమాక్స్.. ‘తెహల్కా’ వ్యవస్థాపకుడికి హైకోర్టులో బిగ్ షాక్..
-
Mega Multistarrer : ఒకే స్క్రీన్పై వరుణ్ తేజ్ – నాగబాబు.. భారీ బడ్జెట్ పై నిర్మిస్తున్న నిహారిక
ట్రెండింగ్
-
Incredible Story: దేశవాళీ క్రికెట్లో 9 వేల రన్స్.. టీమిండియా డెబ్యూలోనే హాఫ్ సెంచరీ.. కానీ అడ్రస్ లేకుండా పోయిన ఓపెనర్!
-
Bear Kills Siblings: ఎలుగుబంటి బీభత్సం.. అన్నాచెల్లెళ్లపై దాడి, ఇద్దరి మృతి..!
-
Jio మాస్టర్ ప్లాన్.. రూ.319కే 18 నెలల Google AI Pro, 45GB హై-స్పీడ్ డేటా, అన్లిమిటెడ్ కాల్స్..!
-
8,000 నిట్స్ OLED డిస్ప్లే, 8,500mAh భారీ బ్యాటరీ, Kirin 8020 చిప్తో Huawei Nova 16 SE లాంచ్..!
-
Vaibhav Sooryavanshi: వైభవ్ సూర్యవంశీ.. ఎగిరెగిరిపడొద్దు.. ఆ ఇద్దరి కెరీర్ ఏమైందో తెలుసుకో!