Monsoon Diseases: వర్షాకాలంలో విజృంభించే ప్రమాదకర వ్యాధులు ఇవే… వైద్యుల హెచ్చరిక
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Monsoon Diseases: ఇంత కాలం ఎండలు దంచికొట్టాయి.. వర్షాల సీజన్ ప్రారంభమైనా.. ఇక పూర్తిస్థాయిలో వర్షాలు కురవడం లేదు.. అయితే, వర్షాకాలం ఎండల నుంచి ఉపశమనం కలిగించినప్పటికీ, అనేక అంటువ్యాధుల వ్యాప్తికి అనుకూల పరిస్థితులను కూడా సృష్టిస్తుంది. వర్షాల కారణంగా నిల్వ నీరు, అధిక తేమ, నీటి కాలుష్యం పెరగడంతో దోమలు, బ్యాక్టీరియా, వైరస్లు వేగంగా వ్యాప్తి చెందుతాయి. అందుకే ఈ కాలంలో ఆరోగ్యం విషయంలో మరింత అప్రమత్తంగా ఉండాలని వైద్య నిపుణులు సూచిస్తున్నారు.
వైద్యులు చెబుతున్న వివరాల ప్రకారం, వర్షాకాలంలో ప్రధానంగా డెంగీ, మలేరియా, చికున్గున్యా, లెప్టోస్పిరోసిస్, టైఫాయిడ్, కలరా, హెపటైటిస్-ఏ వంటి వ్యాధులు ఎక్కువగా వ్యాపిస్తాయని చెబుతున్నారు..
Also Read
- Idol Cleaning Tips : గణేష్ చతుర్థికి ఇంట్లోనే విగ్రహాలకు ఇలా కొత్త మెరుపు
- Lemon Storage Tips: రసం తగ్గకుండా, రుచి మారకుండా నిమ్మకాయలు నెల రోజులు తాజాగా ఉండాలంటే ఈ సింపుల్ ట్రిక్స్ ఫాలో అయితే చాలు.!
- Health Tips: మంచం ఎక్కిన వెంటనే నిద్ర పట్టాలా.. సింపుల్గా ఇలా చేయండి!
- Sweet Atukulu Recipe: వినాయక చవితి స్పెషల్.. కరకరలాడే అటుకుల తీపి ప్రసాదం.! సులువుగా చేసుకోండి ఇలా..
డెంగీ
నిల్వ నీటిలో పెరిగే ఏడిస్ దోమల ద్వారా డెంగీ వ్యాపిస్తుంది. అధిక జ్వరం, తీవ్రమైన తలనొప్పి, కండరాలు, కీళ్ల నొప్పులు, చర్మంపై దద్దుర్లు దీని ప్రధాన లక్షణాలు. దోమల పెరుగుదలను అరికట్టడం, దోమతెరలు, రిపెల్లెంట్లు ఉపయోగించడం ద్వారా ప్రమాదాన్ని తగ్గించవచ్చు.
మలేరియా
అనోఫిలిస్ దోమల ద్వారా వ్యాపించే మలేరియాలో చలి వణుకుతో కూడిన జ్వరం, అలసట, రక్తహీనత కనిపిస్తాయి. నిల్వ నీరు తొలగించడం, దోమల నివారణ చర్యలు చేపట్టడం అవసరం.
చికున్గున్యా
ఏడిస్ దోమల ద్వారా వ్యాపించే ఈ వైరల్ వ్యాధిలో తీవ్రమైన కీళ్ల నొప్పులు, జ్వరం, వాపులు వారాల తరబడి కొనసాగవచ్చు.
లెప్టోస్పిరోసిస్
వరద నీరు లేదా జంతువుల మూత్రంతో కలుషితమైన నీటి ద్వారా వ్యాపించే ఈ బ్యాక్టీరియా ఇన్ఫెక్షన్ శరీరంలోని చిన్న గాయాల ద్వారా ప్రవేశిస్తుంది. అధిక జ్వరం, తలనొప్పి, కండరాల నొప్పి దీని లక్షణాలు. తీవ్రమైన సందర్భాల్లో కాలేయం, మూత్రపిండాలపై ప్రభావం చూపే అవకాశం ఉంది.
టైఫాయిడ్
కలుషితమైన ఆహారం, నీటి ద్వారా వ్యాపించే టైఫాయిడ్లో దీర్ఘకాలిక జ్వరం, కడుపునొప్పి, బలహీనత, తలనొప్పి కనిపిస్తాయి. పరిశుభ్రమైన ఆహారం, తాగునీరు తీసుకోవడం అత్యంత ముఖ్యం.
కలరా
కలుషిత నీటి ద్వారా వ్యాపించే కలరా వల్ల తీవ్రమైన విరేచనాలు, వాంతులు, డీహైడ్రేషన్ సంభవించవచ్చు. సురక్షితమైన తాగునీరు తీసుకోవడం ద్వారా దీన్ని నివారించవచ్చు.
హెపటైటిస్-ఏ
కలుషితమైన ఆహారం, నీటి ద్వారా వ్యాపించే ఈ వైరల్ వ్యాధి కాలేయాన్ని ప్రభావితం చేస్తుంది. కామెర్లు, అలసట, వికారం, కడుపు నొప్పి వంటి లక్షణాలు కనిపిస్తాయి.
వర్షాకాలంలో ఎలా జాగ్రత్తపడాలి?
వర్షాకాలంలో నిల్వ నీటిని తొలగించడం, దోమల నివారణ చర్యలు తీసుకోవడం, మరిగించిన లేదా శుద్ధి చేసిన నీటిని మాత్రమే తాగడం, ఆహార పరిశుభ్రత పాటించడం, వ్యక్తిగత పరిశుభ్రతను కాపాడుకోవడం చాలా ముఖ్యం. జ్వరం, విరేచనాలు లేదా ఇతర లక్షణాలు కనిపించిన వెంటనే వైద్యులను సంప్రదిస్తే సమస్యలు తీవ్రమయ్యే ప్రమాదాన్ని తగ్గించవచ్చని వైద్యులు సూచిస్తున్నారు.
తాజావార్తలు
-
Lava Virat Curve: 3D కర్వ్డ్ AMOLED స్క్రీన్, 6000mAh బ్యాటరీ.. 7100 ప్రాసెసర్, 50MP కెమెరా.. సెప్టెంబర్ 21న లాంచ్..
-
Rajasthan: మున్సిపల్ ఎన్నికల్లో బీజేపీ ప్రభంజనం.. గిరిజన ప్రాంతాల్లో భారీ విజయం
-
Marriage Rumours: ఆ హీరోతో పెళ్లి రూమర్లపై ఓపెన్ అయిన హీరోయిన్!
-
Trump: ఉక్రెయిన్-రష్యా ఇంధన వసతులపై దాడి చేయమని చెప్పాయి.. ట్రంప్ కీలక ప్రకటన
-
Saudi Arabia: సౌదీ అరేబియాకు జాక్పాట్.. మదీనాలో భారీగా యురేనియం నిల్వలు..
ట్రెండింగ్
-
Ganga Aarti in London: లండన్లో తొలిసారి గంగా హారతి.. థేమ్స్ నది తీరంలో ఆధ్యాత్మిక సందడి.!
-
Ragi Drumstick Leaves Roti: డయాబెటిస్, బీపీ ఉన్నవారికి సంపూర్ణ ఆహారం.. సంపూర్ణ పోషణనిచ్చే ‘రాగి మునగాకు రొట్టె’ చేసేయండి ఇలా.!
-
Beetroot Pachadi: బీట్రూట్ అంటే నచ్చదా? ఇలా పచ్చడి చేసి పెట్టండి.. ప్లేట్ మొత్తం ఖాళీ చేసేస్తారు.!
-
India Women: నాలుగింటిలో నాలుగు.. ఆరింటిలో నాలుగు.. ఆసియా కప్లో భారత్ హవా!
-
Rajyogam: 200 ఏళ్ల తర్వాత అరుదైన యోగం.. ఈ 5 రాశుల వారికి పట్టిందల్లా బంగారమే..!