India Lose: ప్రపంచ ఛాంపియన్ల పరువు ఐర్లాండ్ వీధుల్లో పారేశారు.. శ్రేయాస్ అయ్యర్పై ఆగ్రహం..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
వరల్డ్ కప్ గెలిచిన జోష్లో ఉన్న టీమిండియాకు ఐర్లాండ్ చుక్కలు చూపించింది. ప్రపంచ ఛాంపియన్ హోదాలో బరిలోకి దిగిన భారత జట్టుకు బెల్ఫాస్ట్ వేదికగా జరిగిన మొదటి టీ20లోనే కోలుకోలేని షాక్ తగిలింది. అంతర్జాతీయ టీ20 క్రికెట్లో మొదటిసారి కెప్టెన్సీ బాధ్యతలు చేపట్టిన శ్రేయాస్ అయ్యర్కు తొలి మ్యాచ్లోనే ఘోరమైన చేదు అనుభవం ఎదురైంది. పసికూన చేతిలో చిత్తుగా ఓడిపోయి, అయ్యర్ తన కెప్టెన్సీ పరువును బజారున పడేశారు. ఇప్పటివరకు ఐర్లాండ్ చేతిలో ఓటమి ఎరుగని భారత్, ఈ చెత్త ప్రదర్శనతో తలదించుకోవాల్సి వచ్చింది.
టాస్ గెలిచి మొదట బ్యాటింగ్ చేసిన ఐర్లాండ్ 51 పరుగులకే 4 వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది. ఆ దశలో కొత్త కెప్టెన్ లీడర్ షిప్ ఇన్నింగ్స్ ఆడాడు. లీడింగ్ ఫ్రమ్ ది ఫ్రంట్ అన్నట్లుగా లార్కన్ టక్కర్ హాఫ్ సెంచరీతో మెరిశాడు. అతనికి గారెత్ డెలానీ తోడవడంతో ఐర్లాండ్ 182 పరుగుల భారీ స్కోరు సాధించింది.
Also Read
- Adidas Layoffs: సాఫ్ట్వేర్ ఇంజనీర్లు, డేటా సైంటిస్టులకు షాక్.. అడిడాస్లో 50% ఉద్యోగాల కోత
- WPL 2027 Dates Announced: WPL 2027 షెడ్యూల్ వచ్చేసింది.. జనవరి 14 నుంచి మహిళా క్రికెట్ సమరం!
- Trump-Israel: ఇజ్రాయెల్కు ట్రంప్ భారీ ఆయుధ ప్యాకేజీ.. 40 వేల బాంబులు, 20 వేల పెనిట్రేటర్ వార్హెడ్లు!
- Mahua Moitra: మహువా మోయిత్రా కారుపై ఎగ్ అటాక్.. సుప్రీంకోర్టు జడ్జిపై సెటైర్లు..
అనంతరం 183 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన టీమిండియాను ఐర్లాండ్ బౌలర్లు ముప్పుతిప్పలు పెట్టారు. గాయపడిన చేత్తోనే బౌలింగ్ చేసిన మాథ్యూ హంఫ్రీస్ 3 వికెట్లతో భారత బ్యాటింగ్ వెన్నువిరిచాడు. డెబ్యూటెంట్లు జై మూంద్రా, మాట్ హాలండ్ చెరో రెండు వికెట్లతో (కలిసి 5/54) భారత్ను కోలుకోకుండా చేశారు. ఓపెనర్ అభిషేక్ శర్మ (20 బంతుల్లో 50) మినహా ఎవరూ కనీస పోరాట పటిమ చూపించలేదు. కెప్టెన్ శ్రేయాస్ అయ్యర్ కేవలం 3 పరుగులకే చేతులెత్తేయగా, సంజూ శాంసన్ (5), ఇషాన్ కిషన్ (1) తీవ్రంగా నిరాశపరిచారు. దీంతో భారత్ 148 పరుగులకే ఆలౌట్ అయి, 34 పరుగుల తేడాతో ఘోర పరాజయాన్ని మూటగట్టుకుంది.
ఈ అవమానకర ఓటమిపై సోషల్ మీడియాలో శ్రేయాస్ అయ్యర్ను నెటిజన్లు ఏకిపారేస్తున్నారు. “సూర్యకుమార్ యాదవ్ కెప్టెన్సీలో వరల్డ్ కప్ గెలిచిన టీమ్ అంటే పాకిస్తాన్, సౌతాఫ్రికా లాంటి జట్లే వణికిపోతాయి.. అలాంటిది ఐర్లాండ్తో అలవోకగా ఓడిపోతారా?” అంటూ ఫ్యాన్స్ మండిపడుతున్నారు. ఈ సిరీస్కు ఎంపికైన యంగ్ సెన్సేషన్ వైభవ్ సూర్యవంశీని ప్లేయింగ్ ఎలెవన్లో తీసుకోకపోవడం అయ్యర్ చేసిన బ్లండర్ మిస్టేక్ అంటూ ట్రోల్ చేస్తున్నారు. కనీస గట్టి పోటీ కూడా ఇవ్వకుండా పరువు తీసుకున్న అయ్యర్ కెప్టెన్సీపై మీమ్స్ సోషల్ మీడియాను ఊపేస్తున్నాయి. ప్రపంచ ఛాంపియన్ల పరువును ఐర్లాండ్ వీధుల్లో పారేసారంటూ నెటిజన్లు భీభత్సమైన ట్రోలింగ్స్తో విరుచుకుపడుతున్నారు.
తాజావార్తలు
-
Adidas Layoffs: సాఫ్ట్వేర్ ఇంజనీర్లు, డేటా సైంటిస్టులకు షాక్.. అడిడాస్లో 50% ఉద్యోగాల కోత
-
Vijay Deverakonda : తగ్గేదే లే.. దసరా బరిలోనే రణబాలి! షూట్కి ప్యాకప్ చెప్పిన రౌడీ హీరో..
-
Rashmika Mandanna: కెరీర్ పీక్స్లో ఉండగానే ఇంత సడెన్గా ఆ డెసిషన్ ఎందుకు?
-
WPL 2027 Dates Announced: WPL 2027 షెడ్యూల్ వచ్చేసింది.. జనవరి 14 నుంచి మహిళా క్రికెట్ సమరం!
-
Trump-Israel: ఇజ్రాయెల్కు ట్రంప్ భారీ ఆయుధ ప్యాకేజీ.. 40 వేల బాంబులు, 20 వేల పెనిట్రేటర్ వార్హెడ్లు!
ట్రెండింగ్
-
Meta One వచ్చేసింది.. ఇంస్టాగ్రామ్, వాట్సాప్, ఫేస్ బుక్ కు కొత్త సబ్స్క్రిప్షన్ ప్లాన్ ధరలు ఇదిగో.!
-
రూ.15,999కే 7,000mAh బ్యాటరీ, 2TB వరకు స్టోరేజ్ సపోర్ట్, 120Hz డిస్ప్లేతో OPPO K14 Lite లాంచ్.!
-
IPL 2027 Auction: బీసీసీఐ కీలక నిర్ణయం.. భారత్లోనే ఐపీఎల్ 2027 వేలం!
-
Sanju Samson vs Vaibhav: వైభవ్ సూర్యవంశీతో పోటీ.. సంజు శాంసన్ సంచలన వ్యాఖ్యలు!
-
Nitish Kumar Reddy: నా టార్గెట్ అదే.. అందుకోసమే కష్టపడుతున్నా!