CM Chandrababu: మూడు రాష్ట్రాల భవిష్యత్తుకు తుంగభద్ర నాంది.. చరిత్ర సృష్టించిన సీఎంల భేటీ..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
CM Chandrababu: కర్ణాటకలో జరిగిన తుంగభద్ర డ్యామ్ కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కీలక వ్యాఖ్యలు చేశారు. తుంగభద్ర నది తల్లికి శిరస్సు వంచి నమస్కారం చేస్తున్నానని పేర్కొన్న ఆయన, మూడు రాష్ట్రాల ముఖ్యమంత్రులు ఒకే వేదికపై కలవడం చారిత్రాత్మక ఘట్టమని అన్నారు. ఈ సమావేశం మూడు రాష్ట్రాల భవిష్యత్తుకు నాంది పలుకుతుందని అభిప్రాయపడ్డారు. తుంగభద్ర డ్యామ్కు 75 సంవత్సరాల ఘన చరిత్ర ఉందని గుర్తు చేసిన చంద్రబాబు, ఈ ప్రాజెక్ట్ దశాబ్దాలుగా కోట్లాది ప్రజల జీవితాలకు ఆధారంగా నిలిచిందన్నారు. ముఖ్యంగా అనంతపురం, కర్నూలు, కడప జిల్లాలకు గత 70 ఏళ్లుగా తాగునీరు, సాగునీటిని అందిస్తూ తుంగభద్ర డ్యామ్ కీలక పాత్ర పోషిస్తోందని చెప్పారు.
గతంలో తుంగభద్ర డ్యామ్ 19వ గేటు కొట్టుకుపోయిన సమయంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వెంటనే స్పందించిందని తెలిపారు సీఎం చంద్రబాబు… అప్పటి కర్ణాటక సాగునీటి శాఖ మంత్రి డీకే సుకుమార్ చొరవతో సమస్య పరిష్కారానికి వేగంగా చర్యలు చేపట్టామని వెల్లడించారు. ప్రాజెక్టులు ఆధునిక దేవాలయాల వంటివని, వాటిని పరిరక్షించుకోవడం ప్రతి ప్రభుత్వ బాధ్యత అని చంద్రబాబు అన్నారు. తుంగభద్ర డ్యామ్ భద్రత, సామర్థ్యాన్ని పెంచే దిశగా కేవలం ఆరు నెలల వ్యవధిలోనే 33 గేట్లను ఏర్పాటు చేసి డ్యామ్కు కొత్త శోభ తీసుకొచ్చామని పేర్కొన్నారు. నీటి వనరుల పరిరక్షణ, రాష్ట్రాల మధ్య సమన్వయం, భవిష్యత్ అవసరాలకు అనుగుణంగా మౌలిక సదుపాయాల అభివృద్ధి అత్యంత అవసరమని చంద్రబాబు నాయుడు స్పష్టం చేశారు. తుంగభద్ర డ్యామ్ పునరుద్ధరణ కార్యక్రమం మూడు రాష్ట్రాల మధ్య సహకారానికి ప్రతీకగా నిలుస్తుందని అన్నారు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు..
Also Read
తాజావార్తలు
-
Pregnancy: గర్భిణులకు “కాస్మెటిక్స్” ముప్పు.. కొత్త అధ్యయనంలో షాకింగ్ విషయాలు
-
Anu Beniwal: శెభాష్ ఐపీఎస్.. రన్నింగ్తో సత్తా చాటిన 9 నెలల నిండు చూలాలి
-
Bandi Bhageerath :బండి భగీరథ్కు హైకోర్టు బెయిల్
-
KTR : కాంగ్రెస్ పని అయిపోయింది.. సర్వేల్లో బీఆర్ఎస్కు 78 సీట్లు ఖాయం
-
Sanju Samson: ఎట్టకేలకు సంజూ శాంసన్కు చోటు.. ఆ బ్యాటర్పై వేటు..
ట్రెండింగ్
-
Rainy Season Tips : వర్షాకాలంలో బూట్ల దుర్వాసనకు చెక్.. ఈ చిట్కాలు ట్రై చేయండి.!
-
IP69K రేటింగ్, 9000mAh బ్యాటరీతో లాంచ్ కానున్న REDMI Note 17 Pro..!
-
TGSRTCలో 1,500 కండక్టర్ పోస్టులు.. రాత పరీక్ష లేకుండానే ఉద్యోగం.!
-
Jio నుంచి గేమ్ ఛేంజింగ్ ప్లాన్.. 1,000+ టీవీ ఛానెల్స్, 150 ప్రీమియం ఛానెల్స్ కేవలం రూ.55కే.!
-
Viral News: చిన్న పొదుపుతో తీరిన పెద్ద కల.. రూ.10 నాణేలతో రూ.1.10 లక్షల బైక్ కొనుగోలు.!