IND Vs IRE: ఆరంభంలో తడబడినా భారీ స్కోరు చేసిన ఐర్లాండ్.. భారత్ ముందు క్రేజీ టార్గెట్..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
భారత్, ఐర్లాండ్ మధ్య బెల్ఫాస్ట్లో జరుగుతున్న మొదటి టీ20 మ్యాచ్లో టాస్ గెలిచిన భారత జట్టు కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ ముందుగా ఫీల్డింగ్ ఎంచుకున్నాడు. కొత్త కెప్టెన్గా బాధ్యతలు చేపట్టిన శ్రేయస్కు ఇది తొలి మ్యాచ్ కావడం విశేషం. ఈ ఏడాది టీ20 ప్రపంచకప్ గెలిచిన తర్వాత భారత జట్టులో భారీ మార్పులు చోటుచేసుకున్నాయి. సూర్యకుమార్ యాదవ్ స్థానంలో శ్రేయస్ అయ్యర్ కొత్త కెప్టెన్గా నియమితులవగా, దాదాపు మూడేళ్ల తర్వాత ఆయన తిరిగి ప్లేయింగ్ ఎలెవన్లోకి వచ్చారు. ఈ సిరీస్ కోసం వైభవ్ సూర్యవంశీ, ప్రిన్స్ యాదవ్, సూర్యాంశ్ శెడ్గే వంటి యువ ఆటగాళ్లకు తొలిసారిగా జట్టులో చోటు దక్కింది, అయితే మొదటి మ్యాచ్లో వైభవ్కు ఆడే అవకాశం రాలేదు.
ఈ మ్యాచ్ సాధారణ సమయం కంటే ఒక గంట ముందుగా, అంటే భారత కాలమానం ప్రకారం సాయంత్రం 6 గంటలకు ప్రారంభమైంది. జూన్ 28న లార్డ్స్లో జరగనున్న భారత్-ఆస్ట్రేలియా మహిళల ప్రపంచకప్ కీలక మ్యాచ్ను దృష్టిలో ఉంచుకుని క్రికెట్ ఐర్లాండ్ ఈ నిర్ణయం తీసుకుంది.
Also Read
మొదట బ్యాటింగ్ చేసిన ఐర్లాండ్ జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 182 పరుగులు చేసింది. ఐర్లాండ్ ఇన్నింగ్స్ ఆరంభం అంతగా సాగలేదు. రెండో ఓవర్లోనే ఓపెనర్ రాస్ అడైర్ 12 పరుగుల వద్ద వికెట్ కోల్పోయింది. ఆ వెంటనే అర్ష్దీప్ సింగ్ బౌలింగ్లో హ్యారీ టెక్టర్ ఖాతా తెరవకుండానే అవుటయ్యాడు. మరో ఓపెనర్ టిమ్ టెక్టర్ 17 పరుగులు చేసి హర్షిత్ రాణా బౌలింగ్లో వెనుదిరిగాడు. శివమ్ దూబే బౌలింగ్లో బెంజమిన్ కాలిట్జ్ 15 పరుగులకే అవుటయ్యాడు. అయితే ఐర్లాండ్ కెప్టెన్ లోర్కాన్ టక్కర్ బాధ్యతాయుతంగా ఆడి 36 బంతుల్లో 50 పరుగులతో అర్ధసెంచరీ పూర్తి చేశాడు. భారత బౌలర్ హర్షిత్ రాణా అద్భుతంగా బౌలింగ్ చేసి మూడు వికెట్లు పడగొట్టాడు. ఆఖర్లో గారెత్ డెలానీ 49 పరుగుల ధనాధన్ ఇన్నింగ్స్ ఆడి జట్టుకు భారీ స్కోరు అందించాడు.
భారత జట్టులో అభిషేక్ శర్మ, సంజూ శాంసన్, ఇషాన్ కిషన్, తిలక్ వర్మ, శివమ్ దూబే, అక్షర్ పటేల్, వాషింగ్టన్ సుందర్, ప్రసిద్ధ్ కృష్ణ బరిలోకి దిగారు. ఐర్లాండ్ జట్టులో టక్కర్, డోక్రెల్, మెక్కార్తీ, హంఫ్రీస్, జై ముంద్రా, హాలార్డ్ తదితరులు ఉన్నారు.
తాజావార్తలు
-
NTV Comment : కంటెంట్ బాగుంటే ఏ సినిమాని ఎవ్వరూ ఆపలేరు బాస్!
-
OTR : చంద్రగిరి కూటమి పార్టీల ముఖ్యుల మధ్య విభేదాలు
-
Story Board: ఆర్థిక ఊబిలో తెలుగు రాష్ట్రాలు
-
Central Govt: అడ్వాన్స్ టిప్ విధానాన్ని ఆపేయండి.. క్యాబ్ కంపెనీలకు కేంద్రం ఆదేశాలు
-
UPI Charges: ‘‘యూపీఐ ఛార్జీలు రద్దు చేయాలి’’.. సుప్రీంకోర్టులో పిటిషన్..
ట్రెండింగ్
-
Meta One వచ్చేసింది.. ఇంస్టాగ్రామ్, వాట్సాప్, ఫేస్ బుక్ కు కొత్త సబ్స్క్రిప్షన్ ప్లాన్ ధరలు ఇదిగో.!
-
రూ.15,999కే 7,000mAh బ్యాటరీ, 2TB వరకు స్టోరేజ్ సపోర్ట్, 120Hz డిస్ప్లేతో OPPO K14 Lite లాంచ్.!
-
IPL 2027 Auction: బీసీసీఐ కీలక నిర్ణయం.. భారత్లోనే ఐపీఎల్ 2027 వేలం!
-
Sanju Samson vs Vaibhav: వైభవ్ సూర్యవంశీతో పోటీ.. సంజు శాంసన్ సంచలన వ్యాఖ్యలు!
-
Nitish Kumar Reddy: నా టార్గెట్ అదే.. అందుకోసమే కష్టపడుతున్నా!