Weather News: మరో 5ఏళ్లు నరకమే.. ఐక్యరాజ్యసమితి హెచ్చరిక.. UN రిపోర్ట్లో ఏముంది?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఈ ఏడాది భానుడి ప్రతాపం చూసి ఇప్పటికే మీరు ఉక్కిరిబిక్కిరైపోయారు కదా..? అయితే ఈ తరహా ఎండల వ్రతను..ఉక్కపోతలను ఇకపై భరించడానికి సిద్ధంగా ఉండండి.. ఎందుకంటే రానున్న ఐదేళ్లు మీరు ఊహించని స్థాయిలో సూర్యుడు నిప్పులు చిమ్మబోతున్నాడు. వాతావరణ మార్పుల వల్ల జరిగే అసలు సిసలు వినాశనం ఎలా ఉండబోతోందో… రానున్న ఐదేళ్లలోనే చూడబోతున్నామని ఐక్యరాజ్యసమితి హెచ్చరిస్తోంది. దీనికి సంబంధించి వరల్డ్ మెటియోరలాజికల్ ఆర్గనైజేషన్ తాజాగా ఓ షాకింగ్ రిపోర్ట్ విడుదల చేసింది. అది చూస్తే భూమిపై భవిష్యత్ జీవితం ఎంత కఠినంగా ఉండబోతోన్నాయో అర్థమవుతుంది.
2026-2030 మధ్య ఏం జరగనుంది?
రాబోయే ఐదేళ్లలో భూమి కనీవినీ ఎరుగని రీతిలో వేడెక్కనుందని ఐక్యరాజ్యసమితి వాతావరణ సంస్థలు హెచ్చరిస్తున్నాయి. ఇదివరకటి రికార్డులన్నీ బద్దలయ్యే స్థాయిలో ఉష్ణోగ్రతలు నమోదవుతాయని తాజా నివేదిక స్పష్టం చేసింది. 2026 నుంచి 2030 మధ్యకాలంలో భూమి సగటు ఉష్ణోగ్రతలు పారిశ్రామిక విప్లవానికి ముందున్న స్థాయి కంటే 1.5 డిగ్రీల సెల్సియస్ దాటిపోవడానికి 75 శాతం అవకాశం ఉందని యూకే మెటియోరలాజికల్ ఆఫీస్ అంచనా వేసింది. అలాగే రాబోయే ఐదేళ్లలో కనీసం ఒక్క సంవత్సరమైనా ఈ 1.5 డిగ్రీల సెల్సియస్ పరిమితిని దాటే అవకాశం ఏకంగా 91 శాతం ఉందని తెలిపింది. పారిస్ వాతావరణ ఒప్పందంలో నిర్దేశించుకున్న ఈ 1.5 డిగ్రీల మార్కును దాటితే వినాశనం తప్పదని.. 2024లో నమోదైన అత్యధిక ఉష్ణోగ్రతల రికార్డు కూడా రాబోయే రోజుల్లో బ్రేక్ అయ్యే అవకాశాలు 86 శాతం ఉన్నాయని శాస్త్రవేత్తలు చెబుతున్నారు.
మరోవైపు ఉష్ణోగ్రతల పెరుగుదలకు వాతావరణంలో వస్తున్న అనూహ్య మార్పులు కూడా తోడవుతున్నాయని నిపుణులు అంచనా వేస్తున్నారు. త్వరలోనే పసిఫిక్ మహాసముద్రంలో బలమైన ఎల్ నినో ఏర్పడి… దాని ప్రభావం 2028 వరకు కొనసాగే అవకాశం ఉంది. దీని కారణంగా ప్రపంచవ్యాప్తంగా వాతావరణ పరిస్థితులు మారిపోయి.. భూమి దశాబ్దానికి 0.45 డిగ్రీల ఫారెన్ హీట్ చొప్పున చాలా వేగంగా వేడెక్కుతోంది.
Also Read
- Gen Z: 'జెన్ జీ... మమ్మల్ని క్షమించు..'! నేటి యువ తరాన్ని సమాజం తప్పుగా అర్థంచేసుకుందా?
- Collections : అసలు గ్రాస్, షేర్,నెట్ మధ్య తేడా ఏంటి?
- Explainer: అట్లాంటిక్ కింద 300°C వేడి నీరు.. సూర్యకాంతి లేకుండా జీవం ఎలా బతుకుతోంది?
- Potti Sriramulu's Sacrifice: 58 రోజుల పొట్టి శ్రీరాములు ఆమరణ దీక్ష.. దేశాన్ని కదిలించిన ఉద్యమ చరిత్ర
ముఖ్యంగా భూమిపై మిగతా ప్రాంతాల కంటే ఆర్కిటిక్ ప్రాంతం మూడున్నర రెట్లు వేగంగా వేడెక్కుతోందని వాతావరణ శాస్త్రవేత్తలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. మంచు కరిగిపోవడం వల్ల సూర్యరశ్మిని తిరిగి అంతరిక్షంలోకి పంపే ప్రక్రియ తగ్గిపోయి.. సముద్రపు మంచు మరింత వేగంగా కరుగుతోందని బ్రిటన్ వాతావరణ నిపుణులు చెబుతున్నారు.
WMO ఏం చెబుతోంది?
ఉష్ణోగ్రతలు పెరగడం వల్ల కేవలం ఎండలు మాత్రమే కాదు.. విపరీతమైన కరువు.. వరదలు.. వడగాలులు లాంటి ప్రకృతి విపత్తులు కూడా ముంచుకొస్తాయని WMO హెచ్చరిస్తోంది. భూమి వాతావరణాన్ని సమతుల్యంగా ఉంచే అమెజాన్ బేసిన్కు కూడా రాబోయే రోజుల్లో భారీ ముప్పు పొంచి ఉంది. ఉష్ణోగ్రతలు పెరిగి కరువు పరిస్థితులు నెలకొనడం వల్ల అమెజాన్ అడవుల్లో భారీగా కార్చిచ్చు రగిలే ప్రమాదం ఉందని నివేదిక పేర్కొంది. వాతావరణంలోని కార్బన్ డై ఆక్సైడ్ ను పీల్చుకునే అమెజాన్ అడవులు.. మంటల వల్ల కార్బన్ను విడుదల చేసే ప్రాంతాలుగా మారి పరిస్థితిని మరింత దిగజార్చే అవకాశం ఉంది. ఆఫ్రికాలోని సహెల్ ప్రాంతంలో సాధారణం కంటే ఎక్కువ వర్షాలు పడి వరదలు వచ్చే అవకాశం ఉందని… మొత్తంగా వాతావరణ మార్పులను అరికట్టేందుకు ప్రపంచ దేశాలు తీసుకుంటున్న చర్యలు ఏమాత్రం సరిపోవడం లేదని ఐక్యరాజ్యసమితి ఆందోళన వ్యక్తం చేస్తోంది.
: ఫణి కుమార్ (NTV DIGITAL)
తాజావార్తలు
-
OTR: జనగామ కాంగ్రెస్లో వర్గపోరు.. డీసీసీ vs నియోజకవర్గ ఇంచార్జ్ వార్!
-
Sikandar Raza: నేనే జట్టును నిరాశపరిచాను.. ఓటమికి బాధ్యత నాదే.. నిజాయితీగా ఒప్పుకున్న జింబాబ్వే కెప్టెన్..
-
Story Board : జెన్ జి ఉద్యమాలు.. సరికొత్త బెంచ్ మార్క్ సెట్ చేస్తున్న యువత..
-
OTR: కంట్లో నలుసు..
-
Pralhad Joshi: ధర్మేంద్ర ప్రధాన్ వారసుడిగా ప్రహ్లాద్ జోషి.. కొత్త విద్యాశాఖ మంత్రిగా నియామకం
ట్రెండింగ్
-
Parents Alert: రోజూ ఫ్రూట్ జ్యూస్ ఇస్తున్నారా? పిల్లల్లో ఈ ప్రమాదం 52% పెరుగుతుందట.!
-
Easy Wall Cleaning Tips: గోడలపై మరకలా? ఖరీదైన క్లీనర్లు వద్దు.. ఇంట్లో ఉన్నవే చాలు.!
-
Smart Money Rules: జీవితాన్ని మార్చే స్మార్ట్ ‘మనీ రూల్స్’.! ఆర్థికంగా బలపడాలంటే తప్పక తెలుసుకోవాల్సిన సూత్రాలు ఇవే..
-
12.1 అంగుళాల 2.5K డిస్ప్లే, 10,200mAh బ్యాటరీతో రానున్న Moto Pad 70.!
-
3.2 అంగుళాల టచ్స్క్రీన్, Doubao AIతో HMD Touch AI ఫీచర్ ఫోన్ లాంచ్.!