చాలా మందికి అనేక కారణాలతో కళ్ళు ఎర్రగా మారి మండుతుంటాయి. ముఖ్యంగా కంప్యూటర్స్ ముందు ఎక్కువగా ఉండేవారికి ఈ సమస్య అధికంగా ఉంటుంది.

కంప్యూటర్స్, ఫోన్స్ మీరు ఏవి యూజ్ చేస్తున్నారో వాటి లైటింగ్ తగ్గించండి. రూమ్‌లో వెలుగు ఎక్కువగా ఉండేలా చూసుకోండి. వెలుతురు ఉంటే మీ కళ్ళపై ఎక్కువగా ఎఫెక్ట్ పడకుండా చూసుకోవడం మంచిది. 

పేపర్, బుక్స్ చదివినప్పుడు కూడా వెలుగు కూడా ఎక్కువగా ఉండాలి. అదే విధంగా, పని చేస్తున్నప్పుడు బ్రేక్ తీసుకోవడం మంచిది. ఈ బ్రేక్‌లో మీరు కంటి మంట సమస్యల నుంచి కాస్తా రిలాక్స్ అవుతారు

కన్నీళ్ళు కూడా కంటి సమస్యల్ని దూరం చేస్తాయి. కాబట్టి కంటికి నీరు వచ్చేలా చూడండి. వీటితో కళ్ళలోని దుమ్ము పోయి లూబ్రికేట్‌లా పనిచేస్తాయి. కాబట్టి, అప్పుడప్పుడు కన్నీరు తెచ్చుకోవడం కూడా మంచిదే.

మధ్యమధ్యలో కళ్ళు కడగడం కూడా మంచి రెమిడీలా పనిచేస్తుంది. కాబట్టి రెండు గంటలకి ఓసారైనా కళ్ళని నీటితో కడగడం మంచిది. 

దోసకాయల్ని కూడా చిన్నగా, గుండ్రంగా కట్ చేసి వాటిని కంటి మీద పెట్టడం వల్ల చాలా వరకూ రిలాక్స్ అవుతాయి కళ్ళు. వీటిని ఫ్రిజ్‌లో పెట్టుకుని వాడడం చాలా మంచిది.

రాత్రుళ్ళు గ్యాడ్జెట్స్‌కి ఎంత దూరం ఉంటే అంత మంచిది. కనీసం నిద్రకి 2 గంటల ముందైనా వీటికి దూరంగా ఉంటే చాలా మంచిదని చెబుతున్నారు నిపుణులు.

కళ్ళద్దాలు కూడా కంటిసమస్యల్ని దూరం చేస్తాయి. అందుకే వీటిని వాడడం మంచిది. అందుకోసం డాక్టర్ సలహా తీసుకోవడం చాలా ముఖ్యం. 

టీ బ్యాగ్స్ కూడా చాలా వరకూ హెల్ప్ చేస్తాయి. వీటిని వాడాకా వాటిని అలానే ఫ్రిజ్‌లో పెట్టి ఓ ఐదు నిమిషాల తర్వాత కళ్ళపై పెట్టండి. సమస్య చాలా వరకూ తగ్గుతుంది. 

ముఖ్యంగా గ్రీన్ టీ బ్యాగ్స్ వాడడం మంచిది.