Vaibhav Sooryavanshi: ‘వైభవ్ సూర్యవంశీకి అన్యాయం.. రెండో టీ20లో కూడా అదే తప్పు’..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఐర్లాండ్తో జరుగుతున్న రెండో టీ20 మ్యాచ్లోనూ 15 ఏళ్ల యువ సంచలనం వైభవ్ సూర్యవంశీకి భారత ప్లేయింగ్ ఎలెవన్లో చోటు దక్కకపోవడంపై మాజీ క్రికెటర్, ప్రముఖ వ్యాఖ్యాత సంజయ్ మంజ్రేకర్ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. మొదటి టీ20లో భారత్ 34 పరుగుల తేడాతో ఘోర పరాజయాన్ని చవిచూసిన తర్వాత, రెండో మ్యాచ్లో సూర్యవంశీకి అంతర్జాతీయ అరంగేట్రం చేసే అవకాశం వస్తుందని అందరూ భావించారు. కానీ, కెప్టెన్ శ్రేయస్ అయ్యార్ టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకోగా.. తుది జట్టులో ప్రిన్స్ యాదవ్, సూర్యాన్ష్ షెడ్గేలకు మాత్రమే చోటు దక్కింది.
సూర్యవంశీని తుది జట్టులోకి తీసుకోకపోవడంపై మంజ్రేకర్ స్పందిస్తూ, ఇది సరైన క్రికెటింగ్ నిర్ణయం కాదని విమర్శించారు. సూర్యవంశీని జట్టులోకి ఎలా సరిపెట్టవచ్చో ఆయన ఒక మార్గాన్ని సూచించారు. “మొదటి మ్యాచ్లో భారత మిడిలార్డర్ పూర్తిగా కుప్పకూలింది. ఓపెనర్లు మాత్రమే రాణిస్తే సరిపోదు, మిడిలార్డర్లో నిలకడైన బ్యాటర్ అవసరం ఉంది. సూర్యవంశీని జట్టులోకి తీసుకుని అభిషేక్ శర్మతో కలిసి ఓపెనింగ్ పంపించి, సీనియర్ బ్యాటర్ సంజు శాంసన్ను మిడిలార్డర్లో ఆడించి ఉంటే బాగుండేది. నేను ఈ నిర్ణయంతో ఏమాత్రం సంతోషంగా లేను. సూర్యవంశీ ఇన్నింగ్స్ ఓపెన్ చేయాలని నేను కోరుకున్నాను” అని మంజ్రేకర్ స్పష్టం చేశారు.
Also Read
- India Squads: పంత్కు షాక్.. నితీశ్కు బంపర్ ఆఫర్.. వెస్టిండీస్ సిరీస్కు జట్లు ప్రకటించిన బీసీసీఐ
- AP Deputy CM Pawan Kalyan: ప్రజా సమస్యపై పవన్ కళ్యాణ్ ఫాస్ట్ యాక్షన్.. గంటల్లోనే రోడ్ల మంజూరు!
- CBI Case: అమెరికా మిషనరీ సంస్థపై CBI కేసు.. 1,000కుపైగా విదేశీ డెబిట్ కార్డుల వ్యవహారం!
- Disha Salian Case: ‘‘ఆమె ఎవరో నాకు తెలియదు’’.. దిశా కేసుపై ఆదిత్య ఠాక్రే కామెంట్స్..
మొదటి టీ20లో భారత జట్టు 182 పరుగుల లక్ష్య ఛేదనలో కేవలం 148 పరుగులకే ఆలౌట్ అయింది. సంజు శాంసన్ (5), ఇషాన్ కిషన్ (1), కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ (3) ఘోరంగా విఫలమయ్యారు. అభిషేక్ శర్మ 50 పరుగులతో రాణించినప్పటికీ ఇతర బ్యాటర్ల నుండి సహకారం లభించలేదు. ఐర్లాండ్ డెబ్యూ బౌలర్లు జై ముంద్రా, మాట్ హాలార్డ్లు భారత టాప్ ఆర్డర్ను దెబ్బతీశారు. ఏ ఫార్మాట్లోనైనా భారత్పై ఐర్లాండ్కు ఇదే తొలి విజయం కావడం విశేషం. ఈ నేపథ్యంలో బ్యాటింగ్ను బలోపేతం చేయాల్సింది పోయి, సూర్యవంశీని మళ్లీ బెంచ్కే పరిమితం చేయడం చర్చనీయాంశంగా మారింది. ఇదిలా ఉండగా.. రెండో మ్యాచ్ లో కూడా ఓపెనర్లు డకౌట్ గా వెనుదిరిగారు.. ప్రస్తుతం టీమిండియా మూడు వికెట్లు పోయి.. కష్టాల్లో ఉంది.
తాజావార్తలు
-
Nandyala District: నంద్యాలలో ఘోర విషాదం.. కాలువలో పడి ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు గల్లంతు
-
India Squads: పంత్కు షాక్.. నితీశ్కు బంపర్ ఆఫర్.. వెస్టిండీస్ సిరీస్కు జట్లు ప్రకటించిన బీసీసీఐ
-
AP Deputy CM Pawan Kalyan: ప్రజా సమస్యపై పవన్ కళ్యాణ్ ఫాస్ట్ యాక్షన్.. గంటల్లోనే రోడ్ల మంజూరు!
-
CBI Case: అమెరికా మిషనరీ సంస్థపై CBI కేసు.. 1,000కుపైగా విదేశీ డెబిట్ కార్డుల వ్యవహారం!
-
Disha Salian Case: ‘‘ఆమె ఎవరో నాకు తెలియదు’’.. దిశా కేసుపై ఆదిత్య ఠాక్రే కామెంట్స్..
ట్రెండింగ్
-
Meta One వచ్చేసింది.. ఇంస్టాగ్రామ్, వాట్సాప్, ఫేస్ బుక్ కు కొత్త సబ్స్క్రిప్షన్ ప్లాన్ ధరలు ఇదిగో.!
-
రూ.15,999కే 7,000mAh బ్యాటరీ, 2TB వరకు స్టోరేజ్ సపోర్ట్, 120Hz డిస్ప్లేతో OPPO K14 Lite లాంచ్.!
-
IPL 2027 Auction: బీసీసీఐ కీలక నిర్ణయం.. భారత్లోనే ఐపీఎల్ 2027 వేలం!
-
Sanju Samson vs Vaibhav: వైభవ్ సూర్యవంశీతో పోటీ.. సంజు శాంసన్ సంచలన వ్యాఖ్యలు!
-
Nitish Kumar Reddy: నా టార్గెట్ అదే.. అందుకోసమే కష్టపడుతున్నా!