Anant Ambani: టీటీడీకి రూ.27.5 కోట్ల భారీ విరాళం.. 50 మంది డ్రైవర్లు, ఛార్జింగ్ స్టేషన్ కూడా!
- శ్రీవారిని దర్శించుకున్న అనంత్ అంబానీ
- టీటీడీకి రూ.27.5 కోట్ల భారీ విరాళం
- పశు సంరక్షణకు సంబంధించి కీలక నిర్ణయం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Anant Ambani Donates Rs 27.5 Crore to TTD: రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత ముఖేష్ అంబానీ కుమారుడు అనంత్ అంబానీ ఆదివారం (జూన్ 28) ఉదయం తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామి వారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. శ్రీవారికి తలనీలాలు సమర్పించి మొక్కులు చెల్లించుకున్నారు. దర్శనం అనంతరం టీటీడీ అదనపు ఈవో వెంకయ్య చౌదరితో సమావేశమైన అనంత్ అంబానీ.. తిరుమల అభివృద్ధికి పలు కీలక విరాళాలను ప్రకటించారు.
టీటీడీకి సుమారు రూ.27.5 కోట్ల విలువ చేసే 25 ఎలక్ట్రిక్ బస్సులను విరాళంగా అందజేస్తామని అనంత్ అంబానీ వెల్లడించారు. ఈ బస్సులు తిరుమలలో భక్తులకు పర్యావరణహిత రవాణా సేవలను మరింత మెరుగుపర్చడంలో ఉపయోగపడనున్నాయి. అంతేకాకుండా ఈ 25 ఎలక్ట్రిక్ బస్సులకు అవసరమైన 50 మంది డ్రైవర్ల జీతభత్యాలను కూడా రిలయన్స్ సంస్థ భరిస్తుందని ప్రకటించారు. అదేవిధంగా తిరుమలలో ఎలక్ట్రిక్ బస్సుల నిర్వహణకు అవసరమైన ఛార్జింగ్ స్టేషన్ల ఏర్పాటుకు కూడా రిలయన్స్ సంస్థ సహకరించేందుకు అంగీకరించింది. దీంతో తిరుమలలో గ్రీన్ ట్రాన్స్పోర్ట్ వ్యవస్థను మరింత బలోపేతం చేసే దిశగా కీలక అడుగు పడనుంది.
Also Read
- Kapil Dev: ఫాలో ఆన్ ఇచ్చి కూడా గెలవలేరా? కపిల్ దేవ్ ప్రశ్నల వర్షంతో టీమిండియాలో ప్రకంపనలు..
- NASA: అంగారక గ్రహంపై ఏలియన్ 'జెల్లీఫిష్' కలకలం.. నాసా ఫొటోతో వెలుగులోకి షాకింగ్ విషయాలు..
- Food Poisoning: జగిత్యాల జిల్లాలో విషాదం.. పెళ్లి భోజనం తిని 15 మందికి అస్వస్థత..
- T20 Cricket: కేవలం 7 పరుగులకే ఆలౌట్, 10 రన్స్కే కుప్పకూలిన జట్లు, టీ20 చరిత్రలోనే అత్యంత దారుణ స్కోర్లు ఇవే!
ఇక పశు సంరక్షణకు సంబంధించి కూడా అనంత్ అంబానీ కీలక నిర్ణయం తీసుకున్నారు. గుజరాత్లో రిలయన్స్ నిర్వహిస్తున్న ‘వంతారా’ తరహాలో తిరుమల గోశాలను ఆధునీకరించేందుకు సహకారం అందిస్తామని తెలిపారు. ఆధునిక సదుపాయాలు, మెరుగైన సంరక్షణ, పశువైద్య సేవలతో గోశాలను అభివృద్ధి చేసే దిశగా టీటీడీతో కలిసి పనిచేయనున్నట్లు వెల్లడించారు. అనంత్ అంబానీ ప్రకటించిన ఈ భారీ విరాళాలు, తిరుమలలో పర్యావరణహిత రవాణా వ్యవస్థతో పాటు గోశాల అభివృద్ధికి ఎంతో ఉపయోగపడనున్నాయని టీటీడీ వర్గాలు పేర్కొంటున్నాయి. ఆయన భక్తి భావంతో చేసిన ఈ సేవలు ప్రస్తుతం భక్తుల ప్రశంసలు అందుకుంటున్నాయి.
తాజావార్తలు
-
Kapil Dev: ఫాలో ఆన్ ఇచ్చి కూడా గెలవలేరా? కపిల్ దేవ్ ప్రశ్నల వర్షంతో టీమిండియాలో ప్రకంపనలు..
-
NASA: అంగారక గ్రహంపై ఏలియన్ ‘జెల్లీఫిష్’ కలకలం.. నాసా ఫొటోతో వెలుగులోకి షాకింగ్ విషయాలు..
-
Food Poisoning: జగిత్యాల జిల్లాలో విషాదం.. పెళ్లి భోజనం తిని 15 మందికి అస్వస్థత..
-
Emraan Hashmi: సినిమా సక్సెస్ జోష్లో ఇమ్రాన్ హష్మీకి బిగ్ షాక్.. స్వైన్ ఫ్లూ పాజిటివ్!
-
T20 Cricket: కేవలం 7 పరుగులకే ఆలౌట్, 10 రన్స్కే కుప్పకూలిన జట్లు, టీ20 చరిత్రలోనే అత్యంత దారుణ స్కోర్లు ఇవే!
ట్రెండింగ్
-
House Construction Cost: ఇల్లు కట్టే ఆలోచన ఉందా?.. కేవలం 5 నిమిషాల్లో బడ్జెట్ అంచనా వేసే సింపుల్ ట్రిక్ ఇదే!
-
ఇదేం ఫోన్ బాబోయ్.. బ్లాక్ అండ్ వైట్ నుంచి కలర్లోకి మారిపోతుంది..! Hisense A10 e-ink లాంచ్.!
-
రూ.15,999కే IP69 రేటింగ్, 120Hz డిస్ప్లే, 5,200mAh బ్యాటరీతో TECNO SPARK Go 3 Pro లాంచ్..!
-
50MP డ్యూయల్ కెమెరా, 7,900mAh బ్యాటరీతో సెప్టెంబర్ 3న భారత్లో లాంచ్ కానున్న Redmi 17 5G..!
-
10,000mAh బ్యాటరీ, డ్యూయల్ టోన్ డిజైన్, AMOLED డిస్ప్లేతో సెప్టెంబర్ 4న రానున్న POCO X8 Power 5G..!