CM Revanth Reddy : బీఆర్ఎస్కు సీఎం రేవంత్ బహిరంగ సవాల్
- బీఆర్ఎస్కు సీఎం రేవంత్ బహిరంగ సవాల్ మేనిఫెస్టో అమలుపై అసెంబ్లీలో చర్చకు సిద్ధం కాళేశ్వరం 'కూలేశ్వరం'గా మారిందని విమర్శ సంక్షేమానికి రూ.లక్ష కోట్ల ఖర్చు చేసినట్లు వెల్లడి
- Follow Us :
-
-
Add as a preferred
source on google
CM Revanth Reddy : తెలంగాణలో రాబోయే 2034 వరకు కాంగ్రెస్ పార్టీనే అధికారంలో ఉంటుందని, వచ్చే ఎన్నికల్లోనూ తమ విజయాన్ని ఎవరూ అడ్డుకోలేరని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ధీమా వ్యక్తం చేశారు. వేల కోట్లు దోచుకున్న కేసీఆర్ లాంటి వ్యక్తులు మళ్లీ వస్తే ఏమవుతుందో ప్రజలకు బాగా తెలుసని, రాష్ట్రంలో ఎప్పటికీ మూడు రంగుల జెండాయే ఎగురుతుందని స్పష్టం చేశారు. ఈ సందర్భంగానే ఆయన బీఆర్ఎస్ నేతలకు బహిరంగ సవాల్ విసిరారు. పదేళ్ల బీఆర్ఎస్ పాలనకు, రెండున్నరేళ్ల తమ కాంగ్రెస్ పాలనకు మధ్య మేనిఫెస్టోల అమలుపై అసెంబ్లీలో ఎన్ని రోజులైనా చర్చకు సిద్ధమని, దీనికోసం స్పీకర్కు లేఖ రాయాలని ప్రతిపక్షానికి సూచించారు. తమ హయాంలో కేసీఆర్ తినే సన్నబియ్యాన్నే నేడు పేదలు తింటున్నారని, అనుమానం ఉంటే తండాలకు వెళ్లి చూసుకోవచ్చని సీఎం పేర్కొన్నారు.
పేదలకు ఇందిరమ్మ ఇళ్లు ఇస్తుంటే ప్రతిపక్షాలు కడుపుమంటతో ఏడుస్తున్నాయని సీఎం రేవంత్ రెడ్డి మండిపడ్డారు. రూ.500 కే గ్యాస్ సిలిండర్ అందిస్తూ.. గత 30 నెలల కాలంలో సంక్షేమ పథకాల కోసం రూ.లక్ష కోట్లకు పైగా ఖర్చు చేశామని వివరించారు. కేంద్రంతో మాట్లాడి రాష్ట్రంలో యూరియా కష్టాలు లేకుండా చేశామని, రికార్డు స్థాయిలో 80 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని సేకరించామని తెలిపారు. గత ప్రభుత్వం లక్ష కోట్లతో కట్టిన కాళేశ్వరం ప్రాజెక్టు కేవలం ‘కూలేశ్వరం’ గా మారిందని, ఇప్పుడు ఆ నీళ్లు లేకుండానే రాష్ట్రంలో రికార్డు స్థాయి పంట ఉత్పత్తి సాధిస్తున్నామని గుర్తుచేశారు. గిరిజనులకు మెరుగైన విద్యను అందిస్తున్నామని, భవిష్యత్తులో గురుకులాల ద్వారా వందలాది మంది అంబేద్కర్లను తయారుచేస్తామని సీఎం రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు.
Also Read
- Medico Priyanka : కిమ్స్లో కూతురు మృత్యుపోరాటం.. తండ్రి కన్నీటి వేడుకోలు.!
- Uday Krishna Reddy : ట్రైనీ ఐపీఎస్ ఉదయ్కృష్ణారెడ్డి కేసులో సంచలన మలుపు
- KCR: స్వర్గీయ పెద్ది సుదర్శన్ రెడ్డి కుటుంబానికి కేసీఆర్ అండ.. రూ. 2.25 కోట్ల ఆర్థిక సాయం..
- Cheyutha Pension: అలర్ట్.. నేటి నుంచి కొత్త పింఛన్ల దరఖాస్తులు ప్రారంభం.. పూర్తి వివరాలు ఇవే..
తాజావార్తలు
-
Bengaluru: బాత్రూమ్లో మహిళ అస్థిపంజరం లభ్యం.. ట్విస్ట్ ఏంటంటే..!
-
Dharmendrasinh Jadeja: 609 వికెట్ల వీరుడు.. టీమ్ ఇండియాలో చోటు లేదు.. ధర్మేంద్రసింగ్ జడేజా కథ ఇదే!
-
Russia: నాటో కూటమిలో చీలిక తెచ్చేందుకు పుతిన్ బిగ్ ప్లాన్.!
-
Sugar Price Hike: పండుగల వేళ చక్కెర ధరకు రెక్కలు.. తాజాగా ఎంత పెరిగిందంటే..!
-
Vijaya Dairy Chairman Post: విజయ డైరీ ఛైర్మన్ ఎంపికకు బ్రేక్.. వారం రోజులు వాయిదా..
ట్రెండింగ్
-
19.62kmpl మైలేజ్, 150hp టర్బో ఇంజిన్తో Volkswagen Virtus Anniversary ఎడిషన్ లాంచ్.. ధర, ఫీచర్లు ఇవే.!
-
Clothes Smell: వర్షాకాలంలో బట్టల నుంచి దుర్వాసనా.? ఈ సింపుల్ చిట్కాలతో చెక్ పెట్టండి ఇలా.!
-
1TB వరకు స్టోరేజ్,120Hz డిస్ప్లే, Tensor G6తో Google Pixel 11 సిరీస్.. లాంచ్కు ముందే ధరలు లీక్.!
-
Airtel యూజర్లకు షాక్.. రూ.299 ప్లాన్ నిలిపివేత.. ఇక అన్లిమిటెడ్ ప్లాన్ రూ.349 నుంచే మొదలు.!
-
7500mAh బ్యాటరీ, 6.9 అంగుళాల 120Hz డిస్ప్లే, 45W ఫాస్ట్ ఛార్జింగ్తో REDMI 17 5G లాంచ్..!