CM Revanth Reddy : బీఆర్ఎస్కు సీఎం రేవంత్ బహిరంగ సవాల్
- బీఆర్ఎస్కు సీఎం రేవంత్ బహిరంగ సవాల్ మేనిఫెస్టో అమలుపై అసెంబ్లీలో చర్చకు సిద్ధం కాళేశ్వరం 'కూలేశ్వరం'గా మారిందని విమర్శ సంక్షేమానికి రూ.లక్ష కోట్ల ఖర్చు చేసినట్లు వెల్లడి
- Follow Us :
-
-
Add as a preferred
source on google
CM Revanth Reddy : తెలంగాణలో రాబోయే 2034 వరకు కాంగ్రెస్ పార్టీనే అధికారంలో ఉంటుందని, వచ్చే ఎన్నికల్లోనూ తమ విజయాన్ని ఎవరూ అడ్డుకోలేరని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ధీమా వ్యక్తం చేశారు. వేల కోట్లు దోచుకున్న కేసీఆర్ లాంటి వ్యక్తులు మళ్లీ వస్తే ఏమవుతుందో ప్రజలకు బాగా తెలుసని, రాష్ట్రంలో ఎప్పటికీ మూడు రంగుల జెండాయే ఎగురుతుందని స్పష్టం చేశారు. ఈ సందర్భంగానే ఆయన బీఆర్ఎస్ నేతలకు బహిరంగ సవాల్ విసిరారు. పదేళ్ల బీఆర్ఎస్ పాలనకు, రెండున్నరేళ్ల తమ కాంగ్రెస్ పాలనకు మధ్య మేనిఫెస్టోల అమలుపై అసెంబ్లీలో ఎన్ని రోజులైనా చర్చకు సిద్ధమని, దీనికోసం స్పీకర్కు లేఖ రాయాలని ప్రతిపక్షానికి సూచించారు. తమ హయాంలో కేసీఆర్ తినే సన్నబియ్యాన్నే నేడు పేదలు తింటున్నారని, అనుమానం ఉంటే తండాలకు వెళ్లి చూసుకోవచ్చని సీఎం పేర్కొన్నారు.
పేదలకు ఇందిరమ్మ ఇళ్లు ఇస్తుంటే ప్రతిపక్షాలు కడుపుమంటతో ఏడుస్తున్నాయని సీఎం రేవంత్ రెడ్డి మండిపడ్డారు. రూ.500 కే గ్యాస్ సిలిండర్ అందిస్తూ.. గత 30 నెలల కాలంలో సంక్షేమ పథకాల కోసం రూ.లక్ష కోట్లకు పైగా ఖర్చు చేశామని వివరించారు. కేంద్రంతో మాట్లాడి రాష్ట్రంలో యూరియా కష్టాలు లేకుండా చేశామని, రికార్డు స్థాయిలో 80 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని సేకరించామని తెలిపారు. గత ప్రభుత్వం లక్ష కోట్లతో కట్టిన కాళేశ్వరం ప్రాజెక్టు కేవలం ‘కూలేశ్వరం’ గా మారిందని, ఇప్పుడు ఆ నీళ్లు లేకుండానే రాష్ట్రంలో రికార్డు స్థాయి పంట ఉత్పత్తి సాధిస్తున్నామని గుర్తుచేశారు. గిరిజనులకు మెరుగైన విద్యను అందిస్తున్నామని, భవిష్యత్తులో గురుకులాల ద్వారా వందలాది మంది అంబేద్కర్లను తయారుచేస్తామని సీఎం రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు.
Also Read
తాజావార్తలు
-
Shreyas Iyer: ఓటమికి కారణాలు ఇవే.. తప్పులను నిజాయితీగా ఒప్పుకున్న శ్రేయస్ అయ్యర్..
-
Harmanpreet Kaur: ఆ తప్పే మా కొంపముంచింది.. ప్రతీ సారి ఇలానే జరుగుతోంది.. భావోద్వేగానికి లోనైన కెప్టెన్..
-
CM Chandrababu : ఐదు రోజుల సీఎం టూర్.. వరుసగా భారీ కార్యక్రమాలు
-
IND Vs IRE: ప్రపంచ ఛాంపియన్ను మట్టికరిపించిన ఐర్లాండ్.. సిరీస్ కైవసం..
-
Nimmala Ramanaidu : జగన్వి అన్నీ క్రెడిట్ చోరీ ముచ్చట్లే.. వెలిగొండను పూర్తి చేసేది చంద్రబాబే
ట్రెండింగ్
-
Smriti Mandhana: నీయవ్వ తగ్గేదేలే.. ఆస్ట్రేలియా అంటే బయపడుతామా?.. మా సత్తా ఏంటో చూపిస్తాం!
-
Kitchen Tips : ప్రెషర్ కుక్కర్ రబ్బర్ వదులై గ్యాస్ లీక్ అవుతుందా? ఈ సింపుల్ చిట్కాలు ట్రై చేయండి.!
-
Lunch Box Cleaning : లంచ్ బాక్స్ రబ్బరు మురికితో నల్లబడిందా..? ఇలా సింపుల్గా మెరిపించండి.!
-
Positive Energy at Home: ఇంట్లో నెగెటివ్ ఎనర్జీకి చెక్.. ఈ చిట్కాలతో పాజిటివ్ ఎనర్జీ మీ సొంతం.!
-
Mohanlal: ‘ఏజ్ ఈజ్ జస్ట్ నంబర్’.. ఇద్దరు హీరోయిన్లతో డాన్స్ అదరగొట్టిన మలయాళి మెగాస్టార్.!