PM Modi: మోదీకి మరో అంతర్జాతీయ గౌరవం.. సీషెల్స్ నుంచి అత్యున్నత అవార్డు
- ప్రధాని మోదీకి సీషెల్స్ అత్యున్నత పర్యావరణ పురస్కారం.
- 'గార్డియన్ ఆఫ్ ది బ్లూ హొరైజన్' అవార్డుతో సత్కారం.
- పర్యావరణ పరిరక్షణ, క్లైమేట్ యాక్షన్లో నాయకత్వానికి గుర్తింపు.
- చిన్న ద్వీప దేశాలకు భారత్ అందించిన సహకారాన్ని ప్రశంసించిన సీషెల్స్.
- Follow Us :
-
-
Add as a preferred
source on google
PM Modi: ప్రధాని నరేంద్రమోడీకి మరో అంతర్జాతీయ గౌరవం దక్కింది. షీషెల్స్ ప్రభుత్వం అత్యున్నత పర్యావరణ పురస్కారమైన ‘‘గార్డియన్ ఆఫ్ ది బ్లూ హోరైజన్’’(Guardian of the Blue Horizon) అవార్డును ప్రధాని మోదీకి ప్రదానం చేసింది. పర్యావరణ పరిరక్షణ, సుస్థిర అభివృద్ధి , వాతావరణ మార్పులు నియంత్రణలో నాయకత్వానికి గానూ ఈ అవార్డు ప్రదానం చేసింది. ఈ అవార్డు ద్వారా పర్యావరణ పరిరక్షణ, బ్లూ ఎకానమీ, సుస్థిర అభివృద్ధి, సముద్ర వనరుల బాధ్యతాయుత వినియోగం, వాతావరణ మార్పులను ఎదుర్కొనే చర్యల్లో మోదీ చూపిన నాయకత్వాన్ని సీషెల్స్ ప్రభుత్వం ప్రశంసించింది. చిన్న ద్వీప దేశాల అభివృద్ధి, వాతావరణ స్థిరత్వం కోసం భారత్ అందిస్తున్న సహకారాన్ని సీషెల్స్ ప్రభుత్వం ప్రస్తావించింది.
ఈ అవార్డుపై ప్రధాని మోడీ స్పందిస్తూ.. ఈ అవార్డును వినమ్రంగా స్వీకరిస్తున్నానని, ప్రపంచ వ్యాప్తంగా వాతావరణ మార్పులు ఎదుర్కొంటున్న దేశాల ప్రజలకు, భవిష్యత్ తరాల కోసం పర్యావరణ పరిరక్షణను బాధ్యతగా భావించే ప్రతీ ఒక్కరికి ఈ గౌరవాన్ని అంకితం చేస్తున్నట్లు ప్రకటించారు.
Also Read
- NTA: నీట్ వివాదం.. NTAలో భారీ ప్రక్షాళన.. 47 మందిపై వేటు..
- Ravneet Singh Bittu: కేంద్రమంత్రి రవ్నీత్ సింగ్ బిట్టు రాజీనామా.. ఆమోదం
- Delhi: చాట్జీపీటీకి శుభవార్త.. ఏఎన్ఐ కంటెంట్ వినియోగంపై ఢిల్లీ హైకోర్టులో ఊరట
- Modi-Instagram: వైరల్ వీడియోతో ప్రధాని మోడీకి భారీ క్రేజ్.. ఒక్క రాత్రిలోనే సరికొత్త చరిత్ర
మే 2026లో, ఆహార భద్రతను బలోపేతం చేయడం, వ్యవసాయాన్ని మార్చడం,సుస్థిర వ్యవసాయాన్ని ప్రోత్సహించినందుకు గాను, ఆహార మరియు వ్యవసాయ సంస్థ (FAO) ప్రధాని మోడీకి ‘‘అగ్రికోలా’’ పతకాన్ని ప్రదానం చేసింది. అంతకుముందు, 2018లో, సుస్థిర ఆర్థిక వృద్ధి, ప్రపంచ సహకారం మరియు సమ్మిళిత అభివృద్ధిని ప్రోత్సహించినందుకు గాను ఆయన ‘‘సియోల్ శాంతి బహుమతి’’ని అందుకున్నారు. అదే సంవత్సరం, వాతావరణ చర్యలు, అంతర్జాతీయ పర్యావరణ సహకారాన్ని ప్రోత్సహించడంలో ఆయన నాయకత్వాన్ని గుర్తించి, ఐక్యరాజ్యసమితి తన అత్యున్నత పర్యావరణ పురస్కారమైన ‘ఛాంపియన్స్ ఆఫ్ ది ఎర్త్ అవార్డు’ను ఆయనకు ప్రదానం చేసింది.
తాజావార్తలు
-
CM Revanth Reddy : విద్యాసంస్థల్లో డ్రగ్స్ కనిపిస్తే యాజమాన్యాలదే బాధ్యత
-
KMM CYBER CASE: లెక్క తేలుస్తారా..?
-
Gun Fire: ఆస్తి కోసం దారుణం.. సొంత వదినపైనే సుపారీ గ్యాంగ్తో కాల్పులు..
-
OTR: ‘నేను ఎమ్మెల్యేన్రా.. నన్ను గుర్తించండ్రా’..
-
Trump-Zelensky: మరోసారి వైట్హౌస్కు జెలెన్స్కీ.. ట్రంప్తో ఎందుకింత ఎమర్జెన్సీ మీటింగ్ అంటే..!
ట్రెండింగ్
-
Rainy Season Kitchen Tips : వర్షాల్లో బియ్యానికి పురుగులా? ఇలా చేస్తే సమస్యే లేదు.!
-
కేవలం రూ. 8,999 లకే120Hz డిస్ప్లే, 6000mAh బ్యాటరీతో Lava Virat V1 5G, Virat V1 స్మార్ట్ఫోన్లు లాంచ్..!
-
రూ. 19,499లకే 50MP సోనీ కెమెరా, 6500mAh బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో iQOO Z11 Lite 5G లాంచ్..!
-
Vaibhav Sooryavanshi: సక్సెస్ను తలకెక్కించుకోను.. బుద్దిగా ఉంటా.. వైభవ్ ఆసక్తికర వ్యాఖ్యలు!
-
Kakarakaya Ulli Karam: చేదు లేకుండా కమ్మటి ‘కాకరకాయ ఉల్లి కారం’.. ఇలా చేస్తే పిల్లలు కూడా వదలకుండా తింటారు!