Stock market: 4 రోజులు.. రూ.88,000 కోట్ల ప్రాఫిట్! స్టాక్ మార్కెట్ను షేక్ చేసిన ఆరు టాప్ కంపెనీలు ఇవే..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Stock market: కట్-షార్ట్ ట్రేడింగ్ వీక్లోనూ దేశీయ స్టాక్ మార్కెట్ సరికొత్త రికార్డులతో సంచలనం సృష్టించింది. సాధారణంగా వర్కింగ్ డేస్ తక్కువగా ఉన్నప్పుడు మార్కెట్ మందకొడిగా సాగుతుంటుంది. కానీ గత వారం కేవలం నాలుగు రోజులే ట్రేడింగ్ జరిగినప్పటికీ దలాల్ స్ట్రీట్ బుల్ రన్తో దూసుకుపోయింది. దేశంలోని టాప్ 10 అత్యంత విలువైన కంపెనీలలో ఆరు కంపెనీలు ఇన్వెస్టర్లపై నోట్ల వర్షం కురిపించాయి. నాలుగు రోజుల్లో ఆరు దిగ్గజ సంస్థల ఉమ్మడి మార్కెట్ విలువ ఏకంగా రూ.88,678 కోట్లు పెరిగింది.
బ్యాంకింగ్ రంగం ర్యాంపేజ్..
గత వారం నడిచిన మార్కెట్ ర్యాలీకి బ్యాంకింగ్ స్టాక్స్ పూర్తిగా నాయకత్వం వహించాయి. ముఖ్యంగా ఐసీఐసీఐ బ్యాంక్ ఇన్వెస్టర్లకు బంపర్ లాభాలను తెచ్చిపెట్టి అగ్రగామిగా నిలిచింది. ఈ బ్యాంక్ మార్కెట్ క్యాప్ రూ.29,588.75 కోట్లు పెరిగి, మొత్తం విలువ రూ.9,95,610.74 కోట్లకు చేరింది. 10 లక్షల కోట్ల మార్కుకు ఇది అత్యంత చేరువలో ఉంది. దీని తర్వాత ప్రైవేట్ బ్యాంకింగ్ దిగ్గజం హెచ్డీఎఫ్సీ బ్యాంక్ విలువ రూ.24,718.30 కోట్లు పెరగ్గా.. ప్రభుత్వ రంగ సంస్థ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా మార్కెట్ క్యాప్ రూ.9,322.93 కోట్లు వృద్ధి చెంది రూ.9,64,738 కోట్లకు చేరింది.
Also Read
- MS Dhoni: ఎంఎస్ ధోనీ కొత్త బిజినెస్కు బంపర్ బూస్ట్.. కోట్లలో నిధులు సమీకరణ!
- Gold and Silver Price: ఆషాడంలో కూడా తగ్గట్లేవుగా బంగారం.. భారీగా పెరిగిన ధరలు
- LIC Smart Pension Plan: ఒక్కసారి పెట్టుబడి.. జీవితాంతం పింఛన్.. స్మార్ట్ పెన్షన్ ప్లాన్ పూర్తి వివరాలు
- PM Kisan Yojana: పీఎం కిసాన్ యోజన మొత్తం పెంపుపై కేంద్ర మంత్రి శివరాజ్ సింగ్ క్లారిటీ.. 24వ వాయిదాకు ముందు కీలక అప్డేట్
నంబర్ వన్ పొజిషన్లో రిలయన్స్ ఆధిపత్యం
ముఖేష్ అంబానీ నేతృత్వంలోని రిలయన్స్ ఇండస్ట్రీస్ మార్కెట్లో తన తిరుగులేని ఆధిపత్యాన్ని నిలబెట్టుకుంది. గత వారంలో ఈ కంపెనీ మార్కెట్ విలువ రూ.12,043.96 కోట్లు పెరిగింది. దీంతో రిలయన్స్ మొత్తం మార్కెట్ క్యాప్ రూ.17,83,926.92 కోట్లకు చేరి, దేశంలోనే అత్యంత విలువైన కంపెనీగా టాప్లో కొనసాగుతోంది. వీటితో పాటు బజాజ్ ఫైనాన్స్ రూ.11,580.28 కోట్లు, లార్సెన్ & టూబ్రో (L&T) రూ.1,423.88 కోట్ల లాభాలను ఖాతాలో వేసుకున్నాయి.
ఎయిర్టెల్, ఎల్ఐసీ ఇన్వెస్టర్లకు భారీ షాక్
మార్కెట్ ఇంతలా లాభపడుతున్నా కొన్ని దిగ్గజ కంపెనీలు మాత్రం తీవ్ర ఎదురుదెబ్బలు తిన్నాయి. టెలికాం దిగ్గజం భారతీ ఎయిర్టెల్ అత్యధికంగా రూ.35,615.21 కోట్లు నష్టపోయింది. అలాగే ప్రభుత్వ రంగ బీమా సంస్థ ఎల్ఐసీ (LIC) విలువ రూ.21,188.74 కోట్లు పడిపోయింది. ఐటీ దిగ్గజం టీసీఎస్ రూ.11,143.71 కోట్లు, ఎఫ్ఎంసీజీ కంపెనీ హిందుస్థాన్ యూనిలివర్ రూ.5,321.83 కోట్లు నష్టపోయాయి. గత వారం బీఎస్ఈ సెన్సెక్స్ 297.57 పాయింట్లు (0.38%), ఎన్ఎస్ఈ నిఫ్టీ 42.90 పాయింట్లు (0.17%) లాభపడ్డాయి. అంతర్జాతీయ మార్కెట్లో ముడి చమురు ధరలు తగ్గడం భారత మార్కెట్కు పెద్ద ప్లస్ పాయింట్గా మారిందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. దీనికి తోడు, పశ్చిమ ఆసియాలో ఉద్రిక్తతలు తగ్గడం, విదేశీ సంస్థాగత పెట్టుబడిదారులు తిరిగి కొనుగోళ్లు స్టార్ట్ చేయడంతో మార్కెట్ లాభాల బాట పట్టిందని చెబుతున్నారు.
తాజావార్తలు
-
Story Board : దేశ ప్రజల స్వరం మారుతోంది..కేంద్రంపై అసంతృప్తి ,ఆవేశం మరింత రాజుకుంటే…
-
Criminal Lawyer: కోర్టులో లాయర్.. బయట గంజాయి స్మగ్లర్! పుష్ప స్టైల్లో స్మగ్లింగ్..
-
TG-AP THEFTS: తెలుగు రాష్ట్రాల్లో రెచ్చిపోయిన దోపిడీ దొంగలు.. నిమిషాల్లోనే ఎలా చక్కబెట్టారంటే..!
-
Niti Aayog: నీతి ఆయోగ్ కొత్త సీఈవోగా అనురాగ్ జైన్ నియామకం.. కేంద్రం ఉత్తర్వులు
-
Kaylee Hottle: హాలీవుడ్లో విషాదం.. ‘గాడ్జిల్లా వర్సెస్ కాంగ్’ ఫేమ్ కేలీ హాటిల్ కన్నుమూత
ట్రెండింగ్
-
Natural Drinks : రక్తంలో యూరిక్ యాసిడ్ తగ్గాలంటే.. ఈ నాచురల్ డ్రింక్స్ తప్పక తాగండి
-
Palakura Chutney Recipe : ప్రోటీన్, కాల్షియం పుష్కలంగా ఉండే పాలకూర చట్నీ.. 10 నిమిషాల్లో రెడీ.!
-
Home Hacks : కాంతి తగ్గిన బల్బు మార్చొద్దు.. ఈ చిన్న ట్రిక్తో వెలుగు డబుల్.!
-
Nicholas Pooran: ముంబై స్టార్ ప్లేయర్ విధ్వంసం.. పాకిస్తాన్ బౌలర్ బతిమాడేలా ఆడాడుగా!
-
IND vs ZIM 1st T20: నయా బ్యాటింగ్-బౌలింగ్ లైనప్.. ఇద్దరు అరంగేట్రం.. టీమిండియా డేంజరస్ ప్లేయింగ్ 11 ఇదే!