Sharmistha Mukherjee: “రాజకీయం పార్ట్ టైమ్ కాదు”.. రాహుల్ గాంధీపై ప్రణబ్ కుమార్తె ఘాటు విమర్శలు..
- రాహుల్ గాంధీపై శర్మిష్ఠా ముఖర్జీ ఘాటు విమర్శలు.
- "రాజకీయం 24 గంటల బాధ్యత" అని వ్యాఖ్య.
- కాంగ్రెస్ వరుస ఓటములకు రాహుల్ నాయకత్వమే కారణం..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Sharmistha Mukherjee: మాజీ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ కుమార్తె శర్మిష్టా ముఖర్జీ కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీపై తీవ్ర విమర్శలు చేశారు. రాజకీయాలంటే కొద్ది రోజులు ప్రజల్లో ఉంటూ, మళ్లీ మాయమయ్యే వ్యవహారం కాదని, రాజకీయం 24 గంటలు, ఏడాది పొడవునా కొనసాగే ఫుట్ టైమ్ బాధ్యత అని ఆమె అన్నారు. ఒక మీడియా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆమె ఈ వ్యాఖ్యలు చేవారు. 2014లో రాహుల్ గాంధీ కాంగ్రెస్ ముఖ్య నేతగా ఉన్నప్పటి నుంచి పార్టీ వరసగా ఎన్నికల్లో ఓటములు చవిచూస్తోందని, ఇది ఆయన నాయకత్వ వైఫల్యంగా భావించాల్సిందే అని పేర్కొన్నారు.
2024 లోక్సభ ఎన్నికల ముందు భారత్ జోడో యాత్ర కాంగ్రెస్కు కొంత మేర ప్రయోజనం చేకూర్చిందని అంగీకరిస్తూనే, కొన్ని కార్యక్రమాల్లో రాహుల్ గాందీ కనిపించి, ఆ తర్వాత ప్రజలకు కనిపించకుండా పోతారని విమర్శించారు. భారత్ జోడో యాత్ర మొదటి వార్షికోత్సవ సమయంలో రాహుల్ గాంధీ ఎక్కడ ఉన్నారు..? అని ఆమె ప్రశ్నించారు. రాజకీయాల్లో రెండు రోజులు ప్రజల్లో తిరిగి, సభలు నిర్వహించి, ఆ తర్వాత కనిపించకుండా పోవడం సరైన విధానం కాదని శర్మిష్టా అన్నారు.
Also Read
- Bengaluru: బాత్రూమ్లో మహిళ అస్థిపంజరం లభ్యం.. ట్విస్ట్ ఏంటంటే..!
- Sugar Price Hike: పండుగల వేళ చక్కెర ధరకు రెక్కలు.. తాజాగా ఎంత పెరిగిందంటే..!
- IRCTC: తత్కాల్ టికెట్ దొరకలేదని బాధపడొద్దు.. మీకు ఈ ఆప్షన్ ఉందని తెలుసా!
- Punjab Politics: నిన్న బాదల్, నేడు రాఘవ్ చద్దాలతో ప్రధాని మోడీ భేటీ.. రసవత్తరంగా పంజాబ్ పాలిటిక్స్..
కాంగ్రెస్ పార్టీ పొత్తులపై ఆధారపడుతోందని, సొంతగా సంస్థాగత బలాన్ని పెంచుకోవడంపై ఆలోచించడం లేదని ఆమె ఆరోపించారు. తాను కాంగ్రెస్లో పనిచేసిన సమయంలో పార్టీ అంతర్గతంగా బలోపేతం అవ్వడం కన్నా, పొత్తుల ద్వారా గెలవాలనే ఆలోచన ఎక్కువగా కనిపించేదని తెలిపారు. ప్రధాని నరేంద్రమోడీ ప్రజాదరణ కలిగిన నాయకుడని, ఆయనకు ప్రజలు స్పష్టమైన మెజారిటీ ఇచ్చారని, అదే స్థాయిలో కాంగ్రెస్కు ప్రజామద్దతు తీసుకురావడంలో రాహుల్ గాంధీ విఫలమయ్యారని అన్నారు. రాహుల్, ప్రియాంకా గాంధీల నాయకత్వాన్ని పోల్చేందుకు తాను ఇష్టపడటం లేదని శర్మిష్టా చెప్పారు.
తాజావార్తలు
-
Bengaluru: బాత్రూమ్లో మహిళ అస్థిపంజరం లభ్యం.. ట్విస్ట్ ఏంటంటే..!
-
Dharmendrasinh Jadeja: 609 వికెట్ల వీరుడు.. టీమ్ ఇండియాలో చోటు లేదు.. ధర్మేంద్రసింగ్ జడేజా కథ ఇదే!
-
Russia: నాటో కూటమిలో చీలిక తెచ్చేందుకు పుతిన్ బిగ్ ప్లాన్.!
-
Sugar Price Hike: పండుగల వేళ చక్కెర ధరకు రెక్కలు.. తాజాగా ఎంత పెరిగిందంటే..!
-
Vijaya Dairy Chairman Post: విజయ డైరీ ఛైర్మన్ ఎంపికకు బ్రేక్.. వారం రోజులు వాయిదా..
ట్రెండింగ్
-
19.62kmpl మైలేజ్, 150hp టర్బో ఇంజిన్తో Volkswagen Virtus Anniversary ఎడిషన్ లాంచ్.. ధర, ఫీచర్లు ఇవే.!
-
Clothes Smell: వర్షాకాలంలో బట్టల నుంచి దుర్వాసనా.? ఈ సింపుల్ చిట్కాలతో చెక్ పెట్టండి ఇలా.!
-
1TB వరకు స్టోరేజ్,120Hz డిస్ప్లే, Tensor G6తో Google Pixel 11 సిరీస్.. లాంచ్కు ముందే ధరలు లీక్.!
-
Airtel యూజర్లకు షాక్.. రూ.299 ప్లాన్ నిలిపివేత.. ఇక అన్లిమిటెడ్ ప్లాన్ రూ.349 నుంచే మొదలు.!
-
7500mAh బ్యాటరీ, 6.9 అంగుళాల 120Hz డిస్ప్లే, 45W ఫాస్ట్ ఛార్జింగ్తో REDMI 17 5G లాంచ్..!