MEA: కరాచీ దాడిని భారత్పై నెట్టొద్దు.. పాక్పై ఘాటు వ్యాఖ్యలు..
- కరాచీ దాడిపై పాక్ ఆరోపణల్ని ఖండించిన భారత్..
- ఉగ్రవాద నెట్వర్క్లపై చర్యలు తీసుకోవాలని పాక్కు సూచన.
- Follow Us :
-
-
Add as a preferred
source on google
MEA: ఇటీవల పాకిస్తాన్ ఆర్థిక రాజధాని కరాచీలోని సింధ్ రేంజర్స్ స్థావరంపై ఉగ్రవాద దాడి జరిగింది. అయితే, ఈ దాడి వెనక భారత్ ఉందని పాకిస్తాన్ ఆరోపించింది. ఈ ఆరోపణల్ని భారత్ తీవ్రంగా ఖండించింది. ఈ ఆరోపణలు పూర్తిగా నిరాధారణమైనవని కేంద్ర విదేశీ మంత్రిత్వ శాఖ(MEA) స్పష్టం చేసింది. ఇతరుల వైపు వేలెత్తి చూపేటప్పుడు సొంత దేశంలో పనిచేస్తున్న ఉగ్రవాద నెట్వర్క్లపై చర్యలు తీసుకోవాలని పాకిస్తాన్కు భారత్ సూచించింది.
విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి రణధీర్ జైస్వాల్ మాట్లాడుతూ.. కరాచీ ఘటనకు సంబంధించి భారత్పై పాక్ మీడియా చేస్తున్న అన్ని ఆరోపణల్ని తిరస్కరిస్తున్నామని తెలిపారు. పాకిస్తాన్ ఇతరుల్ని నిందించడం మానేసి, తన భూభాగంలో పనిచేస్తున్న ఉగ్రవాద మౌలిక సదుపాయాలపై చర్యలు తీసుకోవాలని, ఉగ్రవాదాన్ని ప్రభుత్వ విధానాల్లో ఉపయోగించే ధోరణిని విడిచిపెట్టాలని ఘాటు వ్యాఖ్యలు చేసింది.
Also Read
- Meerut Murder: ఆరేళ్ల క్రితం ప్రేమ పెళ్లి.. డ్రైవర్తో ఎఫైర్.. భర్తను పాముతో కరిపించి చంపేసిన భార్య..
- Sakshi Jha: సాక్షి ఝా 'మ్యాన్ హేటర్' వ్యాఖ్యలు.. భర్తకు మద్యం తాగించి చంపాలనుకుంటున్నట్లు చెప్పిన వైనం
- Vikram-1 Launch: చరిత్ర సృష్టించిన విక్రమ్-1.. భారత తొలి ప్రైవేట్ ఆర్బిటల్ రాకెట్ విజయవంతం
- RBI Polymer Notes: ప్లాస్టిక్ కరెన్సీకి శ్రీకారం.. గ్లోబల్ టెండర్ జారీ చేసిన ఆర్బీఐ.. కఠిన షరతులు..!
శనివారం సాయంత్రం కరాచీలోని గులిస్తాన్-ఇ-జౌహర్ ప్రాంతంలో ఉన్న సింధ్ రేంజర్స్ భిట్టై వింగ్ ప్రధాన కార్యాలయంపై భారీ ఆయుధాలతో వచ్చిన ఉగ్రవాదులు దాడికి పాల్పడ్డారు. ప్రధాన గేటును వాహనంతో ఢీకొట్టి గ్రెనేడ్లు విసిరి, కాల్పులు జరిపారు. దాదాపు 90 నిమిషాల పాటు జరిగిన కాల్పుల్లో నలుగురు రేంజర్స్ సిబ్బంది మరణించగా, ఆరుగురు ఉగ్రవాదులు హతమయ్యారు. ఈ దాడికి తెహ్రీక్-ఇ-తాలిబాన్ పాకిస్థాన్ (TTP) అనుబంధ సంస్థ జమాత్-ఉల్-అహ్రార్ బాధ్యత వహించింది.
తాజావార్తలు
-
Meerut Murder: ఆరేళ్ల క్రితం ప్రేమ పెళ్లి.. డ్రైవర్తో ఎఫైర్.. భర్తను పాముతో కరిపించి చంపేసిన భార్య..
-
The Odyssey: రూ.2000 కోట్ల బడ్జెట్.. నోలన్ మ్యాజిక్కు ఇండియా ఫిదా.. ‘ది ఒడిస్సీ’కి అదిరిపోయే ఓపెనింగ్!
-
Explainer: అట్లాంటిక్ కింద 300°C వేడి నీరు.. సూర్యకాంతి లేకుండా జీవం ఎలా బతుకుతోంది?
-
WHO Cancer Report 2026: ఏడాదికి కోటి మంది మృతి..! క్యాన్సర్పై WHO షాకింగ్ నివేదిక..
-
KTR: 70 వేల ఉద్యోగాలు ఇచ్చినట్టు నిరూపిస్తే.. శాశ్వతంగా రాజకీయాల నుంచి తప్పుకుంటా.!
ట్రెండింగ్
-
IND vs ENG 3rd ODI: అభిమానులకు అలర్ట్.. మూడో వన్డే మ్యాచ్ సమయంలో మార్పు.. లైవ్ స్ట్రీమింగ్ డీటెయిల్స్ ఇవే!
-
Android vs iPhone ఫైట్కు కొత్త ట్విస్ట్.! మెస్సీ కోసం Samsung, రొనాల్డో కోసం iPhone.. లగ్జరీ ఫోన్లు విడుదల..!
-
Jeera Rice: రెస్టారెంట్ స్టైల్ ‘జీరా రైస్’ ఇంట్లోనే.. వంట రాని వాళ్లు కూడా 5 నిమిషాల్లో సులువుగా చేసేయండి ఇలా..!
-
Rohit Sharma Retirement: రోహిత్ శర్మ అభిమానులకు శుభవార్త.. రిటైర్మెంట్ లేనట్టే!
-
185Hz OLED డిస్ప్లే, లిక్విడ్ కూలింగ్తో పవర్ఫుల్ గేమింగ్ ట్యాబ్లెట్ REDMAGIC Astra 2 లాంచ్..!