Nimmala Ramanaidu : జగన్వి అన్నీ క్రెడిట్ చోరీ ముచ్చట్లే.. వెలిగొండను పూర్తి చేసేది చంద్రబాబే
- జగన్పై మంత్రి నిమ్మల ఘాటు విమర్శలు
- వెలిగొండ ప్రాజెక్టుపై గత ప్రభుత్వంపై ఆరోపణలు
- కూటమి ప్రభుత్వంలో వేగంగా సాగుతున్న పనులు
- నిర్వాసితులకు నిధులు.. ప్రాజెక్టు పూర్తి చేస్తామన్న హామీ
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Nimmala Ramanaidu : “రాష్ట్రంలో ఎలాంటి క్రెడిట్ లేని వైఎస్ జగన్ మోహన్ రెడ్డి.. ఇప్పుడు క్రెడిట్ చోరీ గురించి మాట్లాడుతుండటం హాస్యాస్పదం. జగన్మోహన్ రెడ్డికి ఉన్న ప్రత్యేకమైన క్రెడిట్లను మేమే కాదు, ఈ ప్రపంచంలో ఎవ్వరూ చోరీ చేయలేరు. ఎందుకంటే హత్యలు, దోపిడీలు, గొడ్డలి పోట్లు, నిరంతర అసత్యాలు మాట్లాడటమే ఆయనకున్న అసలైన క్రెడిట్” అని రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లులో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ, గత వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వ హయాంలో వెలిగొండ ప్రాజెక్టు విషయంలో జరిగిన దగాను లెక్కలతో సహా ఎండగట్టారు.
పనులు పూర్తి కాకుండానే జాతికి అంకితమా?
పనులు ఇంకా ఎంతో మిగిలి ఉండగానే వెలిగొండ ప్రాజెక్టును జాతికి అంకితం చేశామంటూ జగన్ మోహన్ రెడ్డి ప్రగల్భాలు పలికారని మంత్రి రామానాయుడు మండిపడ్డారు. వెనుకబడిన ప్రకాశం జిల్లా రైతులను జగన్ ఘోరంగా మోసం చేశారని, తన సొంత పత్రిక, టీవీ ఛానళ్ల ద్వారా టన్నుల కొద్దీ అబద్ధాలను అచ్చేయించి ప్రచారం చేసుకున్నారని విమర్శించారు. ప్రాజెక్టు పరిధిలోని భూ నిర్వాసితులకు రూ. 900 కోట్లకు పైగా పరిహారం అందించాల్సి ఉండగా, గత ఐదేళ్లలో వారికి ఒక్క రూపాయి కూడా ఇవ్వలేదని ఆరోపించారు. టన్నెల్-2 లో 12వ కిలోమీటర్ వద్ద విరిగిపోయి చిక్కుకున్న టీబీఎం (TBM – టన్నెల్ బోరింగ్ మెషిన్)ను తొలగించకుండా చుక్క నీరు కూడా ఇవ్వలేమని తెలిసినప్పటికీ, గత ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకోకుండా ప్రాజెక్టును గాలికొదిలేసిందని మండిపడ్డారు.
Also Read
- Chittoor Horror: అసలు తల్లివేనా..? వివాహేతర సంబంధానికి అడ్డుగా ఉన్నాడని ఏడేళ్ల కుమారుడికి చిత్రహింసలు..!
- Nadendla Manohar: స్థానిక ఎన్నికల్లో కొత్త వ్యూహం.. మంత్రి నాదెండ్ల మనోహర్ కీలక వ్యాఖ్యలు..
- OTR: పోలవరం క్రెడిట్ రేస్లోకి ఏపీ బీజేపీ.? ముఖ్య నేతలంతా ర్యాలీగా ప్రాజెక్ట్ సైట్కు.!
- OTR: కాపు ఓట్ బ్యాంక్ వైసీపీకి దూరమైందా.? లెక్కలు ఏం చెబుతున్నాయంటే.?
కూటమి ప్రభుత్వంలో పరుగులు పెడుతున్న పనులు
ముప్పై ఏళ్ల క్రితం వెలిగొండ ప్రాజెక్టుకు నాడు భూమి పూజ చేసిన నారా చంద్రబాబు నాయుడే, ఇప్పుడు మళ్లీ ముఖ్యమంత్రిగా ఈ ప్రాజెక్టును పూర్తి చేసి ఈ ప్రాంత ప్రజల సాగు, తాగు నీటి కల నెరవేర్చబోతున్నారని మంత్రి రామానాయుడు స్పష్టం చేశారు. ఈ ప్రాజెక్టు పూర్తయితే దశాబ్దాలుగా వేధిస్తున్న ఫ్లోరైడ్ సమస్యకు శాశ్వత ముగింపు లభిస్తుందన్నారు. ప్రస్తుత కూటమి ప్రభుత్వంలో హైకోర్టు అనుమతితో టన్నెల్-2 లో చిక్కుకున్న టీబీఎం తొలగింపు పనులను అత్యంత వేగంగా చేపట్టామని వివరించారు. అలాగే టన్నెల్-1 లో అడ్డుగా పేరుకుపోయిన 1.2 లక్షల క్యూబిక్ మీటర్ల మక్ (వ్యర్థాలు) తొలగింపు పనులలో భాగంగా ఇప్పటికే 40 వేల క్యూబిక్ మీటర్ల వ్యర్థాలను విజయవంతంగా తొలగించామని పేర్కొన్నారు.
పునరావాసానికి రూ. 903 కోట్లు.. ప్రాజెక్టు పూర్తికి రూ. 3,844 కోట్లు అవసరం
నల్లమలసాగర్కు పూర్తి స్థాయిలో నీళ్లు నింపడానికి , నిర్వాసితుల పునరావాస కార్యక్రమాలను వేగవంతం చేయడానికి కూటమి ప్రభుత్వం అదనపు బడ్జెట్లో రూ. 903 కోట్లు కేటాయించిందని మంత్రి రామానాయుడు వెల్లడించారు. ప్రస్తుత అంచనాల ప్రకారం వెలిగొండ ప్రాజెక్టు పనులన్నీ సంపూర్ణంగా పూర్తి కావాలంటే ఇంకా రూ. 3,844 కోట్లు అవసరమవుతాయని తెలిపారు. జగన్ రెడ్డి లాగా కేవలం ప్రచారాలకే పరిమితం కాకుండా, నిధులు కేటాయించి క్షేత్రస్థాయిలో పనులు పూర్తి చేసి ప్రకాశం జిల్లాను సస్యశ్యామలం చేయడమే తమ ప్రభుత్వ ధ్యేయమని మంత్రి నిమ్మల రామానాయుడు స్పష్టం చేశారు.
తాజావార్తలు
-
UK: బ్రిటన్ ప్రధానిగా ఆండీ బర్న్హామ్.. సోమవారం బాధ్యతలు స్వీకరణ
-
Ponnam Prabhakar: అలాంటి వాహనాలను సీజ్ చేయండి.. మంత్రి పొన్నం ప్రభాకర్ సీరియస్ వార్నింగ్..
-
Sonam Wangchuk: సోనం వాంగ్చుక్ దీక్షలో నవ్వులు.. పువ్వులు.. ఏం జరిగిందంటే..!
-
Gambhir-Kohli: గంభీర్-కోహ్లీ మధ్య ‘కోల్డ్ వార్’.. తొలి సారి నోరు విప్పిన టీమిండియా కోచ్!
-
Pakistan: పాక్లో 5వ రాష్ట్రంగా గిల్గిట్-బాల్టిస్తాన్.. భారత్ను కవ్వించే చర్య..
ట్రెండింగ్
-
144Hz కర్వ్డ్ AMOLED డిస్ప్లే, 50MP ట్రిపుల్ కెమెరాతో Tecno Camon 50 Ultra 5G భారత్లో లాంచ్.. ధర ఎంతంటే?
-
Karapannam Recipe: అన్నం మిగిలి పోయిందా.? ఏంపర్లేదు.. ఇలా ‘కారపన్నం’ చేస్తే ప్లేట్ ఖాళీ అవ్వాల్సిందే.!
-
రూ.14,499లకే 8000mAh బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో Realme C100x లాంచ్..!
-
Chilli Egg Recipe: రెస్టారెంట్ స్టైల్ ‘స్పైసీ చిల్లీ ఎగ్’.. ఇంట్లోనే ఈజీగా ఇలా చేసుకోండి.!
-
Tollywood: సినిమాకి కలెక్షన్స్ వచ్చినా నిర్మాతలకు డబ్బులు రావా.! అసలు నిజం ఏంటి.?