మన ఇంట్లో దొరికే దాల్చిన చెక్కను పొడిగా చూసి తేనెను ఒక టీస్పూన్ కలిపి మూడు పూటలా తీసుకోవాలి.

ఇంట్లో ఉండే వెల్లుల్లి రెండు, మూడు రెబ్బలు తీసుకుని బాగా నలిపి అందులో ఒక టీస్పూన్ తేనె కలిపి ఆ మిశ్రమాన్ని తాగినా దగ్గు పోతుంది.

ఒక గ్లాస్ గోరు వెచ్చని పాలలో చిటికెడు పసుపు, అర టీస్పూన్ వెల్లుల్లి రసం కలిపి తీసుకుంటే దగ్గు నుంచి ఉపశమనం పొందొచ్చు.

దానిమ్మ గింజల రసం ఓ టేబుల్ స్పూన్ తీసుకుని దాంట్లో చిటికెడు అల్లం రసం లేదా మిరియాల పొడి కలిపి తాగినా మంచిదే.

సోంపును ఓ టేబుల్ స్పూన్ తీసుకుని.. అందులో ఓ టీస్పూన్ చక్కెర కలిపి 3 పూటలా తింటే ఉపశమనం లభిస్తుంది.

దగ్గు బాధించినప్పుడు రోజుకు మూడు పూటలా ఒక టేబుల్ స్పూన్ తేనెను తీసుకుంటుంటే మంచిది.

ఒక టేబుల్ స్పూన్ అలోవెరా జ్యూస్‌కు ఓ టీస్పూన్ తేనె కలిపి తాగితే దగ్గు, గొంతు సమస్యలు పోతాయి.

ఓ గ్లాస్ నీటిలో కొన్ని లవంగాలను వేసి మరిగించాలి. ఆ నీటిని తాగితే గొంతు నొప్పి, దగ్గు రెండు తగ్గుతాయి.

ఒక టీస్పూన్ అల్లం రసంలో మిరియాల పొడి, శొంఠి పొడి, లవంగాల పొడిలను అర టీస్పూన్ లెక్కన వేసి బాగా కలపాలి. ఈ మిశ్రమాన్ని డికాషన్‌లో వేసి బాగా మరిగించి టీ కాచుకుని తాగితే దగ్గు, గొంతు సమస్యలు దూరమవుతాయి.