Gas Cylinder Subsidy: గ్యాస్ వినియోగదారులకు బిగ్ షాక్.. ‘రాయితీ’కి కత్తెర.. వంటగదిలో ఇక కట్టెల పొయ్యే…
- Follow Us :
-
-
Add as a preferred
source on google
కేంద్ర ప్రభుత్వం పేద మహిళల కోసం ప్రవేశపెట్టిన ప్రతిష్టాత్మక పథకం “ప్రధాని మంత్రి ఉజ్వల యోజన” (PMUY) లబ్ధిదారులకు గట్టి షాక్ తగిలింది. అంతర్జాతీయ మార్కెట్లో ఇంధన ధరలు ఆకాశాన్ని తాకుతుండటంతో.. ప్రభుత్వం తన రాయితీ భారానికి కత్తెర వేసింది. ఇప్పటివరకు ఈ పథకం కింద ఏడాదికి అందుతున్న 9 సబ్సిడీ సిలిండర్ల పరిమితిని ఏకంగా 4 కి తగ్గించేసింది. అంటే.. ఐదో సిలిండర్ కొనాలంటే ఇకపై సామాన్యుడు మార్కెట్ రేటు చెల్లించాల్సిందే.
ట్విస్ట్ ఏమిటంటే.. ఉజ్వల యోజన లబ్ధిదారులు సాధారణంగా ఏడాదికి నాలుగైదు సిలిండర్లు మాత్రమే వాడుతుంటారని, కాబట్టి ఈ తగ్గింపు వారిపై పెద్దగా ప్రభావం చూపదని ప్రభుత్వ అధికారులు సమర్థించుకుంటున్నారు. కానీ.. అసలు ట్విస్ట్ ఇక్కడే ఉంది.. గ్యాస్ ధరలు విపరీతంగా పెరగడం వల్లే పేద కుటుంబాలు సిలిండర్లను రీఫిల్ చేసుకోలేక, మళ్లీ పాత పద్ధతిలో కట్టెల పొయ్యిల వైపు మొగ్గు చూపుతున్నాయి. ప్రభుత్వం ఏటా వాడకం సగటు 4-5 మాత్రమే ఉందని లెక్కలు చెప్తుంటే, క్షేత్రస్థాయిలో మాత్రం ధరల భయంతోనే వాడకం తగ్గిందనేది పచ్చి నిజం.
Also Read
- EPFO: ‘విశ్వాస్’ పథకాన్ని ప్రారంభించిన ఈపీఎఫ్వో.. ఎవరి కోసమంటే..!
- Sanjay Malhotra: పశ్చిమాసియా యుద్ధం నేపథ్యంలో దేశానికి ఆర్బీఐ గవర్నర్ హెచ్చరిక
- RBI New Rules 2026: రుణ ఎగవేతదారులకు ఆర్బీఐ భారీ షాక్.. అక్టోబర్ 1 నుంచి కొత్త రూల్స్
- Bank Loan: ఎలాంటి పూచీ కత్తు లేకుండా రూ.20 లక్షల లోన్ .. ప్రాసెస్ ఇదే..
ప్రస్తుతం ఢిల్లీలో ఉజ్వల వినియోగదారులు రూ.642 చెల్లిస్తుండగా, సాధారణ వినియోగదారులు రూ.942 చెల్లిస్తున్నారు. అయితే… అంతర్జాతీయంగా ‘సౌదీ కాంట్రాక్ట్ ప్రైస్’ ఫిబ్రవరి నుండి 46 శాతం పెరగడంతో, ఒక సిలిండర్ సరఫరా ఖర్చు ప్రభుత్వానికి రూ.1600 దాటుతోంది. దీనివల్ల చమురు సంస్థలు ప్రతి సిలిండర్పై రూ.700 నష్టపోతున్నాయి. ఈ నష్టాలను తట్టుకోవడానికే లబ్ధిదారులకు ఏడాదికి కేవలం మొదటి 4 సిలిండర్లపై మాత్రమే రూ.300 చొప్పున (మొత్తం రూ.1200) రాయితీ ఇవ్వాలని చమురు మంత్రిత్వ శాఖ నిర్ణయించింది. మొత్తానికి, అంతర్జాతీయ చమురు సెగలు.. దేశంలోని పేదవాడి వంటగదిని చల్లబరుస్తున్నాయి. రాయితీలు తగ్గించి బడ్జెట్ బ్యాలెన్స్ చేస్తున్నామంటున్న ప్రభుత్వం, పేదవాడి బడ్జెట్ తలకిందులవుతోందన్న నిజాన్ని విస్మరిస్తోందనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి.
తాజావార్తలు
-
FIFA Final: 96 ఏళ్ల సాకర్ చరిత్రలో తొలిసారి.. వరల్డ్ కప్ ఫైనల్ విజేతలకు ‘ఛాంపియన్షిప్ రింగ్స్’..
-
Earthquake: మెక్సికోలో భారీ భూకంపం.. సునామీ హెచ్చరికలు జారీ
-
Rohit-Kohli Retirement: లార్డ్స్ వేదికగా రోహిత్, కోహ్లీ ఇద్దరూ గుడ్ బై చెప్పేస్తారా..? క్రీడా వర్గాల్లో కలకలం..
-
Pakistan: కువైట్తో రక్షణ ఒప్పందానికి పాక్ ప్రయత్నాలు.. సౌదీ తర్వాత కొత్త వ్యూహం?
-
Sir Garfield Sobers: ఇక సెలవు.. 6 బంతుల్లో 6 సిక్సర్లు కొట్టిన తొలి మొనగాడు.. రికార్డులు చూస్తే షాక్ అవ్వాల్సిందే!
ట్రెండింగ్
-
144Hz కర్వ్డ్ AMOLED డిస్ప్లే, 50MP ట్రిపుల్ కెమెరాతో Tecno Camon 50 Ultra 5G భారత్లో లాంచ్.. ధర ఎంతంటే?
-
Karapannam Recipe: అన్నం మిగిలి పోయిందా.? ఏంపర్లేదు.. ఇలా ‘కారపన్నం’ చేస్తే ప్లేట్ ఖాళీ అవ్వాల్సిందే.!
-
రూ.14,499లకే 8000mAh బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో Realme C100x లాంచ్..!
-
Chilli Egg Recipe: రెస్టారెంట్ స్టైల్ ‘స్పైసీ చిల్లీ ఎగ్’.. ఇంట్లోనే ఈజీగా ఇలా చేసుకోండి.!
-
Tollywood: సినిమాకి కలెక్షన్స్ వచ్చినా నిర్మాతలకు డబ్బులు రావా.! అసలు నిజం ఏంటి.?