CM Chandrababu: స్థానిక ఎన్నికలపై సీఎం చంద్రబాబు నాయుడు కీలక వ్యాఖ్యలు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఆంధ్రప్రదేశ్లో మరో మూడు నెలల్లో జరగబోయే స్థానిక సంస్థల ఎన్నికలకు పార్టీ శ్రేణులన్నీ సర్వసన్నద్ధం కావాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పిలుపునిచ్చారు. రాష్ట్రంలో రాజకీయ సమీకరణాలు వేగంగా మారుతున్న వేళ, రాబోయే స్థానిక పోరును ప్రతిష్టాత్మకంగా తీసుకోవాలని ఆయన స్పష్టం చేశారు. అమరావతిలో జరిగిన తాజా సమీక్షా సమావేశంలో పార్టీ భవిష్యత్తు కార్యాచరణ, నియోజకవర్గాల వారీగా బాధ్యతలపై ఆయన కీలక వ్యాఖ్యలు చేశారు.
తన సొంత నియోజకవర్గమైన కుప్పంపై సీఎం చంద్రబాబు ప్రత్యేక దృష్టి సారించారు. ఇకపై కుప్పంలో జరిగే అన్ని కార్యక్రమాలను తానే స్వయంగా పర్యవేక్షిస్తానని ప్రకటించారు. ఇందుకోసం ప్రతి రెండు నెలలకు ఒకసారి కుప్పం నియోజకవర్గంలో పర్యటించనున్నట్లు వెల్లడించారు. అలాగే, కుప్పం నియోజకవర్గ కన్వీనర్ శ్రీకాంత్ సేవలను ఇకపై రాష్ట్ర స్థాయి అవసరాలకు, పార్టీ బలోపేతానికి వినియోగించుకోనున్నట్లు పేర్కొన్నారు.
Also Read
- FIFA Final: 96 ఏళ్ల సాకర్ చరిత్రలో తొలిసారి.. వరల్డ్ కప్ ఫైనల్ విజేతలకు 'ఛాంపియన్షిప్ రింగ్స్'..
- Earthquake: మెక్సికోలో భారీ భూకంపం.. సునామీ హెచ్చరికలు జారీ
- Rohit-Kohli Retirement: లార్డ్స్ వేదికగా రోహిత్, కోహ్లీ ఇద్దరూ గుడ్ బై చెప్పేస్తారా..? క్రీడా వర్గాల్లో కలకలం..
- Pakistan: కువైట్తో రక్షణ ఒప్పందానికి పాక్ ప్రయత్నాలు.. సౌదీ తర్వాత కొత్త వ్యూహం?
నామినేటెడ్ పోస్టులు దక్కించుకున్న నాయకులకు సీఎం చంద్రబాబు కీలక ఆదేశాలు జారీ చేశారు. పదవుల్లో ఉన్నవారు కేవలం తమకు కేటాయించిన సంబంధిత శాఖల బాధ్యతలను మాత్రమే చూసుకోవాలని, క్షేత్రస్థాయిలో పార్టీ లైన్కు లోబడి పనిచేయాలని స్పష్టం చేశారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో పార్టీ విజయం సాధించడమే లక్ష్యంగా నాయకులంతా సమన్వయంతో ముందుకు సాగాలని సూచించారు.
మరోవైపు.. తెలుగుదేశం పార్టీ తరఫున రాజ్యసభ అభ్యర్థుల నామినేషన్ల ప్రక్రియ రేపు ముగియనుంది. టీడీపీ ప్రకటించిన ముగ్గురు అభ్యర్థులు సానా సతీష్, భాష్యం రామకృష్ణ, చింతకాయల విజయ్.. రేపు ఉదయం 11 గంటలకు తమ నామినేషన్లను అధికారికంగా దాఖలు చేయనున్నారు. రేపు మధ్యాహ్నం 3 గంటలతో రాజ్యసభ అభ్యర్థుల నామినేషన్ల గడువు ముగియనుండటంతో, పార్టీ ముఖ్యనేతల సమక్షంలో ఈ ప్రక్రియ పూర్తి కానుంది. ఒకవైపు స్థానిక ఎన్నికల సమరశంఖం, మరోవైపు రాజ్యసభ స్థానాల భర్తీతో కూటమి ప్రభుత్వం రాష్ట్రంలో రాజకీయంగా మరింత దూకుడు పెంచింది.
తాజావార్తలు
-
FIFA Final: 96 ఏళ్ల సాకర్ చరిత్రలో తొలిసారి.. వరల్డ్ కప్ ఫైనల్ విజేతలకు ‘ఛాంపియన్షిప్ రింగ్స్’..
-
Earthquake: మెక్సికోలో భారీ భూకంపం.. సునామీ హెచ్చరికలు జారీ
-
Rohit-Kohli Retirement: లార్డ్స్ వేదికగా రోహిత్, కోహ్లీ ఇద్దరూ గుడ్ బై చెప్పేస్తారా..? క్రీడా వర్గాల్లో కలకలం..
-
Pakistan: కువైట్తో రక్షణ ఒప్పందానికి పాక్ ప్రయత్నాలు.. సౌదీ తర్వాత కొత్త వ్యూహం?
-
Sir Garfield Sobers: ఇక సెలవు.. 6 బంతుల్లో 6 సిక్సర్లు కొట్టిన తొలి మొనగాడు.. రికార్డులు చూస్తే షాక్ అవ్వాల్సిందే!
ట్రెండింగ్
-
144Hz కర్వ్డ్ AMOLED డిస్ప్లే, 50MP ట్రిపుల్ కెమెరాతో Tecno Camon 50 Ultra 5G భారత్లో లాంచ్.. ధర ఎంతంటే?
-
Karapannam Recipe: అన్నం మిగిలి పోయిందా.? ఏంపర్లేదు.. ఇలా ‘కారపన్నం’ చేస్తే ప్లేట్ ఖాళీ అవ్వాల్సిందే.!
-
రూ.14,499లకే 8000mAh బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో Realme C100x లాంచ్..!
-
Chilli Egg Recipe: రెస్టారెంట్ స్టైల్ ‘స్పైసీ చిల్లీ ఎగ్’.. ఇంట్లోనే ఈజీగా ఇలా చేసుకోండి.!
-
Tollywood: సినిమాకి కలెక్షన్స్ వచ్చినా నిర్మాతలకు డబ్బులు రావా.! అసలు నిజం ఏంటి.?