CM Chandrababu: స్థానిక ఎన్నికలపై సీఎం చంద్రబాబు నాయుడు కీలక వ్యాఖ్యలు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఆంధ్రప్రదేశ్లో మరో మూడు నెలల్లో జరగబోయే స్థానిక సంస్థల ఎన్నికలకు పార్టీ శ్రేణులన్నీ సర్వసన్నద్ధం కావాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పిలుపునిచ్చారు. రాష్ట్రంలో రాజకీయ సమీకరణాలు వేగంగా మారుతున్న వేళ, రాబోయే స్థానిక పోరును ప్రతిష్టాత్మకంగా తీసుకోవాలని ఆయన స్పష్టం చేశారు. అమరావతిలో జరిగిన తాజా సమీక్షా సమావేశంలో పార్టీ భవిష్యత్తు కార్యాచరణ, నియోజకవర్గాల వారీగా బాధ్యతలపై ఆయన కీలక వ్యాఖ్యలు చేశారు.
తన సొంత నియోజకవర్గమైన కుప్పంపై సీఎం చంద్రబాబు ప్రత్యేక దృష్టి సారించారు. ఇకపై కుప్పంలో జరిగే అన్ని కార్యక్రమాలను తానే స్వయంగా పర్యవేక్షిస్తానని ప్రకటించారు. ఇందుకోసం ప్రతి రెండు నెలలకు ఒకసారి కుప్పం నియోజకవర్గంలో పర్యటించనున్నట్లు వెల్లడించారు. అలాగే, కుప్పం నియోజకవర్గ కన్వీనర్ శ్రీకాంత్ సేవలను ఇకపై రాష్ట్ర స్థాయి అవసరాలకు, పార్టీ బలోపేతానికి వినియోగించుకోనున్నట్లు పేర్కొన్నారు.
Also Read
- Supreme Court: మహిళకు ఉద్యోగం నిరాకరించినందుకు పనిష్మెంట్.. రూ.12 లక్షలు పరిహారం చెల్లించాలని తీర్పు
- Third Front: దేశంలో ‘‘థర్డ్ ఫ్రంట్’’.. కనిమొళి వరస భేటీలతో కొత్త చర్చ..
- Marital Rape: వైవాహిక అత్యాచారంపై సుప్రీంకోర్టు కీలక విచారణ.. తెగే పంచాయితీనేనా?
- Pakistan: అరేబియా సముద్రంలో భారత్-పాక్ నేవీ ఢీ.. చైనా వ్యూహాలపై అనుమానం.!
నామినేటెడ్ పోస్టులు దక్కించుకున్న నాయకులకు సీఎం చంద్రబాబు కీలక ఆదేశాలు జారీ చేశారు. పదవుల్లో ఉన్నవారు కేవలం తమకు కేటాయించిన సంబంధిత శాఖల బాధ్యతలను మాత్రమే చూసుకోవాలని, క్షేత్రస్థాయిలో పార్టీ లైన్కు లోబడి పనిచేయాలని స్పష్టం చేశారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో పార్టీ విజయం సాధించడమే లక్ష్యంగా నాయకులంతా సమన్వయంతో ముందుకు సాగాలని సూచించారు.
మరోవైపు.. తెలుగుదేశం పార్టీ తరఫున రాజ్యసభ అభ్యర్థుల నామినేషన్ల ప్రక్రియ రేపు ముగియనుంది. టీడీపీ ప్రకటించిన ముగ్గురు అభ్యర్థులు సానా సతీష్, భాష్యం రామకృష్ణ, చింతకాయల విజయ్.. రేపు ఉదయం 11 గంటలకు తమ నామినేషన్లను అధికారికంగా దాఖలు చేయనున్నారు. రేపు మధ్యాహ్నం 3 గంటలతో రాజ్యసభ అభ్యర్థుల నామినేషన్ల గడువు ముగియనుండటంతో, పార్టీ ముఖ్యనేతల సమక్షంలో ఈ ప్రక్రియ పూర్తి కానుంది. ఒకవైపు స్థానిక ఎన్నికల సమరశంఖం, మరోవైపు రాజ్యసభ స్థానాల భర్తీతో కూటమి ప్రభుత్వం రాష్ట్రంలో రాజకీయంగా మరింత దూకుడు పెంచింది.
తాజావార్తలు
-
OTR : అనకాపల్లి జిల్లాలో సీఎం రమేష్ వర్సెస్ గుడివాడ అమర్నాథ్
-
Story Board : డీలిమిటేషన్ పై కేంద్రం వ్యూహమేంటి..? తెలుగు రాష్ట్రాల్లో ఏం జరుగుతుంది..?
-
CM Revanth Reddy :హైదరాబాద్లో హార్వర్డ్ కోర్సులు.. డిసెంబర్ నుంచే క్లాసులు
-
Telangana SIR : ఓటర్లకు ఈసీ గుడ్న్యూస్.. నోటీసులకు ఇక ఇలా స్పందించొచ్చు
-
Supreme Court: మహిళకు ఉద్యోగం నిరాకరించినందుకు పనిష్మెంట్.. రూ.12 లక్షలు పరిహారం చెల్లించాలని తీర్పు
ట్రెండింగ్
-
Samsung Phones: పర్సుకి ఫోన్కు తేడా తెలియదు.. అతి చిన్న సైజ్లో శామ్సంగ్ ఫోల్డబుల్ ఫోన్స్..
-
Rishabh Pant-BCCI: విండీస్తో వన్డేలకు రిషభ్ పంత్ దూరం.. అసలు కారణం ఇదే!
-
AMOLED డిస్ప్లే, 50MP ట్రిపుల్ కెమెరా, ఆరేళ్ల సెక్యూరిటీ అప్డేట్స్ తో Samsung Galaxy A18 4G లాంచ్..!
-
200MP కెమెరా, 3D వేపర్ ఛాంబర్, 7100mAh బ్యాటరీతో Nubia NaviX Ultra లాంచ్.!
-
Meta One వచ్చేసింది.. ఇంస్టాగ్రామ్, వాట్సాప్, ఫేస్ బుక్ కు కొత్త సబ్స్క్రిప్షన్ ప్లాన్ ధరలు ఇదిగో.!