CM Chandrababu: స్థానిక ఎన్నికలపై సీఎం చంద్రబాబు నాయుడు కీలక వ్యాఖ్యలు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఆంధ్రప్రదేశ్లో మరో మూడు నెలల్లో జరగబోయే స్థానిక సంస్థల ఎన్నికలకు పార్టీ శ్రేణులన్నీ సర్వసన్నద్ధం కావాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పిలుపునిచ్చారు. రాష్ట్రంలో రాజకీయ సమీకరణాలు వేగంగా మారుతున్న వేళ, రాబోయే స్థానిక పోరును ప్రతిష్టాత్మకంగా తీసుకోవాలని ఆయన స్పష్టం చేశారు. అమరావతిలో జరిగిన తాజా సమీక్షా సమావేశంలో పార్టీ భవిష్యత్తు కార్యాచరణ, నియోజకవర్గాల వారీగా బాధ్యతలపై ఆయన కీలక వ్యాఖ్యలు చేశారు.
తన సొంత నియోజకవర్గమైన కుప్పంపై సీఎం చంద్రబాబు ప్రత్యేక దృష్టి సారించారు. ఇకపై కుప్పంలో జరిగే అన్ని కార్యక్రమాలను తానే స్వయంగా పర్యవేక్షిస్తానని ప్రకటించారు. ఇందుకోసం ప్రతి రెండు నెలలకు ఒకసారి కుప్పం నియోజకవర్గంలో పర్యటించనున్నట్లు వెల్లడించారు. అలాగే, కుప్పం నియోజకవర్గ కన్వీనర్ శ్రీకాంత్ సేవలను ఇకపై రాష్ట్ర స్థాయి అవసరాలకు, పార్టీ బలోపేతానికి వినియోగించుకోనున్నట్లు పేర్కొన్నారు.
Also Read
- Reservation row: కేంద్ర మంత్రుల మధ్య మాటల యుద్ధం.. మంట పెట్టిన ‘‘రిజర్వేషన్’’ అంశం..
- Haryana: ప్రముఖ రెజ్లర్ గ్రేట్ ఖలీ కారుకు ప్రమాదం.. దెబ్బతిన్న వాహనం
- TG SAFE: ఫుడ్ లవర్స్ అలర్ట్.. ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతున్న చట్నీస్, పిస్తా హౌస్ సహా ఈ 7 రెస్టారెంట్లు!
- Road Accident: రాజమండ్రిలో రోడ్డు ప్రమాదం.. స్కూల్ బస్సు-ఆటో ఢీ..
నామినేటెడ్ పోస్టులు దక్కించుకున్న నాయకులకు సీఎం చంద్రబాబు కీలక ఆదేశాలు జారీ చేశారు. పదవుల్లో ఉన్నవారు కేవలం తమకు కేటాయించిన సంబంధిత శాఖల బాధ్యతలను మాత్రమే చూసుకోవాలని, క్షేత్రస్థాయిలో పార్టీ లైన్కు లోబడి పనిచేయాలని స్పష్టం చేశారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో పార్టీ విజయం సాధించడమే లక్ష్యంగా నాయకులంతా సమన్వయంతో ముందుకు సాగాలని సూచించారు.
మరోవైపు.. తెలుగుదేశం పార్టీ తరఫున రాజ్యసభ అభ్యర్థుల నామినేషన్ల ప్రక్రియ రేపు ముగియనుంది. టీడీపీ ప్రకటించిన ముగ్గురు అభ్యర్థులు సానా సతీష్, భాష్యం రామకృష్ణ, చింతకాయల విజయ్.. రేపు ఉదయం 11 గంటలకు తమ నామినేషన్లను అధికారికంగా దాఖలు చేయనున్నారు. రేపు మధ్యాహ్నం 3 గంటలతో రాజ్యసభ అభ్యర్థుల నామినేషన్ల గడువు ముగియనుండటంతో, పార్టీ ముఖ్యనేతల సమక్షంలో ఈ ప్రక్రియ పూర్తి కానుంది. ఒకవైపు స్థానిక ఎన్నికల సమరశంఖం, మరోవైపు రాజ్యసభ స్థానాల భర్తీతో కూటమి ప్రభుత్వం రాష్ట్రంలో రాజకీయంగా మరింత దూకుడు పెంచింది.
తాజావార్తలు
-
Reservation row: కేంద్ర మంత్రుల మధ్య మాటల యుద్ధం.. మంట పెట్టిన ‘‘రిజర్వేషన్’’ అంశం..
-
Haryana: ప్రముఖ రెజ్లర్ గ్రేట్ ఖలీ కారుకు ప్రమాదం.. దెబ్బతిన్న వాహనం
-
TG SAFE: ఫుడ్ లవర్స్ అలర్ట్.. ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతున్న చట్నీస్, పిస్తా హౌస్ సహా ఈ 7 రెస్టారెంట్లు!
-
Aadarsha Kutumbam Postponed: వెంకీ మామా ‘ఆదర్శ కుటుంబం’ పోస్ట్పోన్.. కొత్త డేట్ ఇదేనా?
-
Road Accident: రాజమండ్రిలో రోడ్డు ప్రమాదం.. స్కూల్ బస్సు-ఆటో ఢీ..
ట్రెండింగ్
-
House Construction Cost: ఇల్లు కట్టే ఆలోచన ఉందా?.. కేవలం 5 నిమిషాల్లో బడ్జెట్ అంచనా వేసే సింపుల్ ట్రిక్ ఇదే!
-
ఇదేం ఫోన్ బాబోయ్.. బ్లాక్ అండ్ వైట్ నుంచి కలర్లోకి మారిపోతుంది..! Hisense A10 e-ink లాంచ్.!
-
రూ.15,999కే IP69 రేటింగ్, 120Hz డిస్ప్లే, 5,200mAh బ్యాటరీతో TECNO SPARK Go 3 Pro లాంచ్..!
-
50MP డ్యూయల్ కెమెరా, 7,900mAh బ్యాటరీతో సెప్టెంబర్ 3న భారత్లో లాంచ్ కానున్న Redmi 17 5G..!
-
10,000mAh బ్యాటరీ, డ్యూయల్ టోన్ డిజైన్, AMOLED డిస్ప్లేతో సెప్టెంబర్ 4న రానున్న POCO X8 Power 5G..!