Monsoon Prediction 2026: నైరుతి రుతుపవనాల గమనంలో విరామాలు.. రైతులకు వాతావరణ శాఖ అధికారుల కీలక సూచనలు!
- నైరుతి రుతుపవనాల గమనంలో విరామాలు
- ఈసారి తక్కువ వర్షపాతం నమోదయ్యే అవకాశం
- రైతులకు వాతావరణ శాఖ అధికారుల కీలక సూచనలు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Monsoon Breaks Expected in AP: ఆంధ్రప్రదేశ్లో నైరుతి రుతుపవనాలు క్రమంగా విస్తరిస్తుండగా.. ఈ ఏడాది వర్షపాతం పరిస్థితులపై విపత్తుల నిర్వహణ సంస్థ కీలక అంచనాలు వెల్లడించింది. సాధారణంగా నమోదయ్యే వర్షపాతంతో పోలిస్తే.. ఈసారి కొంత తక్కువ వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉందని విపత్తుల నిర్వహణ సంస్థ ఎండీ ప్రకర్ జైన్ తెలిపారు. అయితే స్థానిక వాతావరణ మార్పుల ప్రభావంతో కురిసే వర్షాలు ఈ లోటును కొంత మేర భర్తీ చేసే అవకాశం ఉందని పేర్కొన్నారు.
ఈ ఏడాది నైరుతి రుతుపవనాల ప్రయాణంలో తరచూ విరామాలు ఏర్పడే అవకాశముందని వాతావరణ శాఖ అధికారులు హెచ్చరిస్తున్నారు. అంటే కొన్ని రోజుల పాటు విస్తారంగా వర్షాలు కురవనుండగా.. మరికొన్ని రోజులు పూర్తిగా పొడి వాతావరణం నెలకొనే పరిస్థితులు కనిపించవచ్చు. మారుతున్న వాతావరణ పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని రైతులు తమ పంటల ప్రణాళికలను ముందుగానే సిద్ధం చేసుకోవాలని అధికారులు సూచించారు.
Also Read
- Telangana Student: మరో 4 నెలల్లో హైదరాబాద్కు.. ఇంతలోనే అమెరికాలో తెలంగాణ యువకుడు దారుణ హత్య!
- Tilak Varma: టీజీ20 లీగ్ వేలం.. తిలక్ వర్మకు ఊహించని ధర.. ఏ జట్టు సొంతం చేసుకుందో తెలుసా?
- Polavaram Tiger: పోలవరం ఊపిరి పీల్చుకో.. డ్రోన్ కెమెరాలకు చిక్కిన పెద్దపులి!
- Rajya Sabha Candidates: టీడీపీ రాజ్యసభ అభ్యర్థులు ఖరారు.. చివరి నిమిషంలో చింతకాయల విజయ్ పేరు ఖరారు!
విపత్తుల నిర్వహణ సంస్థ అంచనాల ప్రకారం.. పోలవరం, తూర్పుగోదావరి, పశ్చిమగోదావరి, అంబేద్కర్ కోనసీమ జిల్లాల్లో సాధారణం కంటే తక్కువ వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉంది. అలాగే కర్నూలు, నంద్యాల, మార్కాపురం, అనంతపురం, వైఎస్సార్ కడప, నెల్లూరు జిల్లాల్లో కూడా వర్షాలు సాధారణ స్థాయి కంటే తగ్గే సూచనలు కనిపిస్తున్నాయి. ఇక శ్రీసత్యసాయి, అన్నమయ్య, చిత్తూరు, తిరుపతి జిల్లాల్లో కూడా వర్షపాతం లోటు ఉండే అవకాశముందని అధికారులు పేర్కొన్నారు. ఈ జిల్లాల రైతులు సాగు ప్రణాళికల్లో జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు.
మరోవైపు ఏలూరు, ఎన్టీఆర్, గుంటూరు, బాపట్ల, పల్నాడు, ప్రకాశం జిల్లాల్లో సాధారణం కంటే అధిక వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉందని అధికారులు అంచనా వేస్తున్నారు. ఈ జిల్లాల్లో వ్యవసాయానికి అనుకూల పరిస్థితులు ఉండే అవకాశాలు కనిపిస్తున్నాయి. శ్రీకాకుళం, పార్వతీపురం మన్యం, విజయనగరం, విశాఖపట్నం, అనకాపల్లి జిల్లాల్లో సాధారణ స్థాయి వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉందని అధికారులు తెలిపారు. అలాగే అల్లూరి సీతారామరాజు, కాకినాడ, కృష్ణా జిల్లాల్లో కూడా సాధారణ వర్షపాతం కురిసే అవకాశాలు ఉన్నాయని వెల్లడించారు.
రుతుపవనాల గమనంలో మార్పులు, తక్కువ వర్షాల నేపథ్యంలో రైతులు వాతావరణ అంచనాలను ఎప్పటికప్పుడు పరిశీలిస్తూ.. పంటల ఎంపిక, విత్తనాల విత్తకం, నీటి వినియోగం వంటి అంశాల్లో ముందస్తు ప్రణాళికతో వ్యవహరించాలని విపత్తుల నిర్వహణ సంస్థ సూచించింది. ఈ ఏడాది వర్షాల తీరు వ్యవసాయ రంగంపై కీలక ప్రభావం చూపే అవకాశం ఉండటంతో అధికారులు అప్రమత్తంగా ఉండాలని సూచిస్తున్నారు.
తాజావార్తలు
-
Monsoon Prediction 2026: నైరుతి రుతుపవనాల గమనంలో విరామాలు.. రైతులకు వాతావరణ శాఖ అధికారుల కీలక సూచనలు!
-
UPI Safety: ఈ చిన్న పొరపాట్లు చేస్తే మీ బ్యాంక్ ఖాతా ఖాళీ కావొచ్చు.. యూపీఐ వాడేవారు తప్పక తెలుసుకోవాలి.!
-
Kings and Queens Pub: కూకట్పల్లిలోని కింగ్స్ అండ్ క్వీన్స్ పబ్పై పోలీసుల ఆకస్మిక దాడులు.. 9 మంది అదుపులోకి
-
Raviteja : ‘ఇరుముడి’ రిలీజ్ డేట్ వచ్చేసింది.. సరైన డేట్ లాక్ చేసిన మేకర్స్
-
Telangana Student: మరో 4 నెలల్లో హైదరాబాద్కు.. ఇంతలోనే అమెరికాలో తెలంగాణ యువకుడు దారుణ హత్య!
ట్రెండింగ్
-
Kitchen Tips : వండిన తర్వాత వచ్చే వెల్లుల్లి, చేపల వాసనను తొలగించడానికి ఇవి ఉంటే సరిపోతుంది.
-
Ants Control Tips : ఇంట్లో చీమల దండయాత్రా..? మీకు తెలియకుండానే చేస్తున్న ఈ తప్పులే కారణం.!
-
Career Growth : AI ప్రపంచంలో రాణించాలంటే.. ఈ 4 నైపుణ్యాలు నేర్చుకోండి
-
WhatsApp: మీ వాట్సాప్ చాట్స్ సురక్షితమేనా.? ఈ ఒక్క సెట్టింగ్ ఆన్ చేస్తే సేఫ్.!
-
Rajma Chawal: క్విక్ అండ్ హెల్దీ మీల్.. “రాజ్మా రైస్”తో హై ప్రోటీన్ లంచ్.!