T20I Matches: క్రికెట్ అభిమానులకు అలర్ట్.. టీ20 మ్యాచ్ల వేళల్లో మార్పులు.. ఒక గంట ముందుగానే..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
భారత క్రికెట్ అభిమానులకు ఇంగ్లాండ్ అండ్ వేల్స్ క్రికెట్ బోర్డు (ECB) ఒక తీపి కబురు అందించింది. భారత్, ఇంగ్లాండ్ జట్ల మధ్య జరగబోయే ఐదు మ్యాచ్ల టీ20 ఇంటర్నేషనల్ (T20I) సిరీస్ ప్రారంభ సమయాలను ఒక గంట ముందుకు జరుపుతూ బోర్డు నిర్ణయం తీసుకుంది. మీడియా నివేదికల ప్రకారం.. భారత ఉపఖండంలో టెలివిజన్ వీక్షకుల సంఖ్యను (TRP) గరిష్టంగా పెంచేందుకు ఈ మార్పులు చేసినట్లు తెలుస్తోంది.
పూర్వపు షెడ్యూల్ ప్రకారం ఈ మ్యాచ్లు భారత కాలమానం ప్రకారం రాత్రి 11:00 గంటలకు (ఇంగ్లాండ్ స్థానిక సమయం సాయంత్రం 6:30 గంటలకు) ప్రారంభం కావాల్సి ఉంది. అయితే.. అర్ధరాత్రి దాటిన తర్వాత మ్యాచ్లు చూడటం భారతీయ అభిమానులకు ఇబ్బందికరంగా మారుతుందనే ఉద్దేశంతో, ఇప్పుడు ఈ మ్యాచ్లను రాత్రి 10:00 గంటలకే (IST) ప్రారంభించనున్నారు.
Also Read
- India Squads: పంత్కు షాక్.. నితీశ్కు బంపర్ ఆఫర్.. వెస్టిండీస్ సిరీస్కు జట్లు ప్రకటించిన బీసీసీఐ
- WPL 2027 Dates Announced: WPL 2027 షెడ్యూల్ వచ్చేసింది.. జనవరి 14 నుంచి మహిళా క్రికెట్ సమరం!
- Jos Buttler: బట్లర్ విధ్వంసం.. రోహిత్ శర్మ రికార్డు బ్రేక్
- Ajit Agarkar: భారత క్రికెట్లో కీలక పరిణామం.. థ్యాంక్యూ నోట్.. చీఫ్ సెలెక్టర్ పదవికి అగార్కర్ గుడ్బై!
బ్రాడ్కాస్టర్ల విజ్ఞప్తి మేరకు.. మ్యాచ్ల ప్రత్యక్ష ప్రసార హక్కులను కలిగిన బ్రాడ్కాస్టర్లతో జరిపిన చర్చల తర్వాతే ఈ నిర్ణయం తీసుకున్నారు. “ఇంగ్లాండ్ వేదికగా జరిగే అంతర్జాతీయ మ్యాచ్ల సమయాలను ఈసీబీ (ECB), మ్యాచ్ జరిగే వేదికలు, ప్రత్యర్థి దేశాల క్రికెట్ బోర్డులు, అలాగే స్వదేశీ, విదేశీ బ్రాడ్కాస్టర్ల పరస్పర సంప్రదింపుల తర్వాతే ఖరారు చేస్తారు. ఈ సిరీస్ విషయానికి వస్తే స్కై స్పోర్ట్స్ (యూకే), సోనీ స్పోర్ట్స్ నెట్వర్క్ (భారత్) లతో చర్చించి సమయాన్ని మార్చడం జరిగింది” అని నివేదిక పేర్కొంది.
ప్రపంచకప్ విజేతలైన భారత్, ఇంగ్లాండ్ జట్ల మధ్య పోరు అంటే ప్రపంచవ్యాప్తంగా, ముఖ్యంగా భారతదేశంలో విపరీతమైన క్రేజ్ ఉంటుంది. రాత్రి 10 గంటలకే మ్యాచ్ ప్రారంభం కావడం వల్ల ప్రైమ్ టైమ్లో ఎక్కువ మంది వీక్షకులు టీవీలకు, డిజిటల్ స్క్రీన్లకు అతుక్కుపోయే అవకాశం ఉంది. ఇది అటు అభిమానులకు, ఇటు ప్రకటనల ద్వారా ఆదాయం పొందే బ్రాడ్కాస్టర్లకు ఇద్దరికీ లాభదాయకమైన నిర్ణయమని విశ్లేషకులు భావిస్తున్నారు.
తాజావార్తలు
-
NTV Comment : కంటెంట్ బాగుంటే ఏ సినిమాని ఎవ్వరూ ఆపలేరు బాస్!
-
OTR : చంద్రగిరి కూటమి పార్టీల ముఖ్యుల మధ్య విభేదాలు
-
Story Board: ఆర్థిక ఊబిలో తెలుగు రాష్ట్రాలు
-
Central Govt: అడ్వాన్స్ టిప్ విధానాన్ని ఆపేయండి.. క్యాబ్ కంపెనీలకు కేంద్రం ఆదేశాలు
-
UPI Charges: ‘‘యూపీఐ ఛార్జీలు రద్దు చేయాలి’’.. సుప్రీంకోర్టులో పిటిషన్..
ట్రెండింగ్
-
Meta One వచ్చేసింది.. ఇంస్టాగ్రామ్, వాట్సాప్, ఫేస్ బుక్ కు కొత్త సబ్స్క్రిప్షన్ ప్లాన్ ధరలు ఇదిగో.!
-
రూ.15,999కే 7,000mAh బ్యాటరీ, 2TB వరకు స్టోరేజ్ సపోర్ట్, 120Hz డిస్ప్లేతో OPPO K14 Lite లాంచ్.!
-
IPL 2027 Auction: బీసీసీఐ కీలక నిర్ణయం.. భారత్లోనే ఐపీఎల్ 2027 వేలం!
-
Sanju Samson vs Vaibhav: వైభవ్ సూర్యవంశీతో పోటీ.. సంజు శాంసన్ సంచలన వ్యాఖ్యలు!
-
Nitish Kumar Reddy: నా టార్గెట్ అదే.. అందుకోసమే కష్టపడుతున్నా!