Mohammed Siraj: ముల్లన్పూర్ టెస్టులో ఘర్షణ.. అఫ్గానిస్థాన్ బ్యాటర్పై ఆగ్రహంతో ఊగిపోయిన సిరాజ్..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
న్యూ చండీగఢ్ లోని ముల్లన్పూర్ వేదికగా ఆఫ్ఘనిస్తాన్తో జరిగిన ఏకైక టెస్ట్ మ్యాచ్లో టీమిండియా పేసర్ మహమ్మద్ సిరాజ్, ఆఫ్ఘన్ బ్యాటర్ రహ్మత్ షా మధ్య మైదానంలో తీవ్ర వాగ్వాదం చోటుచేసుకుంది. ఆఫ్ఘనిస్తాన్ తొలి ఇన్నింగ్స్ ఆడుతున్న సమయంలో ఈ ఘటన జరిగింది.
అసలేం జరిగిందంటే..?
ఆఫ్ఘన్ బ్యాటర్ షరాఫుద్దీన్ అష్రఫ్ కాలి గాయంతో తీవ్రంగా ఇబ్బంది పడుతూ బ్యాటింగ్ చేస్తున్నాడు. తన భాగస్వామి ఇబ్బంది పడుతుండటంతో రహ్మత్ షా పూర్తిగా డిఫెన్సివ్ మోడ్లోకి వెళ్లిపోయాడు. సిరాజ్ వేసిన ఓవర్ మూడో బంతిని రహ్మత్ బ్లాక్ చేయగా.. క్రీజులోనే ఉన్నప్పటికీ సిరాజ్ ఆగ్రహంతో బంతిని నేరుగా వికెట్ల వైపు బలంగా విసిరాడు.
Also Read
- Travis Head: విరాట్తో గొడవపై తొలిసారి స్పందించిన ట్రావిస్ హెడ్.. అసలు నిజం ఇదే!
- Jhandu Kumar: పోలియోను జయించి, పేదరికాన్ని తొక్కేసి.. భారత్కు తొలి పతకం అందించిన బీహార్ కుర్రాడి కన్నీటి గథ!
- IND vs ZIM 2nd T20: సిరీస్పై కన్నేసిన టీమిండియా.. టీమిండియా ప్లేయింగ్ XI ఇదే.!
- Commonwealth Games 2026: కామన్వెల్త్ గేమ్స్లో భారత్కు తొలి మెడల్.. పేదరికాన్ని జయించి కాంస్య పతకం సాధించిన ఝండు కుమార్
సిరాజ్ అంతటితో ఆగలేదు. తర్వాతి బంతిని కూడా రహ్మత్ డిఫెండ్ చేయడంతో తీవ్ర అసహనానికి గురయ్యాడు. రహ్మత్ దగ్గరకు వెళ్లి, డిఫెన్స్ ఆడటం ఆపి, సరైన షాట్లు ఆడాలంటూ సవాల్ విసిరాడు. దీంతో ఇద్దరి మధ్య కాసేపు వాడీవేడీ చర్చ నడిచింది.
Siraj aur Rahmat ke darmiyan field par garma-garmi 🫢 pic.twitter.com/3MtEjwIRHc
— Rehan 56 (@imrehan456) June 8, 2026
భారత్ చారిత్రాత్మక విజయం..
సిరాజ్ స్లెడ్జింగ్ మైండ్ గేమ్లా పనిచేసింది. ఆ తర్వాత కొద్ది ఓవర్లలోనే అరంగేట్రం స్పిన్నర్ మానవ్ సుతార్ బౌలింగ్లో షరాఫుద్దీన్, రహ్మత్ షా ఇద్దరూ వెనుదిరిగారు. ఈ మ్యాచ్లో భారత్ ఇన్నింగ్స్ మరియు 300 పరుగుల భారీ తేడాతో ఆఫ్ఘనిస్తాన్పై చారిత్రాత్మక విజయం సాధించింది. టెస్ట్ క్రికెట్ చరిత్రలో భారత్కు ఇదే అతిపెద్ద విజయం.
తొలి ఇన్నింగ్స్లో భారత్ 564/8 పరుగుల వద్ద డిక్లేర్ చేయగా, ఆఫ్ఘనిస్తాన్ మొదటి ఇన్నింగ్స్లో 152 పరుగులకే ఆలౌట్ అయింది. సుతార్ 6 వికెట్లతో చెలరేగాడు. ఫాలోఆన్ ఆడిన ఆఫ్ఘన్ రెండో ఇన్నింగ్స్లోనూ కేవలం 112 పరుగులకే కుప్పకూలింది. వాషింగ్టన్ సుందర్, కుల్దీప్ యాదవ్ తలో మూడు వికెట్లు పడగొట్టారు. 2018లో రాజ్కోట్లో వెస్టిండీస్పై ఇన్నింగ్స్ మరియు 272 పరుగుల తేడాతో సాధించిన విజయాన్ని అధిగమించి భారత్ సరికొత్త రికార్డు సృష్టించింది.
తాజావార్తలు
-
ఏపీలో SIR పూర్తి.. 44.71 లక్షల ఓటర్లు ‘అన్ కలెక్టబుల్’గా గుర్తింపు.. తుది ఓటరు జాబితా విడుదల అప్పుడే.!
-
Blackmail Case:100 మంది మహిళలపై అత్యాచారం? కంప్లైంట్ ఇచ్చిన డాక్టర్పై నర్సు సంచలన ఆరోపణ
-
Travis Head: విరాట్తో గొడవపై తొలిసారి స్పందించిన ట్రావిస్ హెడ్.. అసలు నిజం ఇదే!
-
12.1 అంగుళాల 2.5K డిస్ప్లే, 10,200mAh బ్యాటరీతో రానున్న Moto Pad 70.!
-
Maharashtra TET Paper Leak Case: టెట్ పేపర్ లీక్ కేసులో కీలక పరిణామం.. ప్రధాన నిందితుడు అరెస్టు
ట్రెండింగ్
-
3.2 అంగుళాల టచ్స్క్రీన్, Doubao AIతో HMD Touch AI ఫీచర్ ఫోన్ లాంచ్.!
-
డ్యూయల్ 200MP కెమెరాలు, ఐఫోన్-స్టైల్ బార్ తో రాబోతున్న OPPO Find X10..!
-
Rainy Season Kitchen Tips : వర్షాల్లో బియ్యానికి పురుగులా? ఇలా చేస్తే సమస్యే లేదు.!
-
కేవలం రూ. 8,999 లకే120Hz డిస్ప్లే, 6000mAh బ్యాటరీతో Lava Virat V1 5G, Virat V1 స్మార్ట్ఫోన్లు లాంచ్..!
-
రూ. 19,499లకే 50MP సోనీ కెమెరా, 6500mAh బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో iQOO Z11 Lite 5G లాంచ్..!