Mohammed Siraj: ముల్లన్పూర్ టెస్టులో ఘర్షణ.. అఫ్గానిస్థాన్ బ్యాటర్పై ఆగ్రహంతో ఊగిపోయిన సిరాజ్..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
న్యూ చండీగఢ్ లోని ముల్లన్పూర్ వేదికగా ఆఫ్ఘనిస్తాన్తో జరిగిన ఏకైక టెస్ట్ మ్యాచ్లో టీమిండియా పేసర్ మహమ్మద్ సిరాజ్, ఆఫ్ఘన్ బ్యాటర్ రహ్మత్ షా మధ్య మైదానంలో తీవ్ర వాగ్వాదం చోటుచేసుకుంది. ఆఫ్ఘనిస్తాన్ తొలి ఇన్నింగ్స్ ఆడుతున్న సమయంలో ఈ ఘటన జరిగింది.
అసలేం జరిగిందంటే..?
ఆఫ్ఘన్ బ్యాటర్ షరాఫుద్దీన్ అష్రఫ్ కాలి గాయంతో తీవ్రంగా ఇబ్బంది పడుతూ బ్యాటింగ్ చేస్తున్నాడు. తన భాగస్వామి ఇబ్బంది పడుతుండటంతో రహ్మత్ షా పూర్తిగా డిఫెన్సివ్ మోడ్లోకి వెళ్లిపోయాడు. సిరాజ్ వేసిన ఓవర్ మూడో బంతిని రహ్మత్ బ్లాక్ చేయగా.. క్రీజులోనే ఉన్నప్పటికీ సిరాజ్ ఆగ్రహంతో బంతిని నేరుగా వికెట్ల వైపు బలంగా విసిరాడు.
Also Read
- Ravindra Jadeja: భారత జట్టులో కొత్త చర్చ..! జడేజా స్థానానికి ముప్పు తప్పదా..?
- Manav Suthar Creates History: అరుదైన ప్రపంచ రికార్డుతో మనవ్ సుతార్ సంచలనం.. 1824 టెస్టుల చరిత్రలో తొలి భారత ఆటగాడు
- T20I Matches: క్రికెట్ అభిమానులకు అలర్ట్.. టీ20 మ్యాచ్ల వేళల్లో మార్పులు.. ఒక గంట ముందుగానే..
- Vaibhav Sooryavanshi: ‘వైభవ్ సూర్యవంశీ డకౌట్ అవుతాడు’.. కపిల్ దేవ్ సంచలన వ్యాఖ్యలు..
సిరాజ్ అంతటితో ఆగలేదు. తర్వాతి బంతిని కూడా రహ్మత్ డిఫెండ్ చేయడంతో తీవ్ర అసహనానికి గురయ్యాడు. రహ్మత్ దగ్గరకు వెళ్లి, డిఫెన్స్ ఆడటం ఆపి, సరైన షాట్లు ఆడాలంటూ సవాల్ విసిరాడు. దీంతో ఇద్దరి మధ్య కాసేపు వాడీవేడీ చర్చ నడిచింది.
Siraj aur Rahmat ke darmiyan field par garma-garmi 🫢 pic.twitter.com/3MtEjwIRHc
— Rehan 56 (@imrehan456) June 8, 2026
భారత్ చారిత్రాత్మక విజయం..
సిరాజ్ స్లెడ్జింగ్ మైండ్ గేమ్లా పనిచేసింది. ఆ తర్వాత కొద్ది ఓవర్లలోనే అరంగేట్రం స్పిన్నర్ మానవ్ సుతార్ బౌలింగ్లో షరాఫుద్దీన్, రహ్మత్ షా ఇద్దరూ వెనుదిరిగారు. ఈ మ్యాచ్లో భారత్ ఇన్నింగ్స్ మరియు 300 పరుగుల భారీ తేడాతో ఆఫ్ఘనిస్తాన్పై చారిత్రాత్మక విజయం సాధించింది. టెస్ట్ క్రికెట్ చరిత్రలో భారత్కు ఇదే అతిపెద్ద విజయం.
తొలి ఇన్నింగ్స్లో భారత్ 564/8 పరుగుల వద్ద డిక్లేర్ చేయగా, ఆఫ్ఘనిస్తాన్ మొదటి ఇన్నింగ్స్లో 152 పరుగులకే ఆలౌట్ అయింది. సుతార్ 6 వికెట్లతో చెలరేగాడు. ఫాలోఆన్ ఆడిన ఆఫ్ఘన్ రెండో ఇన్నింగ్స్లోనూ కేవలం 112 పరుగులకే కుప్పకూలింది. వాషింగ్టన్ సుందర్, కుల్దీప్ యాదవ్ తలో మూడు వికెట్లు పడగొట్టారు. 2018లో రాజ్కోట్లో వెస్టిండీస్పై ఇన్నింగ్స్ మరియు 272 పరుగుల తేడాతో సాధించిన విజయాన్ని అధిగమించి భారత్ సరికొత్త రికార్డు సృష్టించింది.
తాజావార్తలు
-
Mohammed Siraj: ముల్లన్పూర్ టెస్టులో ఘర్షణ.. అఫ్గానిస్థాన్ బ్యాటర్పై ఆగ్రహంతో ఊగిపోయిన సిరాజ్..
-
మనం రోడ్డుపై చూసి వదిలేసే ‘బిచ్చగాళ్ల’ వెనుక ఇంత పెద్ద కథ ఉందా..?
-
Ravindra Jadeja: భారత జట్టులో కొత్త చర్చ..! జడేజా స్థానానికి ముప్పు తప్పదా..?
-
INIDIA alliance: ఇండియా కూటమి సమావేశానికి విజయ్ పార్టీకి నో ఎంట్రీ.. కాంగ్రెస్ చెప్పిన కారణం ఇదే!
-
Manav Suthar Creates History: అరుదైన ప్రపంచ రికార్డుతో మనవ్ సుతార్ సంచలనం.. 1824 టెస్టుల చరిత్రలో తొలి భారత ఆటగాడు
ట్రెండింగ్
-
Protein Powder : ప్రోటీన్ పౌడర్ తీసుకోవడం సురక్షితమేనా? ఈ విషయం తెలుసుకోకుండా వాడకండి..!
-
Manav Suthar Record: అరంగేట్ర స్పిన్నర్ మానవ్ సుతార్ అరుదైన రికార్డు.. ఈ శతాబ్దంలోనే ‘ఒకే ఒక్కడు’!
-
Harmanpreet Kaur: ‘నేను రిటైర్ అవ్వాలనుకుంటున్నారా?’.. రిపోర్టర్ కు ధోనీ స్టైల్లో మహిళా కెప్టెన్ కౌంటర్.!
-
Birth Rate: భారత్లో పడిపోతున్న జననాల రేటు.. విద్యావంతులు తక్కువ మంది పిల్లలను కనడమే కారణమా.?
-
Sugar Cravings Control : తీపి తినాలనే కోరికా..? ఈ చిట్కాలతో మీ స్వీట్ క్రేవింగ్స్కు చెక్ పెట్టండి.!