Viral Video : మృత్యువు ఒడిలో మాతృత్వం.. పిల్లల కోసం రైలు కింద దూరిన తల్లి.! కళ్లు చెదిరే సాహసం.!
- రైలు కింద పిల్లలను కాపాడిన తల్లి
- సమష్టిపూర్ స్టేషన్లో ఉత్కంఠ ఘటన
- వైరల్ వీడియోపై నెటిజన్ల ప్రశంసలు
- ఫుట్ ఓవర్ బ్రిడ్జ్ లేకపోవడంపై విమర్శలు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Mother Saves Children Under Moving Train in Bihar Viral Video : అమ్మ అంటే ప్రేమ మాత్రమే కాదు.. అవసరమైతే మృత్యువుతో పోరాడే ధైర్యం కూడా అని ఒక ఘటన నిరూపించింది. తన కళ్లెదుటే మృత్యువు రైలు రూపంలో దూసుకొస్తున్నా, ఏమాత్రం భయపడకుండా తన బిడ్డలను గుండెలకు హత్తుకుని ప్రాణాలతో బయటపడింది ఒక వీరమాత. ఒళ్లు గగుర్పొడిచే ఈ హృదయ విదారక ఘటన బిహార్లోని సమష్టిపూర్ జిల్లాలో చోటుచేసుకుంది.
సమష్టిపూర్ జిల్లా షాపూర్ పటోరి రైల్వే స్టేషన్లో ముగ్గురు మహిళలు తమ ఇద్దరు పిల్లలతో కలిసి రైల్వే ట్రాక్ దాటుతున్నారు. సరిగ్గా అదే సమయంలో అత్యంత వేగంతో ఒక రైలు ఆ ట్రాక్ మీదికి దూసుకొచ్చింది. ప్లాట్ఫారమ్ ఎక్కేలోపే రైలు దగ్గరకు వచ్చేయడంతో ఏం చేయాలో పాలుపోని ఆ మహిళలు, ప్లాట్ఫారమ్కు , ట్రాక్ పక్కన ఉన్న ఇరుకైన గ్యాప్లో దూరిపోయారు.
Also Read
- Conch Shell Facts: శంఖం రహస్యం తెలుసా? పూజలో ఉపయోగించే ఈ వస్తువు వెనుక ఆశ్చర్యకరమైన నిజాలు
- 540 డిగ్రీ కెమెరా, పనోరమిక్ సన్రూఫ్, రూ.13.69 లక్షలతో 2026 Mahindra Scorpio-N లాంచ్..!
- Bear Kills Siblings: ఎలుగుబంటి బీభత్సం.. అన్నాచెల్లెళ్లపై దాడి, ఇద్దరి మృతి..!
- IndiGo Offer : ఇండిగో బంపర్ ఆఫర్.. 20 వేల ఉచిత టికెట్లు.!
రైలు వేగంగా వెళ్తున్నా, ఆ కంపనలకు బిడ్డలు భయపడి బయటకు రాకుండా ఒక తల్లి వారిద్దరినీ తన గుండెలకు హత్తుకుని పడుకుంది. రైలు పెట్టెలన్నీ వెళ్లే వరకు ఆమె తన ప్రాణాలను పణంగా పెట్టి పిల్లలను కాపాడుకుంది. చూస్తున్న వారంతా ఒక్కసారిగా నిశ్చేష్టులయ్యారు. రైలు వెళ్ళిపోయిన తర్వాత పిల్లలతో సహా అందరూ సురక్షితంగా బయటపడటంతో అక్కడున్న వారంతా ఊపిరి పీల్చుకున్నారు. ఈ ప్రమాదంలో ఒక మహిళకు స్వల్ప గాయాలయ్యాయి.
ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో ఆ తల్లి ధైర్యసాహసాలపై నెటిజన్లు ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. అయితే అదే సమయంలో రైల్వే అధికారుల తీరుపై ప్రయాణికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ట్రాక్ దాటేందుకు వంతెన (Foot Over Bridge) సదుపాయం లేకపోవడంతోనే ప్రయాణికులు ఇలా ప్రాణాలను హస్తగతం చేసుకుని ట్రాక్లు దాటాల్సి వస్తుందని వారు మండిపడుతున్నారు.
మృత్యువు ముంగిట నిలబడి కూడా తన బిడ్డలను కాపాడుకున్న ఆ తల్లి సాహసం చూసి “అమ్మ కంటే గొప్ప యోధులు ఎవరూ ఉండరు” అని నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు. ఏది ఏమైనప్పటికీ, రైల్వే ట్రాక్లు దాటేటప్పుడు ప్రయాణికులు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచిస్తున్నారు.
SHOCKING VISUALS 🚨
A mother in Bihar risked her own life to save her two children after a train suddenly arrived while they were crossing the tracks near Shahpur Patori railway station.
According to reports, the three women quickly sat down with the children pressed beneath… pic.twitter.com/JCEdu5R9Y3
— Megh Updates 🚨™ (@MeghUpdates) May 15, 2026
తాజావార్తలు
-
Hash Oil : స్నాప్చాట్లో డ్రగ్స్ దందా.. ORR వద్ద పెడ్లర్ అరెస్ట్.!
-
VVS Laxman: వీవీఎస్ లక్ష్మణ్ ‘నో’ చెప్పడం వల్లే గంభీర్కు ఊహించని అవకాశం.. ఎవరికీ తెలియని సీక్రెట్ రివీల్..
-
CM Chandrababu: ‘ప్రియాంక మృతికి కారణమైన వారిపై కఠిన చర్యలు’.. బాధిత కుటుంబానికి రూ. 20 లక్షల ఆర్థిక సాయం..
-
New Phones: గూగుల్ నుంచి కొత్త ఫోన్స్.. పిక్సెల్ 11, 11 ప్రో, 11 ప్రో XL , 11 ప్రో ఫోల్డ్.. ఫీచర్స్ అదరహో..
-
Bhatti Vikramarka : యూసీ బర్క్లీలో భట్టి విక్రమార్క.. తెలంగాణ క్లీన్ ఎనర్జీపై బిగ్ ప్లాన్.!
ట్రెండింగ్
-
Bathroom Drain Cleaning Tips : బాత్రూమ్ డ్రెయిన్ జామ్ అవుతోందా? ఈ 2 పదార్థాలతో చిటికెలో క్లీన్.!
-
Home Hacks : కడాయి హ్యాండిల్పై గట్టి జిడ్డా? ఈ చిట్కాలతో కొత్తదానిలా మెరిపించండి.!
-
Cleaning Hacks : కిచెన్ డస్ట్బిన్ స్మెల్ కొడుతోందా.? ఇలా చేస్తే క్షణాల్లో క్లీన్.!
-
Pressure Cooker Rice Tips: కుక్కర్లో అన్నం పర్ఫెక్ట్గా రావాలంటే ఇదే సీక్రెట్.!
-
19.62kmpl మైలేజ్, 150hp టర్బో ఇంజిన్తో Volkswagen Virtus Anniversary ఎడిషన్ లాంచ్.. ధర, ఫీచర్లు ఇవే.!