Viral Video : మృత్యువు ఒడిలో మాతృత్వం.. పిల్లల కోసం రైలు కింద దూరిన తల్లి.! కళ్లు చెదిరే సాహసం.!
- రైలు కింద పిల్లలను కాపాడిన తల్లి
- సమష్టిపూర్ స్టేషన్లో ఉత్కంఠ ఘటన
- వైరల్ వీడియోపై నెటిజన్ల ప్రశంసలు
- ఫుట్ ఓవర్ బ్రిడ్జ్ లేకపోవడంపై విమర్శలు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Mother Saves Children Under Moving Train in Bihar Viral Video : అమ్మ అంటే ప్రేమ మాత్రమే కాదు.. అవసరమైతే మృత్యువుతో పోరాడే ధైర్యం కూడా అని ఒక ఘటన నిరూపించింది. తన కళ్లెదుటే మృత్యువు రైలు రూపంలో దూసుకొస్తున్నా, ఏమాత్రం భయపడకుండా తన బిడ్డలను గుండెలకు హత్తుకుని ప్రాణాలతో బయటపడింది ఒక వీరమాత. ఒళ్లు గగుర్పొడిచే ఈ హృదయ విదారక ఘటన బిహార్లోని సమష్టిపూర్ జిల్లాలో చోటుచేసుకుంది.
సమష్టిపూర్ జిల్లా షాపూర్ పటోరి రైల్వే స్టేషన్లో ముగ్గురు మహిళలు తమ ఇద్దరు పిల్లలతో కలిసి రైల్వే ట్రాక్ దాటుతున్నారు. సరిగ్గా అదే సమయంలో అత్యంత వేగంతో ఒక రైలు ఆ ట్రాక్ మీదికి దూసుకొచ్చింది. ప్లాట్ఫారమ్ ఎక్కేలోపే రైలు దగ్గరకు వచ్చేయడంతో ఏం చేయాలో పాలుపోని ఆ మహిళలు, ప్లాట్ఫారమ్కు , ట్రాక్ పక్కన ఉన్న ఇరుకైన గ్యాప్లో దూరిపోయారు.
Also Read
- Viral News: చెప్పులు చేతిలో పట్టుకుని పరుగెత్తింది.. కూతుళ్ల చదువు కోసం మారథాన్ గెలిచిన తల్లి కథ!
- Viral Video : గుండెలను పిండేస్తున్న దృశ్యం.. చెల్లెలితో చిన్నారి.. తల్లిదండ్రుల కోసం వెతుకులాట.!
- Mouth Ulcer: చిన్న నోటిపుండే కదా అని లైట్ తీసుకుంటున్నారా? ఈ మార్పులు కనిపిస్తే తప్పక డాక్టర్ను సంప్రదించాల్సిందే.!
- Guinness World Record: లక్ష అడుగుల ఎత్తు నుంచి ఫోన్ను పడేసినా.. ఒక్క గీత కూడా పడలేదు.! అసలు మ్యాజిక్ ఏంటంటే?
రైలు వేగంగా వెళ్తున్నా, ఆ కంపనలకు బిడ్డలు భయపడి బయటకు రాకుండా ఒక తల్లి వారిద్దరినీ తన గుండెలకు హత్తుకుని పడుకుంది. రైలు పెట్టెలన్నీ వెళ్లే వరకు ఆమె తన ప్రాణాలను పణంగా పెట్టి పిల్లలను కాపాడుకుంది. చూస్తున్న వారంతా ఒక్కసారిగా నిశ్చేష్టులయ్యారు. రైలు వెళ్ళిపోయిన తర్వాత పిల్లలతో సహా అందరూ సురక్షితంగా బయటపడటంతో అక్కడున్న వారంతా ఊపిరి పీల్చుకున్నారు. ఈ ప్రమాదంలో ఒక మహిళకు స్వల్ప గాయాలయ్యాయి.
ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో ఆ తల్లి ధైర్యసాహసాలపై నెటిజన్లు ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. అయితే అదే సమయంలో రైల్వే అధికారుల తీరుపై ప్రయాణికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ట్రాక్ దాటేందుకు వంతెన (Foot Over Bridge) సదుపాయం లేకపోవడంతోనే ప్రయాణికులు ఇలా ప్రాణాలను హస్తగతం చేసుకుని ట్రాక్లు దాటాల్సి వస్తుందని వారు మండిపడుతున్నారు.
మృత్యువు ముంగిట నిలబడి కూడా తన బిడ్డలను కాపాడుకున్న ఆ తల్లి సాహసం చూసి “అమ్మ కంటే గొప్ప యోధులు ఎవరూ ఉండరు” అని నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు. ఏది ఏమైనప్పటికీ, రైల్వే ట్రాక్లు దాటేటప్పుడు ప్రయాణికులు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచిస్తున్నారు.
SHOCKING VISUALS 🚨
A mother in Bihar risked her own life to save her two children after a train suddenly arrived while they were crossing the tracks near Shahpur Patori railway station.
According to reports, the three women quickly sat down with the children pressed beneath… pic.twitter.com/JCEdu5R9Y3
— Megh Updates 🚨™ (@MeghUpdates) May 15, 2026
తాజావార్తలు
-
Pakistan Cricket Board: పాక్ క్రికెట్లో మరో సంక్షోభం.. సెలెక్టర్ పదవికి మిస్బా-ఉల్-హక్ గుడ్బై
-
SCO Summit: మోడీ ఫొటో తొలగింపుపై పాక్ యూ-టర్న్.. మళ్లీ ఏం చేసిందంటే..!
-
Duleep Trophy: దులీప్ ట్రోఫీ ఫైనల్కు దూసుకెళ్లిన ఈస్ట్ జోన్.. 4 వికెట్ల తేడాతో గెలుపు..
-
Andhra Pradesh Tax Revenue: ఏపీ ఖజానాకు ఊహించని ఊపు.. ఆగస్టులో భారీగా పెరిగిన పన్నుల ఆదాయం
-
SCO Summit: పాక్ ప్రధాని ముందే ఉగ్రవాదంపై మోడీ స్ట్రాంగ్ మెసేజ్
ట్రెండింగ్
-
PhonePe UPI 123Pay: ఫీచర్ ఫోన్లలోనూ UPI పేమెంట్స్.. ఇంటర్నెట్ లేకుండానే PhonePe సేవలు.!
-
Glenn Phillips Catch: ఒంటిచేత్తో ఊహించని క్యాచ్.. నేనేనా పట్టింది అంటూ షాకైన గ్లెన్ ఫిలిప్స్.. వీడియో తప్పక చూడాల్సిందే!
-
AMOLED డిస్ప్లే, 66W ఫాస్ట్ ఛార్జింగ్, 50MP కెమెరాతో Lava AGNI 4N లాంచ్.!
-
IBPS RRB Recruitment: ఉద్యోగార్థులకు శుభవార్త.. బ్యాంకింగ్ రంగంలో 13,706 ఉద్యోగాల జాతర.!
-
Navagraha Pradakshina: నవగ్రహాలకు ప్రదక్షిణలు చేశాక కాళ్లు కడుక్కోవాలా? అసలు రహస్యం ఇదే..!