Train Ticket Booking: ప్రయాణికులకు శుభవార్త.. మరింత ఈజీగా బుకింగ్లు.. ఎప్పటి నుంచంటే..!
- ప్రయాణికులకు శుభవార్త
- మరింత ఈజీగా బుకింగ్లు
- ఏఐతో రాబోతున్న కొత్త టెక్నాలజీ
- Follow Us :
-
-
Add as a preferred
source on google
భారతీయ రైల్వే వ్యవస్థలో కొత్త మార్పులు జరగబోతున్నాయి. ప్రయాణికులకు మరింత సౌకర్యవంతంగా సేవలు రాబోతున్నాయి. క్షణాల్లో రిజర్వేషన్లు పూర్తయ్యేలా ఏర్పాట్లు జరగుతున్నాయి. త్వరలోనే ఈ సేవలు అందుబాటులోకి రానున్నాయి. ఈ కొత్త విధానం ఆగస్టు నుంచి అమల్లోకి రానుంది. 1986 నుంచి అమలులో ఉన్న పాత వ్యవస్థ స్థానంలో రైలు టిక్కెట్ల బుకింగ్ను క్రమంగా కొత్త పీఆర్ఎస్ (PRS)కు మార్చనుంది. రైల్వే ఇప్పుడు 40 ఏళ్ల నాటి ఈ వ్యవస్థ స్థానంలో ఏఐ (AI) సాంకేతికతను ప్రవేశపెట్టబోతుంది.
ఏఐ టెక్నాలజీ ఉపయోగించడంతో టిక్కెట్ల బుకింగ్ ప్రక్రియను సులభతరం కానుంది. వ్యవస్థ సామర్థ్యాన్ని పెంచడం, ప్రయాణికులకు మెరుగైన అనుభవాన్ని అందించడం ఈ సంస్కరణ ముఖ్య ఉద్దేశ్యం. రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ రైల్ భవన్లో ఈ పనుల పురోగతిని సమీక్షించారు. ప్రయాణికులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా చూడాలని అధికారులను ఆదేశించారు.
Also Read
- Niti Aayog: నీతి ఆయోగ్ కొత్త సీఈవోగా అనురాగ్ జైన్ నియామకం.. కేంద్రం ఉత్తర్వులు
- Uday Krishna Reddy: అనాథగా పెరిగి ఐపీఎస్ దాకా.. ముఖ్యమంత్రిచే ప్రశంసలు.. ఉదయ్ కృష్ణారెడ్డి బ్యాగ్రౌండ్ తెలిస్తే కన్నీళ్లు ఆగవు!
- Delhi High Court: పబ్లిసిటీ కోసం లాఠీ దెబ్బలు తింటారా? పోలీసులపై హైకోర్టు ఆగ్రహం
- CJP Protest: విద్యార్థుల నిరసనపై క్రికెటర్లు బుమ్రా, సూర్యకుమార్ భార్యల పోస్ట్లు వైరల్
ప్రస్తుత ప్రయాణీకుల రిజర్వేషన్ వ్యవస్థ (PRS) 1986లో ప్రవేశపెట్టబడింది. అప్పటి నుంచి ఇందులో చాలా తక్కువ మార్పులు చోటుచేసుకున్నాయి. ఇప్పుడు దీనిని కొత్త సాంకేతికతతో పూర్తిగా పునఃరూపకల్పన చేశారు, దీంతో మునుపటి కంటే వేగంగా మరిన్ని టిక్కెట్ బుకింగ్లను అందించనుంది. భారతీయ రైల్వే 2002లో ఆన్లైన్ టిక్కెట్ బుకింగ్ను ప్రవేశపెట్టింది. నేడు చాలా మంది కౌంటర్లకు వెళ్లడం కంటే ఆన్లైన్లో టిక్కెట్లను బుక్ చేసుకోవడానికే ఇష్టపడుతున్నారు. ప్రస్తుతం సుమారు 88 శాతం టిక్కెట్ బుకింగ్లు డిజిటల్ ప్లాట్ఫారమ్ల ద్వారానే జరుగుతున్నాయి. ఈ మార్పు రైల్వేల డిజిటలైజేషన్ ప్రణాళికలో భాగం. జూలై 2025లో ప్రారంభించబడిన రైల్వన్ యాప్.. ఏడాదిలోపే 3.5 కోట్ల డౌన్లోడ్లను అధిగమించింది. ఈ యాప్ ద్వారా ప్రయాణికులు టిక్కెట్లను బుక్ చేసుకోవడం, రద్దు చేసుకోవడం, రైలు స్థితిని తనిఖీ చేయడం, ప్లాట్ఫాం, కోచ్ సమాచారాన్ని పొందడం, ఫిర్యాదులు చేయడం వంటి అనేక రకాల సేవలను పొందుతున్నారు. మొత్తంమీద ఈ కొత్త వ్యవస్థ, యాప్ ప్రయాణికులకు రైల్వే సేవలను మరింత అందుబాటులోకి తెస్తున్నాయి.
కొత్త వ్యవస్థ ముఖ్య లక్షణం ఏఐ ఆధారిత వెయిటింగ్ లిస్ట్ అంచనా. దీనిని ఈ సంవత్సరం ప్రారంభంలో ప్రవేశపెట్టారు. వెయిట్లిస్ట్లో ఉన్న టిక్కెట్ ఖరారు అయ్యే సంభావ్యతను ఈ ఫీచర్ సూచిస్తుంది. రైల్వేల ప్రకారం.. కచ్చితత్వం గతంలో 53 శాతం నుంచి 94శాతానికి పెరిగింది. ఇది ప్రయాణికులు తమ ప్రయాణాలను మెరుగ్గా ప్లాన్ చేసుకోవడానికి సహాయపడుతుంది. ఆగస్టులో కొత్త ప్యాసింజర్ రిజర్వేషన్ సిస్టమ్ను ప్రారంభించడంతో దేశవ్యాప్తంగా లక్షలాది మంది ప్రయాణికులకు మరింత సౌకర్యాన్ని అందిస్తూ.. టిక్కెట్ బుకింగ్ను వేగవంతంగా.. స్మార్ట్గా, మరింత విశ్వసనీయంగా మార్చడమే రైల్వేల లక్ష్యం.
తాజావార్తలు
-
Criminal Lawyer: కోర్టులో లాయర్.. బయట గంజాయి స్మగ్లర్! పుష్ప స్టైల్లో స్మగ్లింగ్..
-
TG-AP THEFTS: తెలుగు రాష్ట్రాల్లో రెచ్చిపోయిన దోపిడీ దొంగలు.. నిమిషాల్లోనే ఎలా చక్కబెట్టారంటే..!
-
Niti Aayog: నీతి ఆయోగ్ కొత్త సీఈవోగా అనురాగ్ జైన్ నియామకం.. కేంద్రం ఉత్తర్వులు
-
Kaylee Hottle: హాలీవుడ్లో విషాదం.. ‘గాడ్జిల్లా వర్సెస్ కాంగ్’ ఫేమ్ కేలీ హాటిల్ కన్నుమూత
-
Cab Driver: నమ్మించి వంచించాడు.. నిర్మానుష్య ప్రాంతానికి తీసుకెళ్లి ఎయిర్లైన్స్ ఉద్యోగినిపై క్యాబ్ డ్రైవర్ దాడి..
ట్రెండింగ్
-
Natural Drinks : రక్తంలో యూరిక్ యాసిడ్ తగ్గాలంటే.. ఈ నాచురల్ డ్రింక్స్ తప్పక తాగండి
-
Palakura Chutney Recipe : ప్రోటీన్, కాల్షియం పుష్కలంగా ఉండే పాలకూర చట్నీ.. 10 నిమిషాల్లో రెడీ.!
-
Home Hacks : కాంతి తగ్గిన బల్బు మార్చొద్దు.. ఈ చిన్న ట్రిక్తో వెలుగు డబుల్.!
-
Nicholas Pooran: ముంబై స్టార్ ప్లేయర్ విధ్వంసం.. పాకిస్తాన్ బౌలర్ బతిమాడేలా ఆడాడుగా!
-
IND vs ZIM 1st T20: నయా బ్యాటింగ్-బౌలింగ్ లైనప్.. ఇద్దరు అరంగేట్రం.. టీమిండియా డేంజరస్ ప్లేయింగ్ 11 ఇదే!