APL: విద్యార్థులకు శుభవార్త.. ఏపీఎల్ మ్యాచ్లకు ఉచిత ప్రవేశం..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఆంధ్రప్రదేశ్ క్రికెట్ అభిమానులకు, ముఖ్యంగా విద్యార్థులకు ఆంధ్రా క్రికెట్ అసోసియేషన్ అధ్యక్షులు కేశినేని శివనాథ్ (చిన్ని) ఒక తీపి కబురు అందించారు. ఈ నెల 9వ తేదీ నుండి 30వ తేదీ వరకు జరగనున్న ఆంధ్రా ప్రీమియర్ లీగ్ (APL) మ్యాచ్లను ఉచితంగా చూసేందుకు ప్రభుత్వ పాఠశాలలు, కళాశాలల విద్యార్థులకు ప్రత్యేక పాస్లు మంజూరు చేయనున్నట్లు ఆయన ప్రకటించారు. మొత్తం 7 జట్లు తలపడనున్న ఈ క్రికెట్ పండుగను ఈసారి విశాఖపట్నం, కడప, మంగళగిరి స్టేడియాల్లో ఫ్లడ్లైట్ల వెలుతురులో అత్యంత ఘనంగా నిర్వహించనున్నారు. జూన్ 9 నుండి 13 వరకు విశాఖపట్నంలో.. జూన్ 17 నుండి 21 వరకు కడపలో.. జూన్ 24 నుండి 30 వరకు మంగళగిరిలో నిర్వహించనున్నారు.
జూన్ 30న జరిగే గ్రాండ్ ఫైనల్ మ్యాచ్కు ముఖ్య అతిథిగా ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ను ఆహ్వానిస్తున్నట్లు శివనాథ్ తెలిపారు. విద్యార్థులు మ్యాచ్లను ప్రత్యక్షంగా చూసేందుకు వీలుగా విద్యాసంస్థలకు ముందే షెడ్యూల్ సమాచారాన్ని అందిస్తామని, అలాగే విశాఖలో 10 ప్రధాన ప్రాంతాలలో ‘ఫ్లాష్ మాబ్స్’ ద్వారా ప్రజల్లో అవగాహన కల్పిస్తామని చెప్పారు. ఈ మ్యాచ్లను నేరుగా చూడలేని వారి కోసం ‘జియో సినిమా’, ‘స్టార్ స్పోర్ట్స్’ నెట్వర్క్లలో ప్రత్యక్ష ప్రసారాలు ఉంటాయని వెల్లడించారు.
Also Read
- Schools Closed: విద్యార్థులకు బిగ్ అలర్ట్.. ఎల్లుండి స్కూల్స్, కాలేజీలు బంద్..
- Petrol Price: పెట్రోల్ ధరలు తగ్గనున్నాయా? నిపుణులు ఏమంటున్నారంటే..?
- Pakistan: మధ్యవర్తిత్వం చేశాం కదా $10 బిలియన్లు ఇవ్వండి.. అమెరికాను కోరిన పాకిస్తాన్..
- Rahul Gandhi: 152 సార్లు నీట్ పేపర్ లీకైతే ఒక్కరికీ శిక్ష పడలేదు.. రాహుల్గాంధీ కీలక వ్యాఖ్యలు
ఈ టోర్నీలో కేవలం ఆంధ్రా ప్రాంతానికి చెందిన ఆటగాళ్లు మాత్రమే పాల్గొంటున్నారని, వేలం ద్వారా క్రీడాకారులను ఎంపిక చేశామని ఆయన తెలిపారు. గుంటూరుకు చెందిన షేక్ రషీద్ ఇండియా-A జట్టుకు ఎంపికవ్వడం గర్వకారణమని, ఏపీఎల్ ద్వారా మరెంతో మంది ప్రతిభావంతులైన వర్ధమాన క్రీడాకారులు వెలుగులోకి వస్తారని ఆశాభావం వ్యక్తం చేశారు. ప్రస్తుతం అసోసియేషన్ దగ్గర బడ్జెట్ తక్కువగా ఉన్నప్పటికీ, టోర్నీని ఎక్కడా తగ్గకుండా వైభవంగా నిర్వహిస్తామన్నారు. రేపు మధ్యాహ్నం విశాఖపట్నంలో జరిగే బాడీ కౌన్సిల్ సమావేశం అనంతరం పూర్తి వివరాలను, అధికారిక షెడ్యూల్ను మీడియాకు విడుదల చేస్తామని స్పష్టం చేశారు.
తాజావార్తలు
-
Sonam Wangchuk: హామీ ఇస్తే దీక్ష విరమిస్తా.. కేంద్రానికి సోనమ్ వాంగ్చుక్ లేఖ..
-
Schools Closed: విద్యార్థులకు బిగ్ అలర్ట్.. ఎల్లుండి స్కూల్స్, కాలేజీలు బంద్..
-
Toxic: ‘టాక్సిక్’లో రొమాన్స్, వైలెన్స్ డోస్ ఎక్కువైందా? యష్ మూవీపై సోషల్ మీడియాలో హాట్ డిబేట్!
-
Petrol Price: పెట్రోల్ ధరలు తగ్గనున్నాయా? నిపుణులు ఏమంటున్నారంటే..?
-
Anupama – Dhruv Vikram: మోస్ట్ వైలెంట్ బ్రేకప్.. అసలు ఇద్దరూ ఎందుకు విడిపోయారు?
ట్రెండింగ్
-
Home Hacks : కాంతి తగ్గిన బల్బు మార్చొద్దు.. ఈ చిన్న ట్రిక్తో వెలుగు డబుల్.!
-
Nicholas Pooran: ముంబై స్టార్ ప్లేయర్ విధ్వంసం.. పాకిస్తాన్ బౌలర్ బతిమాడేలా ఆడాడుగా!
-
IND vs ZIM 1st T20: నయా బ్యాటింగ్-బౌలింగ్ లైనప్.. ఇద్దరు అరంగేట్రం.. టీమిండియా డేంజరస్ ప్లేయింగ్ 11 ఇదే!
-
Light Flip 5G Phone: సోషల్ మీడియా లేని 5G ఫోన్.. 50MP కెమెరాతో Light Flip కొత్త కాన్సెప్ట్.!
-
10 రోజుల బ్యాటరీ, 80+ స్పోర్ట్స్ మోడ్లు.! స్క్రీన్ లేకుండానే హెల్త్ ట్రాకింగ్.. Garmin CIRQA స్మార్ట్ బ్యాండ్ లాంచ్.!