Kavitha: విద్యాశాఖపై సీఎం పట్టు కోల్పోయారు.. కవిత సంచలన వ్యాఖ్యలు.!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Kavitha: తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రభుత్వ పాఠశాలలపై చేసిన వ్యాఖ్యలపై కల్వకుంట్ల కవిత తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. రాష్ట్రంలోని 27 వేల ప్రభుత్వ పాఠశాలలను 4 వేలకే పరిమితం చేస్తామన్న సీఎం వ్యాఖ్యలను ఖండిస్తూ ఆమె స్పందించారు. ఈ సందర్భంగా కవిత మాట్లాడుతూ.. 27 వేల ప్రభుత్వ పాఠశాలలను మూసివేసి కేవలం 4 వేల పాఠశాలలను మాత్రమే కొనసాగిస్తామని చెప్పడం విద్యా వ్యవస్థపై ప్రభుత్వ వైఖరిని ప్రతిబింబిస్తోందన్నారు. సీఎం “హిట్లర్ కంటే ఎక్కువగా వ్యవహరిస్తున్నారని.. పేదలు, ఆడపిల్లలకు విద్యను దూరం చేసే విధానాలను అవలంబిస్తున్నారని” ఆరోపించారు.
విద్యాశాఖపై ముఖ్యమంత్రి పూర్తిగా పట్టు కోల్పోయారని కవిత విమర్శించారు. విద్యాశాఖను ఒక సర్కస్లా మార్చేశారని వ్యాఖ్యానించారు. ఇంటర్మీడియట్ విద్యా విధానంపై సీఎం చేసిన ప్రకటనలకు, విద్యాశాఖ చర్యలకు మధ్య సమన్వయం లేదని పేర్కొన్నారు. ఒకవైపు ఈ ఏడాది ఇంటర్మీడియట్ ఉండదని ప్రకటిస్తే, మరుసటి రోజే ఇంటర్ బోర్డు అడ్మిషన్ల ప్రక్రియను ప్రారంభించిందని గుర్తుచేశారు. జూనియర్ కళాశాలలు ప్రారంభమై వారం రోజులు గడిచినా.. ప్రభుత్వ, ప్రైవేట్ జూనియర్ కాలేజీలకు ఇప్పటికీ అఫిలియేషన్లు ఇవ్వలేదని ఆమె ఆరోపించారు. డిగ్రీ అడ్మిషన్ల ప్రక్రియను కూడా ప్రభుత్వం గందరగోళంగా మార్చిందని విమర్శించారు. హయ్యర్ ఎడ్యుకేషన్ కౌన్సిల్ ఒకరకమైన కోర్సులను సిఫార్సు చేస్తే, కమిషనరేట్ మరోరకమైన కోర్సులను సూచించిందని.. అయితే వాటిలో ఏ ఒక్కదానికి కూడా విశ్వవిద్యాలయాలు ఆమోదం ఇవ్వలేదని తెలిపారు. అయినప్పటికీ దోస్త్ అడ్మిషన్ల ప్రక్రియ కొనసాగుతోందని అన్నారు.
Also Read
- Harish Rao : రేవంత్ రెడ్డికి హరీష్ రావు కౌంటర్.. అసెంబ్లీలోనే కాదు ఎక్కడైనా చర్చకు సిద్ధం
- HMDA Mokila Layout : మోకిలా లేఅవుట్ ఈ-వేలానికి భారీ స్పందన.. HMDAకు రూ. 231.65 కోట్ల ఆదాయం.!
- OTR: కరీంనగర్ కారు పార్టీలో అలజడి.. 'రెడ్ జోన్' వార్నింగ్తో లీడర్ల ఉరుకులు పరుగులు..
- OTR: తెలంగాణలో అప్పుడే ఎన్నికల తరహా వాతావరణం.. సీఎం గేర్ మార్చబోతున్నారా..?
గురుకుల పాఠశాలల్లో వంద మందికి పైగా విద్యార్థులు మృతి చెందిన ఘటనలపై ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని కవిత ఆరోపించారు. ఈ అంశంపై ముఖ్యమంత్రి కనీసం సమీక్ష కూడా నిర్వహించలేదని విమర్శించారు. అలాగే ఫీ రీయింబర్స్మెంట్ బకాయిల అంశాన్ని ప్రస్తావించిన కవిత.. రూ.11 వేల కోట్ల బకాయిలు చెల్లించకుండా విద్యార్థులకే నేరుగా ట్యూషన్ ఫీజులు ఇస్తామని చెబుతూ జీవో నెంబర్-7ను తీసుకువచ్చారని అన్నారు. ఈ జీవో వల్ల ప్రైవేట్ విద్యాసంస్థలు విద్యార్థులను దోపిడీ చేసే ప్రమాదం ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. జీవో నెంబర్-7ను వెంటనే రద్దు చేయాలని, ఫీజుల నియంత్రణ చట్టాన్ని అమల్లోకి తీసుకువచ్చి ప్రైవేట్ పాఠశాలలు, కళాశాలల ఫీజుల దోపిడీకి అడ్డుకట్ట వేయాలని కవిత ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.
తాజావార్తలు
-
NSTR Forest Entry Ban: నాగార్జునసాగర్–శ్రీశైలం టైగర్ రిజర్వ్ ఫారెస్ట్లో ఆంక్షలు.. 3 నెలలు నో ఎంట్రీ..!
-
Akhil Raj Incident: నాదే తప్పు.. హీరోను ఏం అనకండి.. డెలివరీ బాయ్ షాకింగ్ స్టేట్మెంట్..
-
Isakapatnam OTT: క్రైమ్ థ్రిల్లర్ అభిమానులకు గుడ్ న్యూస్.. అమెజాన్ ప్రైమ్లోకి ‘ఇసకపట్నం’!
-
Homemade Face Mask: 50 ఏళ్ల వయస్సులోనూ 30 ఏళ్ల మెరుపు.. ఇంట్లోనే తయారయ్యే సహజ ఫేస్ మాస్క్ ఇదే!
-
India vs England: “బుడ్డోడా నీ ప్రతిభకు సలాం”.. కానీ నీకోసం కాటేరమ్మకొడుకును బలి చేయలేం..!
ట్రెండింగ్
-
Vaibhav Sooryavanshi: వైభవ్ సూర్యవంశీకి ఛాన్స్ రాకపోవడమే మంచిది.. అసలు కారణం..!
-
IND vs ENG 1st T20: ఇంగ్లండ్ తుది జట్టు ప్రకటన.. ఆ ఇద్దరు స్టార్లకు నో ప్లేస్.. టీమిండియా హ్యాపీ!
-
Farmer Job Offer: జాబ్ ఆఫర్ చేసిన మహిళా రైతు.. ఉదయం 6 నుంచి 2 గంటల వరకు పని.. టీ, బ్రేక్ఫాస్ట్ ఫ్రీ..
-
Bread Pakoda Recipe: కరకరలాడే స్ట్రీట్ స్టైల్ ‘బ్రెడ్ పకోడా’.. సులువుగా ఇంట్లోనే చేసేయండి ఇలా.!
-
Kitchen Tips: ఫ్రిజ్ శబ్దం పెరిగిందా.? టెక్నీషియన్ను పిలవకుండా ఇంట్లోనే ఇలా చేయండి.!