Mahua Moitra: అమిత్ షా పిలవగానే వెళ్తావా సిగ్గు లేదా.? యూసుఫ్ పఠాన్పై మహువా మోయిత్రా ఫైర్..
- ఎంపీ యూసుఫ్ పఠాన్పై మహువా మోయిత్రా ఫైర్..
- ఎన్డీయేకు మద్దతు ఇవ్వడంపై ఆగ్రహం..
- మమత బెనర్జీకి మద్దతుగా నిలిచిన మోయిత్రా..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Mahua Moitra: తృణమూల్ కాంగ్రెస్ ముక్కలైంది. గత 15 ఏళ్లుగా బెంగాల్లో అధికారం చెలాయించిన మమతా బెనర్జీ, ఓడిపోయిన తర్వాత పార్టీని నిలబెట్టుకోలేకపోతోంది. పార్టీ ఎమ్మెల్యేలు, ఎంపీలు అంతా ఆమెపై తిరుగుబాటు చేస్తున్నారు. ఇప్పటికే, తృణమూల్కు ఉన్న 80 మంది ఎమ్మెల్యేల్లో 60 మంది రీటబ్రత బెనర్జీ వెనక చేరారు. తమదే అసలైన తృణమూల్ అని చెబుతున్నారు. ఇక ఎంపీల్లో కూడా తిరుగుబాటు ప్రారంభమైంది. టీఎంసీకి ఉన్న 28 మంది లోక్సభ ఎంపీల్లో 20 మంది రెబల్ వర్గంగా మారారు. వీరంతా బీజేపీ నేతృత్వంలోని ఎన్డీయే సర్కార్కు మద్దతు ఇస్తున్నట్లు ప్రకటించారు.
ఇదిలా ఉంటే, ఈ పరిణామాలపై మమతా బెనర్జీ మద్దతుదారులు తట్టుకోలేకపోతున్నారు. తాజాగా, మమత విధేయురాలు కృష్ణనగర్ ఎంపీ మహువా మొయిత్రా, బహరంపూర్ ఎంపీగా ఉన్న యూసుఫ్ పఠాన్పై తీవ్ర వ్యాఖ్యలు చేశారు. కేంద్ర మంత్రి అమిత్ షా పిలువగానే న్యూఢిల్లీకి వెళ్లినందుకు ఆయనపై విమర్శలు చేశారు. ‘‘ మా జిల్లా ప్రజలు మిమ్మల్ని భారీ మెజారిటీతో గెలిపించారు. కాస్త సిగ్గు లేదా, ధైర్యం చూపలేకపోయావా?’’ అంటూ మండిపడ్డారు. అంతర్జాతీయ స్థాయిలో భారత క్రికెట్కు ఆడిన రోజుల్ని గుర్తు చేస్తూ, ప్రజల విశ్వాసాన్ని నిలబెట్టుకోవాలని సూచించారు.
Also Read
- Pappu Yadav: భారీగా సన్నబడ్డ పప్పు యాదవ్.. గుర్తుపట్టలేకపోతున్న నెటిజన్లు
- Hanuman Ansh: రూ.100 కోట్లతో ‘‘హనుమాన్ అంశ్’’ వసూళ్ల సునామీ.. ఆ రాష్ట్రంలో ట్యాక్స్ ఫ్రీ..
- Jhiram Ghati Maoist Attack: ‘‘జీరాం ఘాటి’’ కాంగ్రెస్ నేతల దారుణహత్య.. 10 మంది దోషుల నిర్ధారణ..
- Subhash Chandra: లోన్ మోసం కేసులో షాక్.. జీ గ్రూప్ అధినేత సుభాష్ చంద్రపై సీబీఐ ఎఫ్ఐఆర్.. ఆరోపణలు ఇవే!
చీఫ్ విప్ కాకోలి ఘోష్ దస్తిదార్ నేతృత్వంలో 20 మంది లోక్సభ ఎంపీలు, బీజేపీ నేతృత్వంలోని ఎన్డీఏకు మద్దతు ప్రకటిస్తూ స్పీకర్ ఓం బిర్లాకు లేఖ రాసిన కొన్ని గంటల తర్వాత మోయిత్రా ఈ వ్యాఖ్యలు చేశారు. తోటి ఎంపీలతో చర్చించిన తర్వాతే విడిపోవాలని నిర్ణయం తీసుకున్నట్లు చెప్పారు. మా భవిష్యత్ రాజకీయ గమనం ఎన్డీయేకు అనుగుణంగా ఉండాలని విశ్వసిస్తున్నట్లు ఆమె అన్నారు. టీఎంసీలోనే ఉంటూ ఎన్డీయేకు మద్దతు ఇస్తున్నట్లు ఎంపీలు ప్రకటించారు.
తాజావార్తలు
-
R. Narayana Murthy: ‘కామ్రేడ్’ పదం వాడితే అభ్యంతరమా? సెన్సార్ బోర్డుపై ఆర్.నారాయణమూర్తి ఫైర్
-
TG SAFE : పనీర్ పేరుతో పామ్ ఆయిల్ గేమ్.. 14 డెయిరీలపై TG SAFE దాడులు
-
Legacy: విశ్వక్ సేన్ ‘లెగసీ’ రిలీజ్ డేట్ ఫిక్స్!
-
Pappu Yadav: భారీగా సన్నబడ్డ పప్పు యాదవ్.. గుర్తుపట్టలేకపోతున్న నెటిజన్లు
-
Hanuman Ansh: రూ.100 కోట్లతో ‘‘హనుమాన్ అంశ్’’ వసూళ్ల సునామీ.. ఆ రాష్ట్రంలో ట్యాక్స్ ఫ్రీ..
ట్రెండింగ్
-
Shubman Gill Uncle: అకాయ్కు ‘అంకుల్’గా శుభ్మన్ గిల్.. వైరల్గా స్కూల్ రీల్.. పగలబడి నవ్వుకుంటున్న ఫాన్స్!
-
243 కి.మీ రేంజ్, 90 కి.మీ టాప్ స్పీడ్.. రూ.1.10 లక్షలకే Simple Wave ఎలక్ట్రిక్ స్కూటర్ లాంచ్..!
-
Rohit Sharma Retirement: రిటైర్మెంట్కు అంగీకరించిన రోహిత్ శర్మ.. సంచలన రిపోర్ట్!
-
6 రోజుల బ్యాటరీ, 24 గంటల బీపీ మానిటరింగ్.. HUAWEI WATCH D3 లాంచ్.!
-
204hp పవర్, 480Nm టార్క్.. 7-సీటర్ SUVగా రీఎంట్రీ ఇవ్వబోతున్న Mitsubishi Pajero.!