Vaibhav Sooryavanshi: ‘వైభవ్ సూర్యవంశీ డకౌట్ అవుతాడు’.. కపిల్ దేవ్ సంచలన వ్యాఖ్యలు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
భారత టీ20 జట్టుకు ఎంపికై సరికొత్త చరిత్ర సృష్టించిన 15 ఏళ్ల యువ సంచలనం వైభవ్ సూర్యవంశీపై ఇప్పుడే అతిగా అంచనాలు పెంచుకుని ఒత్తిడి తీసుకురావద్దని భారత క్రికెట్ దిగ్గజం కపిల్ దేవ్ అభిమానులకు, నిపుణులకు విజ్ఞప్తి చేశారు. ఒత్తిడి అధిగమించకపోతే డకౌట్ అయ్యే అవకాశాలు ఉంటాయని.. దయచేసి అతడిపై ఒత్తిడిని తీసుకురావద్దని కోరాడు.
సచిన్ టెండూల్కర్ రికార్డును బద్దలు కొడుతూ.. భారత సీనియర్ పురుషుల జట్టుకు ఎంపికైన అత్యంత పిన్న వయస్కుడిగా వైభవ్ రికార్డుకెక్కాడు. ఇంగ్లాండ్, ఐర్లాండ్ టీ20 సిరీస్లతో పాటు ఈ ఏడాది జపాన్లోని ఐచి-నగోయాలో జరగనున్న ఆసియా క్రీడల జట్టులోనూ అతనికి చోటు దక్కింది.
Also Read
- Rohit Sharma: కాస్త ఆకలి తగ్గింది.. అయినా ప్రపంచకప్లో అతడు తప్పక ఉండాల్సిందే!
- IND vs ENG 1st T20: తొలి టీ20లో వైభవ్ అరంగేట్రం.. సంజుకు కూడా ఛాన్స్.. వేటు ఎవరిపై!
- Asian Games 2026: ఆసియా క్రీడలకు టీమిండియా జట్టు ప్రకటన.. కెప్టెన్ ఎంపికపై బీసీసీఐ కీలక నిర్ణయం!
- Vaibhav Sooryavanshi: నాడు సంజూ.. నేడు వైభవ్.. టాలెంట్ ఒక్కటే సరిపోదు.. టీమిండియా సెలక్షన్ ఫార్ములా ఇదే..
క్లబ్ క్రికెట్కు, దేశానికి ఆడటానికి తేడా ఉంది..
1983 ప్రపంచ కప్ విజేత కెప్టెన్ కపిల్ దేవ్ మీడియాతో మాట్లాడుతూ.. వైభవ్ను ఒక ‘అద్భుతమైన ప్రతిభావంతుడి’గా అభివర్ణించారు. అయితే అంతర్జాతీయ క్రికెట్కు అలవాటు పడటానికి అతనికి కొంత సమయం ఇవ్వాలని కోరారు. అతను అసాధారణమైన ఆటగాడు అనడంలో సందేహం లేదు. కానీ జాతీయ జట్టులోకి వచ్చినప్పుడు ఫిట్నెస్ మెయింటైన్ చేయడం, మానసికంగా దృష్టి కేంద్రీకరించడం వంటి ఎన్నో విషయాలు ఉంటాయి. క్లబ్ క్రికెట్కు, దేశం తరఫున ఆడటానికి చాలా తేడా ఉంటుంది. కాబట్టి అతనికి తగినంత సమయం ఇవ్వండి, ఇప్పుడే పెద్ద పెద్ద అంచనాలు పెట్టుకోవద్దు అని కపిల్ హితవు పలికారు.
అంతర్జాతీయ వేదికపై రాణిస్తాడు: మదన్ లాల్ ధీమా
మరోవైపు కపిల్ దేవ్ మాజీ సహచరుడు, మాజీ పేసర్ మదన్ లాల్ మాత్రం వైభవ్ సూర్యవంశీ ప్రతిభపై పూర్తి నమ్మకం వ్యక్తం చేశారు. ఐపీఎల్లో ప్యాట్ కమిన్స్, కగిసో రబాడ వంటి ప్రపంచ స్థాయి బౌలర్లను ఎదుర్కొని వైభవ్ పరుగుల వరద పారించిన తీరును ఆయన గుర్తుచేశారు. 15 ఏళ్ల వయసులోనే స్థిరమైన ప్రదర్శనతో జట్టులో చోటు దక్కించుకోవడం విశేషమని, అతని దూకుడు గేమ్ ప్లాన్ అంతర్జాతీయ క్రికెట్కు సరిగ్గా సరిపోతుందని మదన్ లాల్ ధీమా వ్యక్తం చేశారు.
ఆసియా క్రీడల్లో గోల్ఫ్ జట్టుపై కపిల్ ఆశలు
క్రికెట్ ముచ్చట్ల అనంతరం… ప్రొఫెషనల్ గోల్ఫ్ టూర్ ఆఫ్ ఇండియా (PGTI) అధ్యక్షుడిగా ఉన్న కపిల్ దేవ్, త్వరలో జరగబోయే ఆసియా క్రీడల్లో భారత గోల్ఫ్ జట్టు ప్రదర్శనపై స్పందించారు. గత హ్యాంగ్జౌ ఆసియా క్రీడల్లో అదితి అశోక్ సాధించిన రజత పతకం దేశంలో గోల్ఫ్ పట్ల అవగాహనను పెంచిందని, అది తర్వాతి తరానికి స్ఫూర్తినిస్తుందని చెప్పారు. పతకాలు గెలవడంతో పాటు ఆటగాళ్లు చూపించే పోటీతత్వం, వారి ప్రవర్తన కూడా అంతే ముఖ్యమని కపిల్ దేవ్ పేర్కొన్నాడు.
తాజావార్తలు
-
Home Delivery Tragedy: యూట్యూబ్ వీడియోలు చూసి ఇంట్లో ప్రసవం.. భర్తపై కేసు..!
-
SSY vs Fixed Deposit: పిల్లల భవిష్యత్తుకు ఏది బెస్ట్? ఈ తేడాలు తెలుసుకోండి
-
Ma Inti Bangaram: సమంత ఖాతాలో మరో ఘనత.. 100 కోట్ల దిశగా ‘మా ఇంటి బంగారం’
-
Monsoon 2026: మళ్లీ స్టార్ట్ అయిన రుతుపవన ఇంజన్.. ఈ వారం దేశవ్యాప్తంగా విస్తారంగా భారీ వర్షాలు!
-
Amazon Prime Day Sale 2026: అమెజాన్ ప్రైమ్ డే సేల్ 2026.. స్మార్ట్ఫోన్లు, టీవీలు, ల్యాప్టాప్లపై భారీ డిస్కౌంట్లు
ట్రెండింగ్
-
Inspiring Success Story: అమ్మ బంగారు గాజులు.. కూతురి బంగారు భవిష్యత్తు.. యువతి ఎమోషనల్ పోస్ట్ వైరల్
-
IND vs ENG 1st T20: తొలి టీ20లో వైభవ్ అరంగేట్రం.. సంజుకు కూడా ఛాన్స్.. వేటు ఎవరిపై!
-
PBKS Star: పంజాబ్ కింగ్స్ స్టార్ క్రికెటర్పై ఎఫ్ఐఆర్ నమోదు.. వంట మనిషిపై..!
-
Clean and Clutter Free Home: బిజీ లైఫ్లోనూ క్లీన్ హోమ్ సాధ్యం.. పరిశుభ్రమైన ఇంటి రహస్యం ఇదే.!
-
6000mAh భారీ బ్యాటరీ, Snapdragon 6 Gen 3 ప్రాసెసర్తో Samsung Galaxy M47 5G లాంచ్.! ధర ఎంతంటే.?