Vaibhav Sooryavanshi: ‘వైభవ్ సూర్యవంశీ డకౌట్ అవుతాడు’.. కపిల్ దేవ్ సంచలన వ్యాఖ్యలు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
భారత టీ20 జట్టుకు ఎంపికై సరికొత్త చరిత్ర సృష్టించిన 15 ఏళ్ల యువ సంచలనం వైభవ్ సూర్యవంశీపై ఇప్పుడే అతిగా అంచనాలు పెంచుకుని ఒత్తిడి తీసుకురావద్దని భారత క్రికెట్ దిగ్గజం కపిల్ దేవ్ అభిమానులకు, నిపుణులకు విజ్ఞప్తి చేశారు. ఒత్తిడి అధిగమించకపోతే డకౌట్ అయ్యే అవకాశాలు ఉంటాయని.. దయచేసి అతడిపై ఒత్తిడిని తీసుకురావద్దని కోరాడు.
సచిన్ టెండూల్కర్ రికార్డును బద్దలు కొడుతూ.. భారత సీనియర్ పురుషుల జట్టుకు ఎంపికైన అత్యంత పిన్న వయస్కుడిగా వైభవ్ రికార్డుకెక్కాడు. ఇంగ్లాండ్, ఐర్లాండ్ టీ20 సిరీస్లతో పాటు ఈ ఏడాది జపాన్లోని ఐచి-నగోయాలో జరగనున్న ఆసియా క్రీడల జట్టులోనూ అతనికి చోటు దక్కింది.
Also Read
- Gambhir-Kohli: గంభీర్-కోహ్లీ మధ్య ‘కోల్డ్ వార్’.. తొలి సారి నోరు విప్పిన టీమిండియా కోచ్!
- Telangana Jobs: తెలంగాణ నిరుద్యోగులకు శుభవార్త.. త్వరలోనే 50 వేల ఉద్యోగాలకు నోటిఫికేషన్లు..
- Hyderabad: ఫిఫా వరల్డ్ కప్ ఫైనల్ వేళ.. తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం.. ఫ్యాన్స్కు పండగే..
- ICC: ఐసీసీ సంచలన నిర్ణయం.. ఆ పాకిస్థాన్ స్టార్పై నిషేధం.. ఎందుకంటే..?
క్లబ్ క్రికెట్కు, దేశానికి ఆడటానికి తేడా ఉంది..
1983 ప్రపంచ కప్ విజేత కెప్టెన్ కపిల్ దేవ్ మీడియాతో మాట్లాడుతూ.. వైభవ్ను ఒక ‘అద్భుతమైన ప్రతిభావంతుడి’గా అభివర్ణించారు. అయితే అంతర్జాతీయ క్రికెట్కు అలవాటు పడటానికి అతనికి కొంత సమయం ఇవ్వాలని కోరారు. అతను అసాధారణమైన ఆటగాడు అనడంలో సందేహం లేదు. కానీ జాతీయ జట్టులోకి వచ్చినప్పుడు ఫిట్నెస్ మెయింటైన్ చేయడం, మానసికంగా దృష్టి కేంద్రీకరించడం వంటి ఎన్నో విషయాలు ఉంటాయి. క్లబ్ క్రికెట్కు, దేశం తరఫున ఆడటానికి చాలా తేడా ఉంటుంది. కాబట్టి అతనికి తగినంత సమయం ఇవ్వండి, ఇప్పుడే పెద్ద పెద్ద అంచనాలు పెట్టుకోవద్దు అని కపిల్ హితవు పలికారు.
అంతర్జాతీయ వేదికపై రాణిస్తాడు: మదన్ లాల్ ధీమా
మరోవైపు కపిల్ దేవ్ మాజీ సహచరుడు, మాజీ పేసర్ మదన్ లాల్ మాత్రం వైభవ్ సూర్యవంశీ ప్రతిభపై పూర్తి నమ్మకం వ్యక్తం చేశారు. ఐపీఎల్లో ప్యాట్ కమిన్స్, కగిసో రబాడ వంటి ప్రపంచ స్థాయి బౌలర్లను ఎదుర్కొని వైభవ్ పరుగుల వరద పారించిన తీరును ఆయన గుర్తుచేశారు. 15 ఏళ్ల వయసులోనే స్థిరమైన ప్రదర్శనతో జట్టులో చోటు దక్కించుకోవడం విశేషమని, అతని దూకుడు గేమ్ ప్లాన్ అంతర్జాతీయ క్రికెట్కు సరిగ్గా సరిపోతుందని మదన్ లాల్ ధీమా వ్యక్తం చేశారు.
ఆసియా క్రీడల్లో గోల్ఫ్ జట్టుపై కపిల్ ఆశలు
క్రికెట్ ముచ్చట్ల అనంతరం… ప్రొఫెషనల్ గోల్ఫ్ టూర్ ఆఫ్ ఇండియా (PGTI) అధ్యక్షుడిగా ఉన్న కపిల్ దేవ్, త్వరలో జరగబోయే ఆసియా క్రీడల్లో భారత గోల్ఫ్ జట్టు ప్రదర్శనపై స్పందించారు. గత హ్యాంగ్జౌ ఆసియా క్రీడల్లో అదితి అశోక్ సాధించిన రజత పతకం దేశంలో గోల్ఫ్ పట్ల అవగాహనను పెంచిందని, అది తర్వాతి తరానికి స్ఫూర్తినిస్తుందని చెప్పారు. పతకాలు గెలవడంతో పాటు ఆటగాళ్లు చూపించే పోటీతత్వం, వారి ప్రవర్తన కూడా అంతే ముఖ్యమని కపిల్ దేవ్ పేర్కొన్నాడు.
తాజావార్తలు
-
UK: బ్రిటన్ ప్రధానిగా ఆండీ బర్న్హామ్.. సోమవారం బాధ్యతలు స్వీకరణ
-
Ponnam Prabhakar: అలాంటి వాహనాలను సీజ్ చేయండి.. మంత్రి పొన్నం ప్రభాకర్ సీరియస్ వార్నింగ్..
-
Sonam Wangchuk: సోనం వాంగ్చుక్ దీక్షలో నవ్వులు.. పువ్వులు.. ఏం జరిగిందంటే..!
-
Gambhir-Kohli: గంభీర్-కోహ్లీ మధ్య ‘కోల్డ్ వార్’.. తొలి సారి నోరు విప్పిన టీమిండియా కోచ్!
-
Pakistan: పాక్లో 5వ రాష్ట్రంగా గిల్గిట్-బాల్టిస్తాన్.. భారత్ను కవ్వించే చర్య..
ట్రెండింగ్
-
144Hz కర్వ్డ్ AMOLED డిస్ప్లే, 50MP ట్రిపుల్ కెమెరాతో Tecno Camon 50 Ultra 5G భారత్లో లాంచ్.. ధర ఎంతంటే?
-
Karapannam Recipe: అన్నం మిగిలి పోయిందా.? ఏంపర్లేదు.. ఇలా ‘కారపన్నం’ చేస్తే ప్లేట్ ఖాళీ అవ్వాల్సిందే.!
-
రూ.14,499లకే 8000mAh బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో Realme C100x లాంచ్..!
-
Chilli Egg Recipe: రెస్టారెంట్ స్టైల్ ‘స్పైసీ చిల్లీ ఎగ్’.. ఇంట్లోనే ఈజీగా ఇలా చేసుకోండి.!
-
Tollywood: సినిమాకి కలెక్షన్స్ వచ్చినా నిర్మాతలకు డబ్బులు రావా.! అసలు నిజం ఏంటి.?