Iran-Israel War: శాంతించండి.. దాడులు ఆపాలంటూ ఇరాన్, ఇజ్రాయెల్కు భారత్ విజ్ఞప్తి
- మధ్యప్రాచ్యంలో మళ్లీ ఉద్రిక్తతలు
- ఇరాన్-ఇజ్రాయెల్ మధ్య భీకరదాడులు
- శాంతించాలంటూ ఇరుదేశాలకు భారత్ విజ్ఞప్తి
- చర్చలతో సమస్య పరిష్కరించుకోవాలని వినతి
- Follow Us :
-
-
Add as a preferred
source on google
పశ్చిమాసియా యుద్ధం ప్రారంభమై 100 రోజులైంది. ప్రస్తుతం మధ్యప్రాచ్యంలో కాల్పుల విరమణ ఒప్పందం కొనసాగుతోంది. శాంతి ఒప్పందం జరగొచ్చని అంతా భావిస్తున్నారు. ఉద్రిక్తతలు తగ్గుముఖం పడతాయని అంతా అనుకుంటే.. అందుకు భిన్నంగా మళ్లీ ఉద్రిక్తతలు పెరగడం దిగ్భ్రాంతి కలిగిస్తున్నాయి. జూన్ 7న ఉత్తర ఇజ్రాయెల్పై ఇరాన్ క్షిపణులు ప్రయోగించినట్లుగా తెలుస్తోంది. దీనికి ప్రతీకారంగా సోమవారం ఇరాన్పై ఇజ్రాయెల్ క్షిపణులతో విరుచుకుపడింది. దీంతో మరోసారి మధ్యప్రాచ్యంలో ఉద్రిక్తతలు తీవ్రమయ్యాయి. ఈ దాడులపై భారత్ ఆందోళన వ్యక్తం చేసింది. తక్షణమే ఆపాలని కోరింది.
ఏప్రిల్ 8 నుంచి మధ్యప్రాచ్యంలో కాల్పుల విరమణ ఒప్పందం అమల్లోకి వచ్చినప్పటికీ.. ఈ ఒప్పందం లెబనాన్కు వర్తించదని ఇజ్రాయెల్ వాదిస్తోంది. దీంతో హిజ్బుల్లా ఉగ్రవాదులే లక్ష్యంగా ఇజ్రాయెల్ దాడులు చేస్తోంది. ఈ వ్యవహారం ఇరాన్కు రుచించడం లేదు. లెబనాన్పై దాడులు ఆపితేనే శాంతి చర్చలు జరుగుతాయని ఇరాన్ అంటోంది. ఈ నేపథ్యంలో లెబనాన్పై దాడులు ఆపాలని ఇజ్రాయెల్కు ట్రంప్ సూచించినట్లు వార్తలొచ్చాయి. కానీ ఇజ్రాయెల్ మాత్రం లెక్కచేయలేదని తెలుస్తోంది. ఈ నేపథ్యంలోనే జూన్ 7 రాత్రి ఉత్తర ఇజ్రాయెల్పై ఇరాన్ బాలిస్టిక్ క్షిపణులు ప్రయోగించినట్లు సమాచారం. ఇప్పుడు ఇజ్రాయెల్ కూడా ఇరాన్పై ప్రతీకార దాడులకు దిగింది.
Also Read
- 2026 Half Year: అర్థ సంవత్సరంలో జాతీయంగా జరిగిన విశేషాలు ఇవే!
- UP: రాయ్బరేలీ ఆస్పత్రిలో అమానుషం.. రోగిని కాలుతో తన్నిన సిబ్బంది.. ప్రజలు ఆగ్రహం
- Tamil Nadu: సీఎం విజయ్ కీలక నిర్ణయం.. ఇకపై ఏసీ ప్రభుత్వ బస్సులే ఉంటాయని ప్రకటన
- Mumbai: ముంబైలో ఘోరం.. స్కూల్ వ్యాన్పై కూలిన భారీ వృక్షం.. 11 ఏళ్ల విద్యార్థి మృతి
ఇప్పటికే మధ్యప్రాచ్యం యుద్ధంతో ప్రపంచ దేశాలు అల్లాడిపోతున్నాయి. గ్యాస్, చమురు కష్టాలతో ఇబ్బందులు పడుతున్నాయి. ఇలాంటి తరుణంలో మరోసారి పశ్చిమాసియా అట్టుడకడంపై భారత్ ఆందోళన వ్యక్తం చేసింది. తక్షణమే దాడులు ఆపాలని ఇరాన్, ఇజ్రాయెల్కు భారతదేశం విజ్ఞప్తి చేసింది. ఈ మేరకు కేంద్ర ప్రభుత్వం కీలక ప్రకటన విడుదల చేసింది.
‘‘ఘర్షణలు ఇప్పటికే 100 రోజులకు పైగా కొనసాగుతోంది. దీనివల్ల అపారమైన మానవీయ వేదన, ప్రాణనష్టం సంభవించింది.’’ అని భారత్ పేర్కొంది. ప్రాంతీయ స్థిరత్వం, అంతర్జాతీయ భద్రతపై ఈ యుద్ధం తీవ్ర ప్రభావం చూపుతోందని ఆందోళన వ్యక్తం చేసింది. అలాగే ఇరాన్, ఇజ్రాయెల్ సహా అన్ని పక్షాలు తక్షణమే ఉద్రిక్తతలను తగ్గించాలని భారత్ పిలుపునిచ్చింది. ప్రస్తుతం కొనసాగుతున్న చర్చలను వేగవంతం చేసి.. దౌత్యపరమైన పరిష్కారానికి చేరుకోవాలని సూచించింది. మధ్యప్రాచ్యంలో మళ్లీ శాంతి, స్థిరత్వం నెలకొనేలా అన్ని పక్షాలు చర్చల మార్గాన్ని ఎంచుకోవాలని.. కొనసాగుతున్న చర్చలను విజయవంతంగా ముగించి దౌత్యపరమైన పరిష్కారానికి రావాలని భారత ప్రభుత్వం తన ప్రకటనలో స్పష్టం చేసింది.
Statement on developments in West Asia ⬇️
🔗 https://t.co/8rzSlqgnY0 pic.twitter.com/NO5XecAcVZ
— Randhir Jaiswal (@MEAIndia) June 8, 2026
తాజావార్తలు
-
Salman Khan: గెలాక్సీ అపార్ట్మెంట్స్కు సల్మాన్ ఖాన్ గుడ్ బై! ముంబయిని షేక్ చేస్తున్న ‘సుల్తాన్’ కొత్త ఇంటి రేటు!
-
Gold: బంగారం కురిపిస్తున్న అగ్నిపర్వతం.. రోజుకు 80 గ్రాముల బంగారం గాల్లోకి..
-
Visakhapatnam: రాష్ట్రపతి పర్యటనలో కలకలం.. కాన్వాయ్ వైపు దూసుకొచ్చిన యువకుడు.!
-
2026 Half Year: అర్థ సంవత్సరంలో జాతీయంగా జరిగిన విశేషాలు ఇవే!
-
CM Revanth Reddy : కేసీఆర్కు రేవంత్ ఓపెన్ ఛాలెంజ్.!
ట్రెండింగ్
-
Farmer Job Offer: జాబ్ ఆఫర్ చేసిన మహిళా రైతు.. ఉదయం 6 నుంచి 2 గంటల వరకు పని.. టీ, బ్రేక్ఫాస్ట్ ఫ్రీ..
-
Bread Pakoda Recipe: కరకరలాడే స్ట్రీట్ స్టైల్ ‘బ్రెడ్ పకోడా’.. సులువుగా ఇంట్లోనే చేసేయండి ఇలా.!
-
Kitchen Tips: ఫ్రిజ్ శబ్దం పెరిగిందా.? టెక్నీషియన్ను పిలవకుండా ఇంట్లోనే ఇలా చేయండి.!
-
Income Tax Returns: ఆదాయపు పన్ను చెల్లింపుదారులకు అలెర్ట్.. జూలైలో మిస్ కాకూడని ముఖ్యమైన డెడ్లైన్లు ఇవే.!
-
Spider Control : వర్షాకాలంలో సాలీళ్ల బెడదా.? ఈ సహజమైన స్ప్రేలతో చెక్ పెట్టండి.!