Iran-Israel War: శాంతించండి.. దాడులు ఆపాలంటూ ఇరాన్, ఇజ్రాయెల్కు భారత్ విజ్ఞప్తి
- మధ్యప్రాచ్యంలో మళ్లీ ఉద్రిక్తతలు
- ఇరాన్-ఇజ్రాయెల్ మధ్య భీకరదాడులు
- శాంతించాలంటూ ఇరుదేశాలకు భారత్ విజ్ఞప్తి
- చర్చలతో సమస్య పరిష్కరించుకోవాలని వినతి
- Follow Us :
-
-
Add as a preferred
source on google
పశ్చిమాసియా యుద్ధం ప్రారంభమై 100 రోజులైంది. ప్రస్తుతం మధ్యప్రాచ్యంలో కాల్పుల విరమణ ఒప్పందం కొనసాగుతోంది. శాంతి ఒప్పందం జరగొచ్చని అంతా భావిస్తున్నారు. ఉద్రిక్తతలు తగ్గుముఖం పడతాయని అంతా అనుకుంటే.. అందుకు భిన్నంగా మళ్లీ ఉద్రిక్తతలు పెరగడం దిగ్భ్రాంతి కలిగిస్తున్నాయి. జూన్ 7న ఉత్తర ఇజ్రాయెల్పై ఇరాన్ క్షిపణులు ప్రయోగించినట్లుగా తెలుస్తోంది. దీనికి ప్రతీకారంగా సోమవారం ఇరాన్పై ఇజ్రాయెల్ క్షిపణులతో విరుచుకుపడింది. దీంతో మరోసారి మధ్యప్రాచ్యంలో ఉద్రిక్తతలు తీవ్రమయ్యాయి. ఈ దాడులపై భారత్ ఆందోళన వ్యక్తం చేసింది. తక్షణమే ఆపాలని కోరింది.
ఏప్రిల్ 8 నుంచి మధ్యప్రాచ్యంలో కాల్పుల విరమణ ఒప్పందం అమల్లోకి వచ్చినప్పటికీ.. ఈ ఒప్పందం లెబనాన్కు వర్తించదని ఇజ్రాయెల్ వాదిస్తోంది. దీంతో హిజ్బుల్లా ఉగ్రవాదులే లక్ష్యంగా ఇజ్రాయెల్ దాడులు చేస్తోంది. ఈ వ్యవహారం ఇరాన్కు రుచించడం లేదు. లెబనాన్పై దాడులు ఆపితేనే శాంతి చర్చలు జరుగుతాయని ఇరాన్ అంటోంది. ఈ నేపథ్యంలో లెబనాన్పై దాడులు ఆపాలని ఇజ్రాయెల్కు ట్రంప్ సూచించినట్లు వార్తలొచ్చాయి. కానీ ఇజ్రాయెల్ మాత్రం లెక్కచేయలేదని తెలుస్తోంది. ఈ నేపథ్యంలోనే జూన్ 7 రాత్రి ఉత్తర ఇజ్రాయెల్పై ఇరాన్ బాలిస్టిక్ క్షిపణులు ప్రయోగించినట్లు సమాచారం. ఇప్పుడు ఇజ్రాయెల్ కూడా ఇరాన్పై ప్రతీకార దాడులకు దిగింది.
Also Read
- Trump: టర్కీకి బయల్దేరే ముందు ఓవల్ ఆఫీస్లో ఏం జరిగింది.. ఇరాన్పై ట్రంప్ యుద్ధానికెళ్లడానికి కారణమిదేనా?
- US-Iran War: ఇరాన్లో భారత్-చైనాలను దెబ్బతీసిన అమెరికా..
- Hardeep Singh Puri: త్వరలో చౌకగా E85! ఇథనాల్తో ఇంజిన్ దెబ్బతింటుందన్న పుకార్లు నమ్మొద్దు
- El Nino: ఎల్నినోతో వర్షాలుండవన్నారు.. ఇప్పుడెందుకు భారత్ను ముంచెత్తున్నాయి.. కారణమేంటి?
ఇప్పటికే మధ్యప్రాచ్యం యుద్ధంతో ప్రపంచ దేశాలు అల్లాడిపోతున్నాయి. గ్యాస్, చమురు కష్టాలతో ఇబ్బందులు పడుతున్నాయి. ఇలాంటి తరుణంలో మరోసారి పశ్చిమాసియా అట్టుడకడంపై భారత్ ఆందోళన వ్యక్తం చేసింది. తక్షణమే దాడులు ఆపాలని ఇరాన్, ఇజ్రాయెల్కు భారతదేశం విజ్ఞప్తి చేసింది. ఈ మేరకు కేంద్ర ప్రభుత్వం కీలక ప్రకటన విడుదల చేసింది.
‘‘ఘర్షణలు ఇప్పటికే 100 రోజులకు పైగా కొనసాగుతోంది. దీనివల్ల అపారమైన మానవీయ వేదన, ప్రాణనష్టం సంభవించింది.’’ అని భారత్ పేర్కొంది. ప్రాంతీయ స్థిరత్వం, అంతర్జాతీయ భద్రతపై ఈ యుద్ధం తీవ్ర ప్రభావం చూపుతోందని ఆందోళన వ్యక్తం చేసింది. అలాగే ఇరాన్, ఇజ్రాయెల్ సహా అన్ని పక్షాలు తక్షణమే ఉద్రిక్తతలను తగ్గించాలని భారత్ పిలుపునిచ్చింది. ప్రస్తుతం కొనసాగుతున్న చర్చలను వేగవంతం చేసి.. దౌత్యపరమైన పరిష్కారానికి చేరుకోవాలని సూచించింది. మధ్యప్రాచ్యంలో మళ్లీ శాంతి, స్థిరత్వం నెలకొనేలా అన్ని పక్షాలు చర్చల మార్గాన్ని ఎంచుకోవాలని.. కొనసాగుతున్న చర్చలను విజయవంతంగా ముగించి దౌత్యపరమైన పరిష్కారానికి రావాలని భారత ప్రభుత్వం తన ప్రకటనలో స్పష్టం చేసింది.
Statement on developments in West Asia ⬇️
🔗 https://t.co/8rzSlqgnY0 pic.twitter.com/NO5XecAcVZ
— Randhir Jaiswal (@MEAIndia) June 8, 2026
తాజావార్తలు
-
Vaibhav Vs Archer: చెప్పినట్లే వైభవ్ను బోల్తా కొట్టిస్తున్న ఆర్చర్.. మరోసారి దొరికిపోయిన సూర్యవంశీ..
-
Mohan Naik : మాజీ ఇంజనీర్ మోహన్ నాయక్ కేసులో బిగ్ ట్విస్ట్
-
IND Vs ENG: టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న భారత్.. టీమ్లో రెండు మార్పులు..
-
OTR: కేంద్ర మంత్రి ముందే ప్రశ్నల వర్షం.. బిల్డప్ కోసమేనా..?
-
OTR: తాడిచర్ల-2 బొగ్గు బ్లాక్ కేటాయింపుపై కాంగ్రెస్ వర్సెస్ బీజేపీ
ట్రెండింగ్
-
Rainy Season Tips : వర్షాకాలంలో బూట్ల దుర్వాసనకు చెక్.. ఈ చిట్కాలు ట్రై చేయండి.!
-
IP69K రేటింగ్, 9000mAh బ్యాటరీతో లాంచ్ కానున్న REDMI Note 17 Pro..!
-
TGSRTCలో 1,500 కండక్టర్ పోస్టులు.. రాత పరీక్ష లేకుండానే ఉద్యోగం.!
-
Jio నుంచి గేమ్ ఛేంజింగ్ ప్లాన్.. 1,000+ టీవీ ఛానెల్స్, 150 ప్రీమియం ఛానెల్స్ కేవలం రూ.55కే.!
-
Viral News: చిన్న పొదుపుతో తీరిన పెద్ద కల.. రూ.10 నాణేలతో రూ.1.10 లక్షల బైక్ కొనుగోలు.!