రాజస్థాన్లోని అధికార కాంగ్రెస్ పార్టీలో సంక్షోభం కొనసాగుతోంది. సీఎం అశోక్ గెహ్లాట్, మాజీ డిప్యూటీ సీఎం సచిన్ పైలట్ మధ్య వార్ పతాక స్థాయికి చేరింది. సొంత ప్రభుత్వానికి వ్యతిరేకంగా సచిన్ పైలట్ చేసిన నిరాహార దీక్షతో గెహ్లాట్ ప్రభుత్వానికి తీవ్ర ఇబ్బందిగా మారింది.
రాజస్థాన్ లో అసెంబ్లీ ఎన్నికల దగ్గర పడుతున్న వేళ అధికార కాంగ్రెస్ పార్టీలో వర్గ పోరు తలనొప్పిగా మారింది. ఈ ఏడాది చివర్లో రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికలు జరగబోతున్నాయి.
మొసలి నోటికి చిక్కన భర్తను కాపాడుకునేందుకు ఓ మహిళ వీరోచితంగా పోరాడింది. భర్త కాళ్లను నోటీతో పట్టుకుని.. నీటిలోకి తీసుకు వెళ్లే ప్రయత్నం చేసిన మొసలి పైనే దాడి చేసింది. ధైర్యంగా మొసలిని ఎదుర్కొని క్రూర జంతువు నుంచి తన భర్త ప్రాణాలను కాపాడింది ఓ మహిళ.
Rajasthan: రాజస్థాన్ రాష్ట్రంలో సభ్య సమాజం తలదించుకునే ఘటన చోటు చేసుకుంది. చురు జిల్లా రతన్నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో కోడలిపై కన్నేసిన మామ ఆమెపై అత్యాచారం చేసి తీవ్రంగా గాయపరిచాడు.
కాంగ్రెస్, బీజేపీల మధ్య రాజకీయ వైరం ఉంది. ముఖ్యంగా మోడీ సర్కార్ పై కాంగ్రెస్ తీవ్ర స్థాయిలో విరుచుకుపడుతోంది. ప్రజా వ్యతిరేక విధానాలపై విమర్శలు గుప్పిస్తోంది. ప్రధాని మోడీ కూడా సభలు, పలు అభివృద్ధి కార్యక్రమాల సందర్భంగా విపక్షాల విమర్శలను తిప్పికొడుతున్నారు.
రాజస్థాన్లో సొంత ప్రభుత్వానికి వ్యతిరేకంగా బహిరంగ నిరసనకు దిగిన కాంగ్రెస్ యువనేత సచిన్ పైలట్ ఇవాళ హస్తినకు వెళ్తున్నారు. గత బీజేపీ ప్రభుత్వంలో జరిగిన అవినీతిపై విచారణ జరిపించాలని డిమాండ్ చేస్తూ నిన్న సచిన్ పైలట్ నిరాహార దీక్ష చేశారు.
కాంగ్రెస్ నాయకుడు సచిన్ పైలట్ ఈరోజు జైపూర్లో తన సొంత ప్రభుత్వాన్ని లక్ష్యంగా చేసుకుని తన నిరసన నిరాహార దీక్షను కొనసాగిస్తున్నారు. పార్టీ వ్యతిరేక చర్యకు దిగొద్దని హైకమాండ్ హెచ్చరించినా.. కాంగ్రెస్ పెద్దల ఆదేశాలన్ని పైలట్ ధిక్కరించారు.
రాజస్థాన్ లో అధికార కాంగ్రెస్ లో పార్టీ నేతల మధ్య పోరు కొనసాగుతోంది. సీఎం స అశోక్ గెహ్లాట్ వర్సెస్ సచిన్ పైలట్ గా మారింది. గత కొద్ది రోజులుగా ఇద్దరి మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమనే పరిస్థితి నెలకొంది. ఈ క్రమంలో సచిన్ పైలట్ నిరాహారదీక్షకు దిగడం రాజకీయంగా చర్చనీయాంశమైంది.