CM Chandrababu : అమరావతిలో దేశంలోనే అత్యుత్తమ ‘జస్టిస్ సిటీ’
- అమరావతిలో అత్యాధునిక ‘జస్టిస్ సిటీ’ నిర్మాణం
- న్యాయ వ్యవస్థకు ప్రత్యేక హబ్గా రాజధాని రూపకల్పన
- ల్యాండ్ పూలింగ్ మోడల్తో ప్రజా రాజధాని విజన్
- మీడియేషన్ కేంద్రాలతో కేసుల భారాన్ని తగ్గించే లక్ష్యం : చంద్రబాబు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతిని ప్రపంచస్థాయి నగరంగా తీర్చిదిద్దే క్రమంలో భాగంగా, అక్కడ దేశంలోనే అత్యుత్తమ ‘జస్టిస్ సిటీ’ని నిర్మించనున్నట్లు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ప్రకటించారు. భారత ప్రధాన న్యాయమూర్తి (CJI) అమరావతి పర్యటన సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ముఖ్యమంత్రి పాల్గొని ప్రసంగించారు. ఏపీ చరిత్రలో ఇదొక చారిత్రాత్మక రోజని, న్యాయవ్యవస్థకు అత్యున్నత ప్రాధాన్యం ఇచ్చేలా రాజధానిని తీర్చిదిద్దుతున్నామని ఆయన పేర్కొన్నారు.
న్యాయ విభాగానికి సంబంధించిన అన్ని విభాగాలు ఒకే చోట ఉండేలా ‘జస్టిస్ సిటీ’ని డిజైన్ చేస్తున్నట్లు చంద్రబాబు తెలిపారు. జుడీషియల్ అకాడమీ, లీగల్ సర్వీస్ అథారిటీ, మీడియేషన్ సెంటర్ , ఇంటర్నేషనల్ లా యూనివర్సిటీలను అనుసంధానిస్తూ ఈ ప్రాజెక్ట్ ఉంటుందని చెప్పారు. జుడీషియల్ అకాడమీ నిర్మాణానికి సంబంధించి ఎంత భూమి కావాలన్నా ఇచ్చేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని, ఈ విషయంలో సీజేఐ తన సూచనలు , సహకారం అందించాలని ఆయన కోరారు.
Also Read
- AP Weather Alert: ఏపీలో భారీ వర్షాల హెచ్చరిక.. పల్నాడు సహా 7 జిల్లాలకు అలర్ట్
- Vizag Steel Plant Accident: స్టీల్ ప్లాంట్ ప్రమాదం.. దిగ్భ్రాంతి వ్యక్తం చేసిన సీఎం చంద్రబాబు, వైఎస్ జగన్..
- Vizag Steel Plant Accident: విశాఖ స్టీల్ప్లాంట్లో భారీ అగ్ని ప్రమాదం.. పలువురు కార్మికుల సజీవ దహనం
- CM Chandrababu: ఇప్పుడు రైతుల భూ రికార్డులను ఎవరూ ట్యాంపర్ చేయలేరు!
అమరావతి ప్రత్యేకతను వివరిస్తూ.. ఇది ప్రపంచంలోనే ఎక్కడా లేని విధంగా ‘ల్యాండ్ పూలింగ్’ ద్వారా నిర్మితమవుతున్న నగరమని సీఎం గుర్తుచేశారు. సుమారు 29,000 మంది రైతులు తమ 33,000 ఎకరాల భూమిని రాజధాని కోసం స్వచ్ఛందంగా అప్పగించారని, ఇది కేవలం ఒక నగరం మాత్రమే కాదు, “ప్రజా రాజధాని” అని ఆయన అభివర్ణించారు. కాలుష్య రహితంగా, గ్రీన్ ఎనర్జీతో, పర్యావరణ హితంగా ఈ నగరాన్ని నిర్మిస్తున్నామని, ఇక్కడ నివసించే వారి జీవన ప్రమాణాలు మెరుగుపడటంతో పాటు వారి ఆయుష్షు కనీసం 20 ఏళ్లు పెరుగుతుందని చంద్రబాబు ధీమా వ్యక్తం చేశారు.
కోర్టు కేసుల భారాన్ని తగ్గించే ‘మీడియేషన్’ ప్రక్రియపై సీజేఐకి ఉన్న ఆసక్తిని ముఖ్యమంత్రి అభినందించారు. తన తండ్రికి పెద్దగా చదువు లేకపోయినా తన చిన్నతనంలో గ్రామాల్లో మధ్యవర్తిగా ఉండి సమస్యలను పరిష్కరించేవారని ఆయన గుర్తు చేసుకున్నారు. కోర్టుల వెలుపల సమస్యలను సామరస్యంగా పరిష్కరించే మీడియేషన్ కేంద్రాలకు అమరావతిలో అత్యుత్తమ సౌకర్యాలు కల్పిస్తామని హామీ ఇచ్చారు.
తాజావార్తలు
-
Train Ticket Booking: ప్రయాణికులకు శుభవార్త.. మరింత ఈజీగా బుకింగ్లు.. ఎప్పటి నుంచంటే..!
-
Israel-Iran: ఇరాన్ సీజ్ఫైర్పై ఇజ్రాయెల్ మౌనం.. సర్వత్రా ఉత్కంఠ!
-
Vaibhav: 15 ఏళ్ల వండర్ కిడ్ ‘వైభవ్ సూర్యవంశీ’పైనే అందరి కళ్ళు.. లంక పిచ్లపై భారత్ ‘ఎ’ ట్రై-సిరీస్ పోరు..
-
Mahua Moitra: అమిత్ షా పిలవగానే వెళ్తావా సిగ్గు లేదా.? యూసుఫ్ పఠాన్పై మహువా మోయిత్రా ఫైర్..
-
Kitchen Hacks: వంటగదిలో ఈ చిన్న ట్రిక్స్ తెలిస్తే.. మీ పని సగం తగ్గుతుంది!
ట్రెండింగ్
-
Protein Powder : ప్రోటీన్ పౌడర్ తీసుకోవడం సురక్షితమేనా? ఈ విషయం తెలుసుకోకుండా వాడకండి..!
-
Manav Suthar Record: అరంగేట్ర స్పిన్నర్ మానవ్ సుతార్ అరుదైన రికార్డు.. ఈ శతాబ్దంలోనే ‘ఒకే ఒక్కడు’!
-
Harmanpreet Kaur: ‘నేను రిటైర్ అవ్వాలనుకుంటున్నారా?’.. రిపోర్టర్ కు ధోనీ స్టైల్లో మహిళా కెప్టెన్ కౌంటర్.!
-
Birth Rate: భారత్లో పడిపోతున్న జననాల రేటు.. విద్యావంతులు తక్కువ మంది పిల్లలను కనడమే కారణమా.?
-
Sugar Cravings Control : తీపి తినాలనే కోరికా..? ఈ చిట్కాలతో మీ స్వీట్ క్రేవింగ్స్కు చెక్ పెట్టండి.!