Rajasthan Congress: అటు గెహ్లాట్ ఇటు పైలట్ మధ్యలో కమల్ నాథ్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
రాజస్థాన్లోని అధికార కాంగ్రెస్ పార్టీలో సంక్షోభం కొనసాగుతోంది. సీఎం అశోక్ గెహ్లాట్, మాజీ డిప్యూటీ సీఎం సచిన్ పైలట్ మధ్య వార్ పతాక స్థాయికి చేరింది. సొంత ప్రభుత్వానికి వ్యతిరేకంగా సచిన్ పైలట్ చేసిన నిరాహార దీక్షతో గెహ్లాట్ ప్రభుత్వానికి తీవ్ర ఇబ్బందిగా మారింది. రాష్ట్రంలో త్వరలో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. ఈ తరుణంలో నేతల మధ్య విభేదాలు ఎన్నికలపై ప్రభావితం చూపిస్తాయని పార్టీ అగ్రనాయకత్వం ఆందోళనలో ఉంది. ప్రస్తుతం అధికారంలో ఉన్న కాంగ్రెస్.. మరోసారి అధికారాన్ని కొనసాగించాలని భావిస్తోంది. అయితే, నేతల మధ్య వర్గపోరు తలనొప్పిగా మారింది.ఈ నేపథ్యంలో ఇద్దరు నేతల మధ్య సయోద్యకు పార్టీ అధిష్టానం చర్యలు చేపట్టింది.
Also Read: Rahul Meets Pawar: మేము ఐక్యంగా ఉన్నాం… ప్రతిపక్షల ఐక్యతపై వ్యూహం
రాజస్థాన్లో పంజాబ్ లాంటి పరాజయాన్ని నివారించేందుకు కాంగ్రెస్ అధిష్టానం సీనియర్ నాయకుడు, మధ్యప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి కమల్ నాథ్ను రంగంలో దింపింది. అశోక్ గెహ్లాట్, సచిన్ పైలట్ మధ్య మధ్యవర్తిత్వం వహించాలని భావిస్తున్నట్లు పార్టీ వర్గాలు తెలిపాయి. కమల్ నాథ్ గురువారం ఢిల్లీలో పైలట్, పార్టీ ప్రధాన కార్యదర్శి కెసి వేణుగోపాల్తో సమావేశమయ్యారు. రెండు వర్గాల మధ్య విభేదాలను పరిష్కరించే మార్గాలపై చర్చించినట్లు వర్గాలు తెలిపాయి. ఈ ఏడాది చివర్లో జరిగే ఎన్నికలకు ముందు తనకంటూ ఒక గొప్ప పాత్రను ఏర్పరచుకునే ఎత్తుగడగా భావించి పైలట్ గత బిజెపి నేతృత్వంలోని ప్రభుత్వ అవినీతికి వ్యతిరేకంగా ఒక రోజంతా నిరాహార దీక్ష చేపట్టారు. వసుంధర రాజే మీద తన సొంత పార్టీ ప్రభుత్వం నిష్క్రియాత్మకంగా ఉందని ఆరోపించారు.
Also Read
పైలట్ నిరాహార దీక్షను పార్టీ వ్యతిరేక చర్యగా పేర్కొంటూ రెండు ప్రకటనలు విడుదల చేసిన కాంగ్రెస్ నాయకత్వం.. ఇప్పుడు తన వైఖరిని మార్చుకుంది. మధ్యేమార్గాన్ని కనుగొనడానికి ప్రయత్నిస్తోంది. పైలట్ తన ఇబ్బందులు, సమస్యలను కమల్ నాథ్, వేణుగోపాల్లకు తెలియజేసినట్లు పార్టీ వర్గాలు తెలిపాయి.గత కొద్ది రోజులుగా వరుస సమావేశాలు నిర్వహిస్తున్న కమల్ నాథ్ ఇరువర్గాలను శాంతింపజేసి సంక్షోభం తలెత్తకుండా పరిష్కారాన్ని కనుగొనే ప్రయత్నం చేస్తున్నారు. రాజస్థాన్లోని సమస్యలు, ఆందోళనలను అర్థం చేసుకోకుండా, కొత్త రాష్ట్ర ఇన్ఛార్జ్ ఇప్పటికే పక్షపాత వైఖరిని అవలంబించిన తీరుతో విసిగిపోయాడని పైలట్ సన్నిహిత వర్గాలు చెబుతున్నాయి.
Also Read:Ambedkar Statue: సాగర తీరంలో రాజ్యాంగ నిర్మాత.. నేడు అంబేడ్కర్ విగ్రహావిష్కరణ
పైలట్ కూడా రాజేకు వ్యతిరేకంగా తన నిరాహార దీక్షను సమర్థించుకున్నాడు. ఇది పార్టీకి వ్యతిరేకం కాదని, ప్రజా ప్రయోజనాల సమస్యలను లేవనెత్తుతున్నానని చెప్పాడు. ఇతర నేతలు ప్రధాని నరేంద్ర మోదీ లేదా ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ వైఫల్యాలను ఆరోపిస్తుంటే పార్టీలో ద్వంద్వ ప్రమాణం ఉందని ఆయన వాదించారు.
కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే మధ్యేమార్గాన్ని కనుగొనడానికి ప్రయత్నించారు. అన్ని వైపులా చీలికను సరిదిద్దాలని కోరుతున్నారు. ముఖ్యంగా పార్టీ కర్ణాటకలో ముఖ్యమైన ఎన్నికల్లో పోరాడుతోంది. గెహ్లాట్ బలహీనత, రాష్ట్రంలో ఆయన ప్రభుత్వం ఎదుర్కొంటున్న భారీ అధికార వ్యతిరేకతపై పార్టీ నాయకత్వం ఆందోళనతో ఉంది. అధికారం కోల్పోతామనే భయం హస్తం నేతల్లో వ్యక్తం అవుతున్నట్లు తెలుస్తోంది. రాష్ట్ర ఎన్నికల వరకు జరిగే సంధిని మధ్యవర్తిత్వం చేయగలదా ? గెహ్లాట్, పైలట్ మళ్లీ కలుస్తారా లేదా అన్నది చూడాలి.
తాజావార్తలు
-
Ravi Kishan: కూతురికి తల్లి లేని లోటు తెలియకూడదని.. మీసం తీసి, చీర కట్టేందుకు రెడీ అయిన స్టార్ విలన్!
-
CM Chandrababu : చిన్నారులే భవిష్యత్ సంపద.. ఉమ్మడి కుటుంబాలపై చంద్రబాబు కీలక వ్యాఖ్యలు
-
Team India Player: ‘పిక్నిక్లా భావించి వెళ్లారు.. ఐర్లాండ్ దెబ్బకు బొక్కబోర్లా పడ్డారు’..
-
Ashwin: ‘మీరు తప్పు చేశారు’.. వాషింగ్టన్ సుందర్ పాత్రపై అశ్విన్ వ్యాఖ్యలు..
-
Sharmistha Mukherjee: “రాజకీయం పార్ట్ టైమ్ కాదు”.. రాహుల్ గాంధీపై ప్రణబ్ కుమర్తె ఘాటు విమర్శలు..
ట్రెండింగ్
-
Smriti Mandhana: నీయవ్వ తగ్గేదేలే.. ఆస్ట్రేలియా అంటే బయపడుతామా?.. మా సత్తా ఏంటో చూపిస్తాం!
-
Kitchen Tips : ప్రెషర్ కుక్కర్ రబ్బర్ వదులై గ్యాస్ లీక్ అవుతుందా? ఈ సింపుల్ చిట్కాలు ట్రై చేయండి.!
-
Lunch Box Cleaning : లంచ్ బాక్స్ రబ్బరు మురికితో నల్లబడిందా..? ఇలా సింపుల్గా మెరిపించండి.!
-
Positive Energy at Home: ఇంట్లో నెగెటివ్ ఎనర్జీకి చెక్.. ఈ చిట్కాలతో పాజిటివ్ ఎనర్జీ మీ సొంతం.!
-
Mohanlal: ‘ఏజ్ ఈజ్ జస్ట్ నంబర్’.. ఇద్దరు హీరోయిన్లతో డాన్స్ అదరగొట్టిన మలయాళి మెగాస్టార్.!