Rajasthan Congress: అటు గెహ్లాట్ ఇటు పైలట్ మధ్యలో కమల్ నాథ్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
రాజస్థాన్లోని అధికార కాంగ్రెస్ పార్టీలో సంక్షోభం కొనసాగుతోంది. సీఎం అశోక్ గెహ్లాట్, మాజీ డిప్యూటీ సీఎం సచిన్ పైలట్ మధ్య వార్ పతాక స్థాయికి చేరింది. సొంత ప్రభుత్వానికి వ్యతిరేకంగా సచిన్ పైలట్ చేసిన నిరాహార దీక్షతో గెహ్లాట్ ప్రభుత్వానికి తీవ్ర ఇబ్బందిగా మారింది. రాష్ట్రంలో త్వరలో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. ఈ తరుణంలో నేతల మధ్య విభేదాలు ఎన్నికలపై ప్రభావితం చూపిస్తాయని పార్టీ అగ్రనాయకత్వం ఆందోళనలో ఉంది. ప్రస్తుతం అధికారంలో ఉన్న కాంగ్రెస్.. మరోసారి అధికారాన్ని కొనసాగించాలని భావిస్తోంది. అయితే, నేతల మధ్య వర్గపోరు తలనొప్పిగా మారింది.ఈ నేపథ్యంలో ఇద్దరు నేతల మధ్య సయోద్యకు పార్టీ అధిష్టానం చర్యలు చేపట్టింది.
Also Read: Rahul Meets Pawar: మేము ఐక్యంగా ఉన్నాం… ప్రతిపక్షల ఐక్యతపై వ్యూహం
రాజస్థాన్లో పంజాబ్ లాంటి పరాజయాన్ని నివారించేందుకు కాంగ్రెస్ అధిష్టానం సీనియర్ నాయకుడు, మధ్యప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి కమల్ నాథ్ను రంగంలో దింపింది. అశోక్ గెహ్లాట్, సచిన్ పైలట్ మధ్య మధ్యవర్తిత్వం వహించాలని భావిస్తున్నట్లు పార్టీ వర్గాలు తెలిపాయి. కమల్ నాథ్ గురువారం ఢిల్లీలో పైలట్, పార్టీ ప్రధాన కార్యదర్శి కెసి వేణుగోపాల్తో సమావేశమయ్యారు. రెండు వర్గాల మధ్య విభేదాలను పరిష్కరించే మార్గాలపై చర్చించినట్లు వర్గాలు తెలిపాయి. ఈ ఏడాది చివర్లో జరిగే ఎన్నికలకు ముందు తనకంటూ ఒక గొప్ప పాత్రను ఏర్పరచుకునే ఎత్తుగడగా భావించి పైలట్ గత బిజెపి నేతృత్వంలోని ప్రభుత్వ అవినీతికి వ్యతిరేకంగా ఒక రోజంతా నిరాహార దీక్ష చేపట్టారు. వసుంధర రాజే మీద తన సొంత పార్టీ ప్రభుత్వం నిష్క్రియాత్మకంగా ఉందని ఆరోపించారు.
Also Read
పైలట్ నిరాహార దీక్షను పార్టీ వ్యతిరేక చర్యగా పేర్కొంటూ రెండు ప్రకటనలు విడుదల చేసిన కాంగ్రెస్ నాయకత్వం.. ఇప్పుడు తన వైఖరిని మార్చుకుంది. మధ్యేమార్గాన్ని కనుగొనడానికి ప్రయత్నిస్తోంది. పైలట్ తన ఇబ్బందులు, సమస్యలను కమల్ నాథ్, వేణుగోపాల్లకు తెలియజేసినట్లు పార్టీ వర్గాలు తెలిపాయి.గత కొద్ది రోజులుగా వరుస సమావేశాలు నిర్వహిస్తున్న కమల్ నాథ్ ఇరువర్గాలను శాంతింపజేసి సంక్షోభం తలెత్తకుండా పరిష్కారాన్ని కనుగొనే ప్రయత్నం చేస్తున్నారు. రాజస్థాన్లోని సమస్యలు, ఆందోళనలను అర్థం చేసుకోకుండా, కొత్త రాష్ట్ర ఇన్ఛార్జ్ ఇప్పటికే పక్షపాత వైఖరిని అవలంబించిన తీరుతో విసిగిపోయాడని పైలట్ సన్నిహిత వర్గాలు చెబుతున్నాయి.
Also Read:Ambedkar Statue: సాగర తీరంలో రాజ్యాంగ నిర్మాత.. నేడు అంబేడ్కర్ విగ్రహావిష్కరణ
పైలట్ కూడా రాజేకు వ్యతిరేకంగా తన నిరాహార దీక్షను సమర్థించుకున్నాడు. ఇది పార్టీకి వ్యతిరేకం కాదని, ప్రజా ప్రయోజనాల సమస్యలను లేవనెత్తుతున్నానని చెప్పాడు. ఇతర నేతలు ప్రధాని నరేంద్ర మోదీ లేదా ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ వైఫల్యాలను ఆరోపిస్తుంటే పార్టీలో ద్వంద్వ ప్రమాణం ఉందని ఆయన వాదించారు.
కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే మధ్యేమార్గాన్ని కనుగొనడానికి ప్రయత్నించారు. అన్ని వైపులా చీలికను సరిదిద్దాలని కోరుతున్నారు. ముఖ్యంగా పార్టీ కర్ణాటకలో ముఖ్యమైన ఎన్నికల్లో పోరాడుతోంది. గెహ్లాట్ బలహీనత, రాష్ట్రంలో ఆయన ప్రభుత్వం ఎదుర్కొంటున్న భారీ అధికార వ్యతిరేకతపై పార్టీ నాయకత్వం ఆందోళనతో ఉంది. అధికారం కోల్పోతామనే భయం హస్తం నేతల్లో వ్యక్తం అవుతున్నట్లు తెలుస్తోంది. రాష్ట్ర ఎన్నికల వరకు జరిగే సంధిని మధ్యవర్తిత్వం చేయగలదా ? గెహ్లాట్, పైలట్ మళ్లీ కలుస్తారా లేదా అన్నది చూడాలి.
తాజావార్తలు
-
SRH vs GT : గుజరాత్ ధాటికి సన్రైజర్స్ కుప్పకూలింది.. 86 పరుగులకే ఆలౌట్.!
-
Off The Record : ఆపరేషన్ ఆకర్ష్ రివర్స్? టీడీపీ నేతలపై వైసీపీ కన్ను.. ఏపీ రాజకీయాల్లో కొత్త మలుపు!
-
Piyush Goyal: అందరం కలిసి ముందుకెళ్లాల్సిన సమయం వచ్చింది.. పరిశ్రమలకు పీయూష్ గోయల్ హెచ్చరిక
-
Anjali Sardana: 23 ఏళ్ల యువతి.. రూ.1700 కోట్ల సామ్రాజ్యం!
-
Story Board : ప్రధాని మోడీ స్పీచ్ దారి తప్పిందా ? ఏదో చెప్పాలని..ఇంకేదో చెప్పారా ?
ట్రెండింగ్
-
Matt Berger Fossil Discovery : కుక్క వెంట పరిగెత్తి.. 20 లక్షల ఏళ్ల రహస్యం బయటపెట్టిన బాలుడు.!
-
Met Gala 2026 : బంగారు కాళ్లతో మెరిసిన మోడల్.. ప్రాణాల మీదకు తెచ్చిన ఆ ఒక్క పొరపాటు.!
-
క్లచ్ లేకుండానే గేర్ మార్పులు.. ఈ-క్లచ్ టెక్నాలజీతో Honda NX500 లాంచ్..
-
స్టైలిష్ లుక్ + పవర్ ఫుల్ బ్యాటరీతో లాంచ్ కు సిద్దమైన Realme 16T 5G.!
-
TVK Floor Test: మద్రాస్ హైకోర్టు సంచలన తీర్పు.. బలపరీక్షకు ముందే టీవీకేకు కోలుకోలేని దెబ్బ!