Rajasthan Congress: అటు గెహ్లాట్ ఇటు పైలట్ మధ్యలో కమల్ నాథ్
రాజస్థాన్లోని అధికార కాంగ్రెస్ పార్టీలో సంక్షోభం కొనసాగుతోంది. సీఎం అశోక్ గెహ్లాట్, మాజీ డిప్యూటీ సీఎం సచిన్ పైలట్ మధ్య వార్ పతాక స్థాయికి చేరింది. సొంత ప్రభుత్వానికి వ్యతిరేకంగా సచిన్ పైలట్ చేసిన నిరాహార దీక్షతో గెహ్లాట్ ప్రభుత్వానికి తీవ్ర ఇబ్బందిగా మారింది. రాష్ట్రంలో త్వరలో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. ఈ తరుణంలో నేతల మధ్య విభేదాలు ఎన్నికలపై ప్రభావితం చూపిస్తాయని పార్టీ అగ్రనాయకత్వం ఆందోళనలో ఉంది. ప్రస్తుతం అధికారంలో ఉన్న కాంగ్రెస్.. మరోసారి అధికారాన్ని కొనసాగించాలని భావిస్తోంది. అయితే, నేతల మధ్య వర్గపోరు తలనొప్పిగా మారింది.ఈ నేపథ్యంలో ఇద్దరు నేతల మధ్య సయోద్యకు పార్టీ అధిష్టానం చర్యలు చేపట్టింది.
Also Read: Rahul Meets Pawar: మేము ఐక్యంగా ఉన్నాం… ప్రతిపక్షల ఐక్యతపై వ్యూహం
రాజస్థాన్లో పంజాబ్ లాంటి పరాజయాన్ని నివారించేందుకు కాంగ్రెస్ అధిష్టానం సీనియర్ నాయకుడు, మధ్యప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి కమల్ నాథ్ను రంగంలో దింపింది. అశోక్ గెహ్లాట్, సచిన్ పైలట్ మధ్య మధ్యవర్తిత్వం వహించాలని భావిస్తున్నట్లు పార్టీ వర్గాలు తెలిపాయి. కమల్ నాథ్ గురువారం ఢిల్లీలో పైలట్, పార్టీ ప్రధాన కార్యదర్శి కెసి వేణుగోపాల్తో సమావేశమయ్యారు. రెండు వర్గాల మధ్య విభేదాలను పరిష్కరించే మార్గాలపై చర్చించినట్లు వర్గాలు తెలిపాయి. ఈ ఏడాది చివర్లో జరిగే ఎన్నికలకు ముందు తనకంటూ ఒక గొప్ప పాత్రను ఏర్పరచుకునే ఎత్తుగడగా భావించి పైలట్ గత బిజెపి నేతృత్వంలోని ప్రభుత్వ అవినీతికి వ్యతిరేకంగా ఒక రోజంతా నిరాహార దీక్ష చేపట్టారు. వసుంధర రాజే మీద తన సొంత పార్టీ ప్రభుత్వం నిష్క్రియాత్మకంగా ఉందని ఆరోపించారు.
Also Read
- Gujarat Election Results: గుజరాత్ మున్సిపల్ ఎన్నికల్లో బీజేపీ ప్రభంజనం.. అన్ని కార్పొరేషన్లు కైవసం
- China Floods: చైనాను ముంచెత్తిన భారీ వరదలు.. కొట్టుకుపోయిన కార్లు
- WHCD Shooter: నిందితుడి హిట్ లిస్ట్లో కాష్ పటేల్ లేకపోవడానికి కారణమిదే! వెలుగులోకి కీలక విషయాలు
- Mumbai: దారుణం.. కల్మా పఠించలేదని ఇద్దరు సెక్యూరిటీ గార్డులపై దాడి.. రంగంలోకి ఏటీఎస్
పైలట్ నిరాహార దీక్షను పార్టీ వ్యతిరేక చర్యగా పేర్కొంటూ రెండు ప్రకటనలు విడుదల చేసిన కాంగ్రెస్ నాయకత్వం.. ఇప్పుడు తన వైఖరిని మార్చుకుంది. మధ్యేమార్గాన్ని కనుగొనడానికి ప్రయత్నిస్తోంది. పైలట్ తన ఇబ్బందులు, సమస్యలను కమల్ నాథ్, వేణుగోపాల్లకు తెలియజేసినట్లు పార్టీ వర్గాలు తెలిపాయి.గత కొద్ది రోజులుగా వరుస సమావేశాలు నిర్వహిస్తున్న కమల్ నాథ్ ఇరువర్గాలను శాంతింపజేసి సంక్షోభం తలెత్తకుండా పరిష్కారాన్ని కనుగొనే ప్రయత్నం చేస్తున్నారు. రాజస్థాన్లోని సమస్యలు, ఆందోళనలను అర్థం చేసుకోకుండా, కొత్త రాష్ట్ర ఇన్ఛార్జ్ ఇప్పటికే పక్షపాత వైఖరిని అవలంబించిన తీరుతో విసిగిపోయాడని పైలట్ సన్నిహిత వర్గాలు చెబుతున్నాయి.
Also Read:Ambedkar Statue: సాగర తీరంలో రాజ్యాంగ నిర్మాత.. నేడు అంబేడ్కర్ విగ్రహావిష్కరణ
పైలట్ కూడా రాజేకు వ్యతిరేకంగా తన నిరాహార దీక్షను సమర్థించుకున్నాడు. ఇది పార్టీకి వ్యతిరేకం కాదని, ప్రజా ప్రయోజనాల సమస్యలను లేవనెత్తుతున్నానని చెప్పాడు. ఇతర నేతలు ప్రధాని నరేంద్ర మోదీ లేదా ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ వైఫల్యాలను ఆరోపిస్తుంటే పార్టీలో ద్వంద్వ ప్రమాణం ఉందని ఆయన వాదించారు.
కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే మధ్యేమార్గాన్ని కనుగొనడానికి ప్రయత్నించారు. అన్ని వైపులా చీలికను సరిదిద్దాలని కోరుతున్నారు. ముఖ్యంగా పార్టీ కర్ణాటకలో ముఖ్యమైన ఎన్నికల్లో పోరాడుతోంది. గెహ్లాట్ బలహీనత, రాష్ట్రంలో ఆయన ప్రభుత్వం ఎదుర్కొంటున్న భారీ అధికార వ్యతిరేకతపై పార్టీ నాయకత్వం ఆందోళనతో ఉంది. అధికారం కోల్పోతామనే భయం హస్తం నేతల్లో వ్యక్తం అవుతున్నట్లు తెలుస్తోంది. రాష్ట్ర ఎన్నికల వరకు జరిగే సంధిని మధ్యవర్తిత్వం చేయగలదా ? గెహ్లాట్, పైలట్ మళ్లీ కలుస్తారా లేదా అన్నది చూడాలి.
తాజావార్తలు
-
UAE vs Saudi Arabia: ఉప్పు నిప్పుగా యూఏఈ, సౌదీ అరేబియా.. గల్ఫ్లో పవర్ స్ట్రగుల్..
-
PBKS vs RR: స్టోయినిస్ తుఫాన్ ఇన్నింగ్స్.. రాజస్థాన్ ముందు భారీ లక్ష్యం.!
-
Payal Rajput: రిపోర్టర్ ప్రశ్నకు ఏడుస్తూ ఈవెంట్ నుంచి వెళ్లిపోయిన పాయల్ రాజ్పుత్
-
The Lalit Hotel: ఢిల్లీలోని లగ్జరీ హోటల్కు వెయ్యి కోట్ల పెనాల్టీ! ఎందుకో తెలుసా?
-
S-400 air defence system: పాకిస్తాన్కు చుక్కలే.. మరో ఎస్-400 భారత్ రాబోతోంది
ట్రెండింగ్
-
50 గంటల బ్యాటరీ, IP54 రేటింగ్తో Vivo TWS 5i లాంచ్.. ధర కూడా బడ్జెట్ లోనే.!
-
13 అంగుళాల 3.5K PureSight Pro డిస్ప్లే, AI ఫీచర్లతో Lenovo Idea Tab Pro Gen 2 లాంచ్.. ధర ఎంతంటే.?
-
7200mAh భారీ బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో మిడ్ రేంజ్ బడ్జెట్లో Vivo Y500s లాంచ్.. ఫీచర్స్ ఇవే.!
-
10200mAh భారీ బ్యాటరీ, IP68 + IP69 రేటింగ్స్, 120Hz AMOLED డిస్ప్లేతో vivo Y600 Pro లాంచ్.. ధర ఎంతంటే.?
-
Vaibhav Sooryavanshi: ఎంతకు తెగించావ్ బుడ్డోడా.. సెల్ఫీ కావాలంటే రూ.100 ఇవ్వాల్సిందేనా.. వైరల్ వీడియో