Rajasthan: మద్యపానం చాలా కుటుంబాల్లో నిప్పులు పోస్తోంది. మద్యపానం అలవాటు వల్ల కుటుంబాలు విచ్ఛిన్నం అవడమే కాకుండా, ఆత్మహత్యలు, హత్యలకు దారి తీస్తున్నాయి. భార్యభర్తల మధ్య గొడవలకు మధ్యపానం కారణం అవుతోంది. క్షణికావేశం వల్ల కుటుంబాల్లో ఆత్మహత్యలు జరుగుతున్నాయి. ఇదిలా ఉంటే తాజాగా రాజస్థాన్ రాష్ట్రంలో కూడా ఇలాంటి గొడవ కారణంగా భర్త సూసైడ్ చేసుకున్నాడు.
Jaipur : రాజస్థాన్లో దారుణం చోటు చేసుకుంది. వృద్ధురాలిని చంపి యువకుడు మాంసాన్ని తిన్నాడు. నిందితుడిని అదుపులోకి తీసుకుని పోలీసులు ఆస్పత్రికి తరలించారు.
రాజస్థాన్లోని ధోల్పూర్ జిల్లాలో అమానుష ఘటన చోటుచేసుకుంది. ఏడేళ్ల బాలికను మధ్యవయస్కుడైన వ్యక్తికి ఇచ్చి వివాహం చేసేందుకు రూ.4.50 లక్షలకు ఆ చిన్నారి విక్రయించినట్లు పోలీసులు వెల్లడించారు.
Congress: కర్ణాటకలో గెలిచిన కాంగ్రెస్ చాలా ఉత్సాహంగా ఉంది. గత 34 ఏళ్లలో ఎన్నడూ లేని విధంగా ఓట్లను, సీట్లను సంపాదించింది. మొత్తం 224 స్థానాల్లో పోటీ చేస్తే 135 సీట్లలో గెలుపొందింది. బీజేపీ కేవలం 66 సీట్లకు మాత్రమే పరిమితం అయింది. అంతకుముందు ఏడాది హిమాచల్ ప్రదేశ్ లో కూడా కాంగ్రెస్ అధికారం చేజిక్కించుకుంది. ఇదిలా ఉంటే మరింత దూకుడుగా ఈ ఏడాది చివర్లో నాలుగు రాష్ట్రాల ఎన్నికలపై దృష్టి సారించింది. కర్ణాటక ఊపునే ఈ…
Rajasthan: బోరుబావి ప్రమాదాలు మనం చాలా సార్లు చూశాం. బోరుబావిలో పడిపోయిన చిన్నారుల్లో చాలా మంది ప్రాణాలు కోల్పోయిన వారే ఉన్నారు. అధికారులు ఎన్ని రోజులు ప్రయత్నించినా చివరకు వారి మృతదేహాలు మాత్రమే బయటకు వచ్చేవి. కానీ రాజస్థాన్ లో ఓ 9 ఏళ్ల పిల్లాడు బోరుబావి నుంచి ప్రాణాలతో బయటపడ్డాడు. ఈ ఘటన రాజస్థార్ లోని జైపూర్ జిల్లాలో చోటు చేసుకుంది.
Rajasthan: అవినీతి అధికారులు, అవినీతి డబ్బును దాచేందుకు ఏకంగా ప్రభుత్వ భవనాన్నే వాడకున్నారు. ఈ ఘటన రాజస్థాన్ రాష్ట్రంలో చోటు చేసుకుంది. రాజధాని జైపూర్ నగరంలోని యోజన భవన్లోని బేస్మెంట్లో తాళం వేసి ఉన్న అల్మారా నుంచి ₹ 2.31 కోట్ల నగదు, కిలో బంగారం స్వాధీనం చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు. ఈ బేస్మెంట్లోకి తరుచుగా వెళ్లే ఏడుగురు ప్రభుత్వ అధికారులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
రాజస్థాన్ అసెంబ్లీ ఎన్నికలకు ముందు కాంగ్రెస్ పార్టీకి భారీ షాక్ తగిలింది. కేంద్ర మాజీ మంత్రి సుభాష్ మహరియా కాంగ్రెస్ను వీడి నేడు బీజేపీలో చేరే అవకాశం ఉంది. కాంగ్రెస్ పార్టీని వీడుతున్నట్లు సీనియర్ నాయకుడు, కేంద్ర మాజీ మంత్రి సుభాష్ మహరియా ప్రకటించారు.
PM Modi: 2008 జైపూర్ వరస పేలుళ్ల నిందితులను నిర్దోషిగా విడుదల చేయడాన్ని ప్రధాని నరేంద్రమోడీ తప్పపట్టారు. రాజస్థాన్ లోని కాంగ్రెస్ ప్రభుత్వం బుజ్జగింపు విధానాన్ని అవలంభిస్తోందని, ఉగ్రవాదులపై మెతక వైఖరి ప్రదర్శిస్తోందని ప్రధాని ఆరోపించారు. రాజస్థాన్లోని అబురోడ్లో జరిగిన ర్యాలీలో ఆయన ప్రసంగిస్తూ,
Sachin Pilot: రాజస్థాన్ కాంగ్రెస్ లుకలుకలు కొనసాగుతూనే ఉన్నాయి. సీఎం అశోక్ గెహ్లాట్, యువనేత సచిల్ పైలెట్ల మధ్య విబేధాలు తారాస్థాయికి చేరాయి. రాష్ట్రంలో అవినీతి సమస్యలపై సచిన్ పైలట్ అజ్మీర్ నుంచి జైపూర్ వరకు మే 11న ‘జన్ సంఘర్ష్ యాత్ర’ చేపడుతున్నట్లు ప్రకటించారు. ఈ నేపథ్యంలో ఆయన సీఎం గెహ్లాట్ పై సంచలన వ్యాఖ్యలు చేశారు. సీఎం అశోక్ గెహ్లాట్ అధిష్టానం సోనియాగాంధీ కాదని, బీజేపీ నేత, మాజీ ముఖ్యమంత్రి వసుంధర రాజే అని…
Lithium: ప్రపంచంలో ప్రస్తుతం అత్యంత ఖరీదైన, విలువైన ఖనిజంగా ఉన్న లిథియం నిల్వలు భారతదేశంలో బయటపడుతున్నాయి. కొన్ని నెలల క్రితం జమ్మూ కాశ్మీర్ లోని రియాసి జిల్లాలో భారీ లిథియం నిల్వలను కనుగొన్నట్లు జియోలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా(జీఎస్ఐ) వెల్లడించింది. ఇదిలా ఉంటే జమ్మూ కాశ్మీర్ తర్వాత రాజస్థాన్ లో కూడా లిథియం నిల్వలను కనుగొన్నారు. నాగౌర్ జిల్లాలోని దేగానాలో ఈ లిథియం నిల్వలు కనుగొన్నట్లు తెలిపింది.