India Oil Reserves: గల్ఫ్ నుంచి చమురు రాకుంటే, భారత్ వద్ద ఎన్ని రోజులకు సరిపడే నిల్వలు ఉన్నాయి.?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
India Oil Reserves: ఇరాన్పై యూఎస్-ఇజ్రాయిల్ దాడులు మధ్యప్రాచ్యాన్ని ఉద్రిక్తతల్లోకి నెట్టాయి. ఈ దాడుల్లో ఇరాన్ సుప్రీంలీడర్ ఖమేనీ మరణం తర్వాత ఆందోళనలు తారాస్థాయికి చేరాయి. ఈ యుద్ధం కేవలం రెండు దేశాలకు మాత్రమే పరిమితం కాకుండా, గల్ఫ్ లోని యూఏఈ, సౌదీ అరేబియా, కువైట్, ఖతార్, బహ్రైయిన్ వంటి దేశాలకు కూడా విస్తరించింది. ఇరాన్ ఈ దేశాల్లోని అమెరికన్ స్థావరాలపై మిస్సైల్స్, డ్రోన్లలో దాడులకు తెగబడుతోంది. దుబాయ్, దోహా, అబుదాబీ వంటి సిటీలపై దాడులు చేస్తోంది.
హార్ముజ్ జలసంధి మూసివేత, చమురు రవాణాకు ఇబ్బందులు:
Also Read
- Ayodhya: అయోధ్య రామాలయ విరాళాల కుంభకోణంలో కీలక పరిణామం.. ట్రస్ట్ కీలక సభ్యులు రాజీనామా..
- CM Yogi: "ఎవ్వరినీ వదిలి పెట్టను".. అయోధ్య విరాళాల దుర్వినియోగంపై సీఎం యోగి ఆగ్రహం..
- Ketan Murder Case: కేతన్ హత్య కేసులో కొత్త ట్విస్ట్.. ఇద్దరు తల్లుల మధ్య మాటల యుద్ధం!
- Bank Fraud: భారీ బ్యాంకు మోసం.. రూ.3.66 కోట్ల ఇన్సూరెన్స్ పాలసీలను అటాచ్ చేసిన ఈడీ.!
ఇదిలా ఉంటే, ప్రపంచ చమురు రవాణాకు అత్యంత కీలకమైన ‘‘హార్ముజ్ జలసంధి’’ని ఇరాన్ మూసేసింది. ఇది భారత్తో పాటు ఇతర ఆసియా దేశాలను తీవ్రంగా ప్రభావితం చేస్తుంది. గల్ఫ్ నుంచి వచ్చే చమురు ఈ మార్గం ద్వారానే రావాల్సి ఉంటుంది. ప్రపంచంలోని రోజువారీ చమురు వినియోగంలో 20 శాతం ఈ హార్మూజ్ జలసంధి నుంచే ప్రయాణిస్తుంటుంది.ఈ మార్గం గుండా వచ్చే చమురు ఎగుమతుల్లో 82 శాతం ఆసియాకు వెళ్తున్నాయి. ఇందులో భారత్, చైనా, జపాన్, దక్షిణ కొరియా వాటా ఏకంగా 67 శాతం ఉంది. భారత్ ముడి చమురులో 90 శాతం చమురును మిడిల్ ఈస్ట్ దేశాల నుంచి దిగుమతి చేసుకుంటుంది. ఇందులో 40 శాతం హార్మూజ్ జలసంధి నుంచే వస్తున్నాయి.
భారత్ దగ్గర రోజులకు నిల్వలు ఉన్నాయి?
పెట్రోలియం మంత్రి హర్దీప్ సింగ్ పూరి చెప్పిన వివరాల ప్రకారం, ఏదైనా సంక్షోభం తలెత్తితే భారత్ వద్ద 74 రోజులకు సరిపడా చమురు నిల్వలు ఉన్నాయి. అయితే, మొత్తం పెట్రోలియం నిల్వల్ని 90 రోజులకు పెంచాలని కేంద్రం భావిస్తోంది. ఏపీ, కర్ణాటక రాష్ట్రాల్లోని భూగర్భంలోని గుహాల్లో భద్రపరిచిన స్ట్రాటజిక్ పెట్రోలియం రిజర్వ్స్ (SPR) సుమారుగా 9.5 రోజులకు సరిపోతుంది. దీనికి తోడు చమురు మార్కెటింగ్ కంపెనీల వద్ద అందుబాటులో ఉన్న ముడి చమురు, పెట్రోలియం ఉత్పత్తుల నిల్వ సామర్థ్యం సుమారుగా 67 రోజులకు సరిపడా ఉంది.
ఒక బారెల్ ధర ఒక డాలర్ పెరిగితే భారత్ ఏడాదికి 1.4 బిలియన్ డాలర్లు అదనపు ఖర్చు భరించాల్సి వస్తుంది. దీనికి తోడు గ్యాస్ ధరలు కూడా పెరుగుతాయి. భారత్ తన అవసరాలకు అవసరమైన గ్యాస్లో 50 శాతం దిగుమతులపైనే ఆధారపడి ఉంది. ప్రస్తుతం, హార్ముజ్ జలసంధి మూతపడినా, రష్యన్ ఆయిల్ భారత్కు అందుబాటులో ఉంటుందని నిపుణులు చెబుతున్నారు. దీనితోడు వెనిజులా ఆయిల్ కూడా భారత్ కొనుగోలు చేస్తోంది. ఇప్పటికప్పుడు భారత్కు వచ్చే ఇబ్బందులు లేవు, కానీ దీర్ఘకాలం హార్ముజ్ జలసంధి మూతపడితే మాత్రం చమురు ధరలు పెరిగే అవకాశ ఉంది.
తాజావార్తలు
-
Home Freshness Tips: ఇంట్లో దుర్వాసనకు చెక్.. ఎయిర్ ఫ్రెషనర్లు లేకుండానే సింపుల్ చిట్కాలతో ఇంటిని ఫ్రెష్గా ఉంచండి.!
-
Saikrishna Lockup Death: సాయికృష్ణ లాకప్ డెత్ కేసులో సిట్ దూకుడు.. మరో ఇద్దరు పోలీసుల కోసం గాలింపు!
-
Ayodhya: అయోధ్య రామాలయ విరాళాల కుంభకోణంలో కీలక పరిణామం.. ట్రస్ట్ కీలక సభ్యులు రాజీనామా..
-
Women’s World Cup 2026: రన్రేట్ ప్లస్.. కానీ ఆసీస్తో నెక్స్ట్ మ్యాచ్! సెమీఫైనల్ చేరాలంటే భారత్కు ఉన్న అవకాశాలివే..
-
CM Yogi: “ఎవ్వరినీ వదిలి పెట్టను”.. అయోధ్య విరాళాల దుర్వినియోగంపై సీఎం యోగి ఆగ్రహం..
ట్రెండింగ్
-
Vaibhav Sooryavanshi Records: ఐర్లాండ్తో డెబ్యూ.. వైభవ్ ముందున్న 5 రికార్డులు ఇవే.!
-
Viral Video: పోలీస్ స్టేషన్లో సహోద్యోగిని ముద్దుపెట్టుకున్న మహిళా కానిస్టేబుల్.. చివరకు.?
-
రూ.9,999కే Lava Smart 4 Plus లాంచ్.. 6.75 అంగుళాల డిస్ప్లే, 5000mAh బ్యాటరీతో అదిరిపోయే ఫీచర్లు.!
-
Pesara Garelu Recipe: బయట క్రిస్పీగా, లోపల సాఫ్ట్గా ఉండే రుచికరమైన స్నాక్ “పెసర గారెలు” చేసేయండి ఇలా.!
-
Baahubali 3 Announced: ఇండియన్ సినీ ప్రియులకు బిగ్ సర్ప్రైజ్.. ‘బాహుబలి 3′ వస్తోంది!