IND vs WI: గెలిపించిన శాంసన్.. గర్జించిన భారత్..! విండీస్పై 5 వికెట్ల తేడాతో ఘనవిజయం.!
- సంజు శాంసన్ వీరోచిత ఇన్నింగ్స్తో భారత్ సెమీఫైనల్కు
- 196 పరుగుల లక్ష్యాన్ని ఛేదించిన టీమ్ ఇండియా
- తిలక్ వర్మ, శివం దూబే కీలక పాత్ర
- పోరాడి ఓడిన వెస్టిండీస్.. వరల్డ్ కప్ ప్రయాణం ముగింపు
T20 World Cup : టీ20 వరల్డ్ కప్లో భారత్ మరో అద్భుత విజయాన్ని నమోదు చేసింది. ఉత్కంఠభరితంగా సాగిన పోరులో వెస్టిండీస్ను 5 వికెట్ల తేడాతో చిత్తు చేసి భారత్ సెమీఫైనల్కు దూసుకెళ్లింది. సంజు శాంసన్ తన కెరీర్లోనే చిరస్మరణీయ ఇన్నింగ్స్తో భారత్ను గెలుపు తీరాలకు చేర్చాడు. 196 పరుగుల భారీ లక్ష్యాన్ని భారత్ మరో 4 బంతులు మిగిలి ఉండగానే ఛేదించింది.
భారత ఇన్నింగ్స్ ఆరంభంలోనే అభిషేక్ శర్మ (10), ఇషాన్ కిషన్ (10) వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది. ఈ దశలో క్రీజులోకి వచ్చిన సంజు శాంసన్, కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్తో కలిసి ఇన్నింగ్స్ను చక్కదిద్దాడు. సూర్య (18) త్వరగానే అవుట్ అయినప్పటికీ, శాంసన్ ఏమాత్రం తడబడకుండా విండీస్ బౌలర్లపై విరుచుకుపడ్డాడు. కేవలం 50 బంతుల్లో 12 ఫోర్లు, 4 సిక్సర్లతో 97 పరుగులు చేసి అజేయంగా నిలిచాడు. టీ20 వరల్డ్ కప్ ఛేజింగ్లో ఒక భారత బ్యాటర్ చేసిన అత్యధిక స్కోరుగా శాంసన్ రికార్డు సృష్టించాడు.
Also Read
- RCB vs GT : బెంగళూరును చిత్తు చేసిన టైటాన్స్.. గిల్ మెరుపులు
- Muttiah Muralitharan: "ఐపీఎల్ అంటేనే వ్యాపారం.. క్రికెట్ ఎక్కడుంది?".. SRH కోచ్ షాకింగ్ కామెంట్స్!
- RCB Vs GT: ఆకాశమే హద్దుగా చెలరేగిన కోహ్లీ.. మరో రికార్డు బద్దలు కొట్టిన విరాట్..
- Jasprit Bumrah: బుమ్రా బౌలింగ్లో పస తగ్గిందా..? ఈ IPL లో విఫలం అవ్వడానికి కారణం ఇదే..
శాంసన్కు తోడుగా యువ ఆటగాడు తిలక్ వర్మ (15 బంతుల్లో 27 పరుగులు 4 ఫోర్లు, 1 సిక్సర్) విలువైన ఇన్నింగ్స్ ఆడాడు. ఆఖర్లో హార్దిక్ పాండ్యా (17) కీలక సమయంలో అవుట్ అవ్వగా, శివం దూబే (8*) వరుసగా రెండు ఫోర్లు బాది ఒత్తిడిని తగ్గించాడు. చివరి ఓవర్లో 7 పరుగులు అవసరమైన దశలో రొమారియో షెపర్డ్ బౌలింగ్లో శాంసన్ ఒక సిక్సర్, ఒక ఫోర్ బాది 199 పరుగులతో విజయకేతనం ఎగురవేశాడు.
అంతకుముందు బ్యాటింగ్ చేసిన వెస్టిండీస్ నిర్ణీత 20 ఓవర్లలో 195 పరుగుల భారీ స్కోరు సాధించింది. విండీస్ బ్యాటర్లు భారత బౌలర్లను దీటుగా ఎదుర్కొన్నప్పటికీ, భారత బ్యాటింగ్ పటిమ ముందు ఆ స్కోరు సరిపోలేదు. విండీస్ బౌలర్లలో షమర్ జోసెఫ్, జేసన్ హోల్డర్ తలో రెండు వికెట్లు తీశారు. అయితే ఆఖరి ఓవర్లలో ఓవర్ రేట్ పెనాల్టీ కారణంగా విండీస్ అదనపు ఫీల్డర్ను సర్కిల్లో ఉంచాల్సి రావడం భారత్కు కలిసొచ్చింది. ఈ విజయంతో వెస్టిండీస్ వరల్డ్ కప్ ప్రయాణం ముగియగా, భారత్ సగర్వంగా సెమీఫైనల్లో అడుగుపెట్టింది. అత ఇన్నింగ్స్ ఆడిన సంజు శాంసన్ మ్యాచ్ హీరోగా నిలిచాడు. గెలుపు అనంతరం శాంసన్ మోకాళ్లపై కూర్చుని తన హెల్మెట్ తీసి ప్రార్థన చేసుకున్న దృశ్యం అభిమానులను ఆకట్టుకుంది.
తాజావార్తలు
-
Petrol, Diesel Price: భారీగా పెరిగిన ఎల్పీజీ సిలిండర్ ధరలు.. పెట్రోల్, డీజిల్ పెరుగుదలపై కేంద్రం క్లారిటీ!
-
Bitter Gourd Chips Recipe: కారం కారంగా కరకరలాడే కాకరకాయ చిప్స్.. చేదు లేకుండా ఇంట్లోనే సులభంగా తయారు చేసే ప్రత్యేక రెసిపీ..
-
Shruti Haasan : హీరోయిన్గా కంటే ఐటంగర్ల్గా ఎక్కువ సంపాదిస్తున్న శృతి
-
AP Student Suicide in US: అమెరికాలో కర్నూలు యువకుడు ఆత్మహత్య.. పిస్టల్తో కాల్చుకుని..
-
Jason Holder: కేజీ నా దగ్గరే ఉన్నాడు.. రజత్ పాటీదార్ వివాదాస్పద క్యాచ్పై స్పందించిన హోల్డర్!
ట్రెండింగ్
-
3.4K డిస్ప్లే, 13380mAh బ్యాటరీ, క్రయో-వెలాసిటీ కూలింగ్ టెక్నాలజీతో OnePlus Pad 4 లాంచ్.!
-
స్టైలిష్ కలర్స్తో iQOO Neo 10 కొత్త వేరియంట్లు లాంచ్.. ధర ఎంతంటే.?
-
స్టైల్ + టెక్.. Motorola ‘Brilliant Collection’లో సిగ్నేచర్ స్మార్ట్ ఫోన్, మోటో బడ్స్ 2.!
-
Viral Video: రైలుకింద పడ్డ చిన్నారి.. ప్రాణాలను పణంగా పెట్టి కాపాడిన తండ్రి.!
-
Happy Birthday Rohit Sharma: రికార్డుల రారాజు.. ‘హిట్ మ్యాన్’ రోహిత్ శర్మకు పుట్టినరోజు శుభాకంక్షలు.!