IND vs WI: గెలిపించిన శాంసన్.. గర్జించిన భారత్..! విండీస్పై 5 వికెట్ల తేడాతో ఘనవిజయం.!
- సంజు శాంసన్ వీరోచిత ఇన్నింగ్స్తో భారత్ సెమీఫైనల్కు
- 196 పరుగుల లక్ష్యాన్ని ఛేదించిన టీమ్ ఇండియా
- తిలక్ వర్మ, శివం దూబే కీలక పాత్ర
- పోరాడి ఓడిన వెస్టిండీస్.. వరల్డ్ కప్ ప్రయాణం ముగింపు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
T20 World Cup : టీ20 వరల్డ్ కప్లో భారత్ మరో అద్భుత విజయాన్ని నమోదు చేసింది. ఉత్కంఠభరితంగా సాగిన పోరులో వెస్టిండీస్ను 5 వికెట్ల తేడాతో చిత్తు చేసి భారత్ సెమీఫైనల్కు దూసుకెళ్లింది. సంజు శాంసన్ తన కెరీర్లోనే చిరస్మరణీయ ఇన్నింగ్స్తో భారత్ను గెలుపు తీరాలకు చేర్చాడు. 196 పరుగుల భారీ లక్ష్యాన్ని భారత్ మరో 4 బంతులు మిగిలి ఉండగానే ఛేదించింది.
భారత ఇన్నింగ్స్ ఆరంభంలోనే అభిషేక్ శర్మ (10), ఇషాన్ కిషన్ (10) వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది. ఈ దశలో క్రీజులోకి వచ్చిన సంజు శాంసన్, కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్తో కలిసి ఇన్నింగ్స్ను చక్కదిద్దాడు. సూర్య (18) త్వరగానే అవుట్ అయినప్పటికీ, శాంసన్ ఏమాత్రం తడబడకుండా విండీస్ బౌలర్లపై విరుచుకుపడ్డాడు. కేవలం 50 బంతుల్లో 12 ఫోర్లు, 4 సిక్సర్లతో 97 పరుగులు చేసి అజేయంగా నిలిచాడు. టీ20 వరల్డ్ కప్ ఛేజింగ్లో ఒక భారత బ్యాటర్ చేసిన అత్యధిక స్కోరుగా శాంసన్ రికార్డు సృష్టించాడు.
Also Read
- ENG Vs IND 3rd ODI: మెన్ ఇన్ బ్లూ టార్గెట్ లార్డ్స్.. 22 ఏళ్ల నిరీక్షణకు తెరదించే సమయం వచ్చేసింది..
- Rohit Sharma Retirement: బిగ్ షాక్.. సెలక్టర్లకు ఎదురుతిరిగిన రోహిత్ శర్మ.. జైస్వాల్ కోసం గిల్ త్యాగం!
- Kapil Dev: "బాధ ఎందుకు.. పండుగలా సెలబ్రేట్ చేసుకోవాలి".. రోహిత్ రిటైర్మెంట్పై కపిల్ దేవ్ సంచలన వ్యాఖ్యలు..
- IND vs ENG 3rd ODI: టీమిండియా తుది జట్టుపై ఉత్కంఠ.. ఆ ఇద్దరు స్టార్లకు నిరాశే.. రోహిత్పైనే అందరి చూపు!
శాంసన్కు తోడుగా యువ ఆటగాడు తిలక్ వర్మ (15 బంతుల్లో 27 పరుగులు 4 ఫోర్లు, 1 సిక్సర్) విలువైన ఇన్నింగ్స్ ఆడాడు. ఆఖర్లో హార్దిక్ పాండ్యా (17) కీలక సమయంలో అవుట్ అవ్వగా, శివం దూబే (8*) వరుసగా రెండు ఫోర్లు బాది ఒత్తిడిని తగ్గించాడు. చివరి ఓవర్లో 7 పరుగులు అవసరమైన దశలో రొమారియో షెపర్డ్ బౌలింగ్లో శాంసన్ ఒక సిక్సర్, ఒక ఫోర్ బాది 199 పరుగులతో విజయకేతనం ఎగురవేశాడు.
అంతకుముందు బ్యాటింగ్ చేసిన వెస్టిండీస్ నిర్ణీత 20 ఓవర్లలో 195 పరుగుల భారీ స్కోరు సాధించింది. విండీస్ బ్యాటర్లు భారత బౌలర్లను దీటుగా ఎదుర్కొన్నప్పటికీ, భారత బ్యాటింగ్ పటిమ ముందు ఆ స్కోరు సరిపోలేదు. విండీస్ బౌలర్లలో షమర్ జోసెఫ్, జేసన్ హోల్డర్ తలో రెండు వికెట్లు తీశారు. అయితే ఆఖరి ఓవర్లలో ఓవర్ రేట్ పెనాల్టీ కారణంగా విండీస్ అదనపు ఫీల్డర్ను సర్కిల్లో ఉంచాల్సి రావడం భారత్కు కలిసొచ్చింది. ఈ విజయంతో వెస్టిండీస్ వరల్డ్ కప్ ప్రయాణం ముగియగా, భారత్ సగర్వంగా సెమీఫైనల్లో అడుగుపెట్టింది. అత ఇన్నింగ్స్ ఆడిన సంజు శాంసన్ మ్యాచ్ హీరోగా నిలిచాడు. గెలుపు అనంతరం శాంసన్ మోకాళ్లపై కూర్చుని తన హెల్మెట్ తీసి ప్రార్థన చేసుకున్న దృశ్యం అభిమానులను ఆకట్టుకుంది.
తాజావార్తలు
-
Anna Hazare: ‘‘సహనాన్ని పరీక్షించొద్దు’’.. సోనమ్ వాంగ్చుక్కు అన్నాహజారే మద్దతు..
-
72nd National Film Awards: ఉత్తమ నటుడు కిరీటం వీళ్లిద్దరికీ.. జాతీయ ఉత్తమ నటిగా!
-
Abhishek Banerjee: “తిరిగి రండి, గంటలో రాజీనామా చేస్తా”.. అభిషేక్ బెనర్జీ సంచలన ప్రకటన..
-
Bahadurguda Land Row : భూముల దగ్గర మళ్లీ ఉద్రిక్తత.. పోలీసులపై రాళ్లు, కుర్చీలు విసిరిన రైతులు..
-
ENG Vs IND 3rd ODI: మెన్ ఇన్ బ్లూ టార్గెట్ లార్డ్స్.. 22 ఏళ్ల నిరీక్షణకు తెరదించే సమయం వచ్చేసింది..
ట్రెండింగ్
-
IND vs ENG 3rd ODI: టీమిండియా తుది జట్టుపై ఉత్కంఠ.. ఆ ఇద్దరు స్టార్లకు నిరాశే.. రోహిత్పైనే అందరి చూపు!
-
IND vs ENG 3rd ODI: అభిమానులకు అలర్ట్.. మూడో వన్డే మ్యాచ్ సమయంలో మార్పు.. లైవ్ స్ట్రీమింగ్ డీటెయిల్స్ ఇవే!
-
Android vs iPhone ఫైట్కు కొత్త ట్విస్ట్.! మెస్సీ కోసం Samsung, రొనాల్డో కోసం iPhone.. లగ్జరీ ఫోన్లు విడుదల..!
-
Jeera Rice: రెస్టారెంట్ స్టైల్ ‘జీరా రైస్’ ఇంట్లోనే.. వంట రాని వాళ్లు కూడా 5 నిమిషాల్లో సులువుగా చేసేయండి ఇలా..!
-
Rohit Sharma Retirement: రోహిత్ శర్మ అభిమానులకు శుభవార్త.. రిటైర్మెంట్ లేనట్టే!