Vande Bharat: రాజస్థాన్లో తొలి వందేభారత్ రైలు.. ఆ స్టేషన్లలో మాత్రమే ఆగుతుంది!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
రాజస్థాన్లో తొలి వందేభారత్ ఎక్స్ప్రెస్ రైలును బుధవారం ప్రధాని నరేంద్ర మోదీ జెండా ఊపి ప్రారంభించనున్నారు. ప్రధాని మోడీ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ఈ రైలును జెండా ఊపి ప్రారంభిస్తారు. ఈ రైలు రెగ్యులర్ సర్వీస్ లు రేపటి నుంచి ప్రారంభమవుతాయి. ఈ రైలు అజ్మీర్ నుంచి న్యూఢిల్లీ మధ్య నడుస్తుంది. జైపూర్, అల్వార్, గుర్గావ్లలో వందేభారత్ రైలు ఆగుతుంది. జైపూర్-ఢిల్లీ కాంట్ వందే భారత్ ప్రారంభ ప్రత్యేక రైలు సర్వీస్ జైపూర్ నుండి ఉదయం 11.00 గంటలకు బయలుదేరి సాయంత్రం 4 గంటలకు ఢిల్లీ చేరుకుంటుందని నార్త్ వెస్ట్రన్ రైల్వే అధికారులు తెలిపారు.
Also Read: Firing At Punjab : పంజాబ్ మిలిటరీ స్టేషన్లో కాల్పులు.. నలుగురు మృతి
వందే భారత్ ఎక్స్ప్రెస్ అజ్మీర్ నుండి ఢిల్లీ వరకు 5 గంటల 15 నిమిషాల్లో చేరుకుంటుంది. ప్రస్తుతం ఈ మార్గంలో అత్యంత వేగవంతమైన రైలు శతాబ్ది ఎక్స్ప్రెస్. ఇది ఢిల్లీ నుండి అజ్మీర్ మధ్య 6 గంటల 15 నిమిషాలలో ప్రయాణిస్తుంది. అందువల్ల వందే భారత్ ఎక్స్ప్రెస్ ఆ మార్గంలో నడుస్తున్న ప్రస్తుత వేగవంతమైన రైలు కంటే 60 నిమిషాలు వేగంగా ఉంటుంది.
Also Read
- Delhi: కేతన్ హత్య తరహాలో మరో ఇల్లాలి కుట్ర.. దేశ రాజధానిలో కలకలం
- Petrol-Diesel: వాహనదారులకు కేంద్రం శుభవార్త.. జూలై 1 నుంచి ఆంక్షలు ఎత్తివేత
- Mumbai: ఒడ్డుకు కొట్టుకొచ్చిన భారీ తిమింగలం.. రెస్క్యూ ఆపరేషన్ ఫెయిల్.. చివరికిలా..!
- Ketan Agarwal Case: చదువులో జీరో.. ఇంటర్ ఫెయిల్ తర్వాత సియా ఏం చేసిందంటే..!
అజ్మీర్-ఢిల్లీ వందే భారత్ ఎక్స్ప్రెస్ హై రైజ్ ఓవర్ హెడ్ ఎలక్ట్రిక్ (OHE) సెక్టార్లో ప్రపంచంలోనే మొదటి సెమీ-హై స్పీడ్ ప్యాసింజర్ రైలు అవుతుంది. ఈ రైలు పుష్కర్, అజ్మీర్ షరీఫ్ దర్గాతో సహా రాజస్థాన్లోని ప్రధాన పర్యాటక ప్రదేశాలతో కనెక్టివిటీని మెరుగుపరుస్తుందని ప్రధాన మంత్రి కార్యాలయం( PMO) తెలిపింది. మెరుగైన కనెక్టివిటీ ఈ ప్రాంతంలో సామాజిక-ఆర్థిక అభివృద్ధిని కూడా పెంచుతుంది.
Also Read:Mahaboobnagar Crime: ఆసుపత్రికి క్యూ కడుతున్న కల్తీ కల్లు భాదితులు.. ఇద్దరు మృతి
కొద్ది రోజుల క్రితం, ఏప్రిల్ 8న సికింద్రాబాద్-తిరుపతి వందే భారత్ ఎక్స్ప్రెస్ మరియు చెన్నై-కోయంబత్తూరు వందే భారత్ ఎక్స్ప్రెస్ రైళ్లను ప్రధాని మోదీ జెండా ఊపి ప్రారంభించారు. సికింద్రాబాద్-తిరుపతి వందే భారత్ రైలును ప్రవేశపెట్టడం వల్ల తెలంగాణలోని సికింద్రాబాద్ మరియు పొరుగున ఉన్న ఆంధ్రప్రదేశ్లోని తిరుపతి నగరాల మధ్య ప్రయాణ సమయం సుమారు మూడున్నర గంటలు తగ్గుతుంది, ఇది ముఖ్యంగా యాత్రికులకు ప్రయోజనం చేకూరుస్తుంది.
తాజావార్తలు
-
WhatsApp Custom Username: ప్రైవసీ బూస్ట్!.. వాట్సాప్ 3 బిలియన్ యూజర్ల కోసం కస్టమ్ యూజర్నేమ్.. పూర్తి వివరాలు
-
Ben Stokes: “నేను మానసికంగా అలసిపోయాను”.. రిటైర్మెంట్పై నోరు విప్పిన బెన్ స్టోక్స్..
-
Biggest Multistarrer : 18 ఏళ్ల తర్వాత కలిసి నటించబోతున్న ఇద్దరు స్టార్ హీరోలు
-
Anganwadi Working Hours: అంగన్వాడీ కేంద్రాల వేళల్లో కీలక మార్పు.. ఉత్తర్వులు జారీ
-
Super Subbu: బోల్డ్ సబ్జెక్టే.. కానీ ఫ్యామిలీతో చూడొచ్చు.. ‘సూపర్ సుబ్బు’పై సందీప్ కిషన్ హామీ
ట్రెండింగ్
-
PBKS Star: పంజాబ్ కింగ్స్ స్టార్ క్రికెటర్పై ఎఫ్ఐఆర్ నమోదు.. వంట మనిషిపై..!
-
Clean and Clutter Free Home: బిజీ లైఫ్లోనూ క్లీన్ హోమ్ సాధ్యం.. పరిశుభ్రమైన ఇంటి రహస్యం ఇదే.!
-
6000mAh భారీ బ్యాటరీ, Snapdragon 6 Gen 3 ప్రాసెసర్తో Samsung Galaxy M47 5G లాంచ్.! ధర ఎంతంటే.?
-
టీవీ కాదు భయ్యో.. అంతకు మించి.! AI పవర్, True RGB డిస్ప్లేతో Sony BRAVIA 9 II, BRAVIA 7 II భారత్లో లాంచ్.!
-
Ragi Milk: శరీరాన్ని సహజంగా చల్లగా ఉంచే సూపర్ డ్రింక్ ‘రాగి మిల్క్’.. ఇంట్లోనే చేసేయండి ఇలా.!