Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • వెబ్ స్టోరీలు
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
close
Topics
  • IPL 2026
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home Top Story At Rajasthan Vande Bharat Train Launch Pm Modis Praise For Ashok Gehlot

Rajasthan: సీఎం అశోక్ గెహ్లాట్‌పై ప్రధాని మోదీ ప్రశంసలు.. కాంగ్రెస్ పై ఆసక్తికర వ్యాఖ్యలు

Published Date :April 12, 2023 , 2:15 pm
By NTV WebDesk
Rajasthan: సీఎం అశోక్ గెహ్లాట్‌పై ప్రధాని మోదీ ప్రశంసలు.. కాంగ్రెస్ పై ఆసక్తికర వ్యాఖ్యలు
  • Follow Us :
  • google news
  • dailyhunt

కాంగ్రెస్, బీజేపీల మధ్య రాజకీయ వైరం ఉంది. ముఖ్యంగా మోడీ సర్కార్‌ పై కాంగ్రెస్ తీవ్ర స్థాయిలో విరుచుకుపడుతోంది. ప్రజా వ్యతిరేక విధానాలపై విమర్శలు గుప్పిస్తోంది. ప్రధాని మోడీ కూడా సభలు, పలు అభివృద్ధి కార్యక్రమాల సందర్భంగా విపక్షాల విమర్శలను తిప్పికొడుతున్నారు. అయితే, తాజాగా జరిగిన ఓ కార్యక్రమంలో కాంగ్రెస్ సీఎంను ప్రధాని మోడీ పొగడడం ఆశ్చర్యం కలిగించింది.

రాజస్థాన్ లో తొలి వందే భారత్ రైలును ప్రధాని మోడీ ప్రారంభించారు. వీడియో కాన్ఫరెన్స్ ద్వారా వందే భారత్ ఎక్స్‌ప్రెస్ ప్రారంభించిన అనంతరం కార్యక్రమంలో ప్రధాని ప్రసంగించారు. ఈ సందర్భంగా ప్రధాని నరేంద్ర మోడీ రాజస్థాన్ ముఖ్యమంత్రి అశోక్ గెహ్లాట్‌ను స్నేహితుడిగా ప్రస్తావించారు. కాంగ్రెస్ పార్టీలో రాజకీయ సంక్షోభాలు ఉన్నప్పటికీ గెహ్లాట్‌ ముందుకు సాగుతున్నారు. ఈ క్రమంలో రాష్ట్రంలో మొదటి వందే భారత్ ఎక్స్‌ప్రెస్ ప్రారంభ కార్యక్రమానికి హాజరైనందుకు ఆయనను ప్రశంసించారు. తన ప్రసంగం చివరలో ముఖ్యమంత్రి అశోక్ గెహ్లాట్ ముందుకు వచ్చిన డిమాండ్లతో పాటు కాంగ్రెస్‌లో కొనసాగుతున్న రాజకీయ గొడవలను ప్రధాని మోదీ ఎత్తి చూపారు.
Also Read:PVN Madhav : విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ గురించి మాట్లాడే హక్కు బీఆర్‌ఎస్‌కు లేదు

Also Read

  • Iran: 2 నెలల యుద్ధం తర్వాత టెహ్రాన్ నుంచి విమాన సర్వీసులు ప్రారంభం
  • Punjab: ‘‘పంజాబ్‌ ద్రోహులు’’ వెలసిన ఆప్ తిరుగుబాటు ఎంపీల పోస్టర్లు
  • Swati Maliwal: ఆప్‌కు స్వాతి మాలివాల్ గుడ్‌బై.. రాజీనామా చేసినట్లు ప్రకటన
  • Iran-US Talks: ఇస్లామాబాద్‌లో అసిమ్ మునీర్‌తో ఇరాన్ బృందం భేటీ

గెహ్లాట్ అనేక రాజకీయ సంక్షోభాలను ఎదుర్కొంటున్నారరని, అయినప్పటికీ, ఆయన అభివృద్ధి పనుల కోసం సమయాన్ని వెచ్చించి రైల్వే కార్యక్రమంలో పాల్గొన్నారని ప్రధాని ప్రశంసించారు. తాను ఆయనకు స్వాగతం పలుకుతున్నానని ప్రధాని మోదీ చెప్పారు. జైపూర్‌ జంక్షన్‌ రైల్వేస్టేషన్‌లో వందేభారత్‌ ఆవిష్కరణ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఇందులో రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్, రాజస్థాన్ గవర్నర్ కల్రాజ్ మిశ్రా తదితరులు పాల్గొన్నారు. రైల్వే మంత్రి, రైల్వే బోర్డు చైర్మన్ ఇద్దరూ రాజస్థాన్‌కు చెందిన వారని ప్రధాని ప్రస్తావించారు. “మీ రెండు చేతుల్లో లడ్డూలు ఉన్నాయని నేను గెహ్లాట్ జీ చెప్పాలనుకుంటున్నాను… రైల్వే మంత్రి రాజస్థాన్‌కు చెందినవాడు చైర్మన్ రైల్వే బోర్డు కూడా రాజస్థాన్‌కు చెందినది” అని ప్రధాని మోడీ వ్యాఖ్యానించారు.

ఇటీవల తెలంగాణలో సికింద్రాబాద్- తిరుపతి మధ్య వందేభారత్ రైలు ప్రారంభోత్సవంలో రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ పాల్గొనలేదు. బీజేపీ వర్సెస్ బీఆర్ఎస్ గా రాష్ట్రంలో రాజకీయాలు సాగుతున్నాయి. అయితే, రాజస్థాన్ లో కాంగ్రెస్ పాలిత ముఖ్యమంత్రి ప్రధాని మోడీ కార్యక్రమంలో పాల్గొనడం ఆసక్తి రేపింది. ఈ నేపథ్యంలోనే సీఎం గెహ్లాట్‌ పై ప్రధాని మోడీ ప్రశంసలు కురిపించినట్లు తెలుస్తోంది.
Also Read:Bomb Threat: ఢిల్లీలో స్కూల్ కి బాంబు బెదిరింపు.. విద్యార్థుల్లో భయాందోళన

కాగా, ఈ వందేభారత్ ఎక్స్ ప్రెస్ రైలు అజ్మీర్ నుంచి ఢిల్లీ మధ్య నడుస్తుంది. జైపూర్, అల్వార్, గుర్గావ్‌లలో వందేభారత్ రైలు ఆగుతుంది. వందే భారత్ ఎక్స్‌ప్రెస్ అజ్మీర్ నుండి ఢిల్లీ వరకు 5 గంటల 15 నిమిషాల్లో చేరుకుంటుంది. ప్రస్తుతం ఈ మార్గంలో అత్యంత వేగవంతమైన రైలు శతాబ్ది ఎక్స్‌ప్రెస్. ఇది ఢిల్లీ నుండి అజ్మీర్ మధ్య 6 గంటల 15 నిమిషాలలో ప్రయాణిస్తుంది. అందువల్ల వందే భారత్ ఎక్స్‌ప్రెస్ ఆ మార్గంలో నడుస్తున్న ప్రస్తుత వేగవంతమైన రైలు కంటే 60 నిమిషాలు వేగంగా ఉంటుంది.

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • Ashok Gehlot
  • PM Modi
  • Rajasthan
  • Vande Bharat
  • Vande Bharat Train

తాజావార్తలు

  • Oasis Janani Yatra: సంతానోత్పత్తి అవగాహనే లక్ష్యంగా.. తిరుపతి చేరుకున్న ‘ఓయాసిస్ జనని’ యాత్ర.!

  • JD Chakravarthy: అదే మలయాళ సినిమాలు మనవాళ్లు తీస్తే చూడరు.. జేడీ చక్రవర్తి సంచలన వ్యాఖ్యలు!

  • Improve Sperm Quality: వీర్యకణాల సమస్యకు నేచురల్ సొల్యూషన్.. వీర్య నాణ్యత పెంచే ఆహారపదార్థాలు ఇవే.!

  • Grok’s Reply: రాహుల్ గాంధీ పరువు తీసిన గ్రోక్.. ప్రధానిగా మోడీకి మద్దతు..

  • Orange Cap Holders: ఐపీఎల్ చరిత్రలో అరుదైన ఘట్టం.. ఒక రోజులో పూటకో ఆరెంజ్ క్యాప్ హోల్డర్!

ట్రెండింగ్‌

  • Malware Alert : ఆండ్రాయిడ్ యూజర్లకు కేంద్రం వార్నింగ్.. కొత్త మాల్‌వేర్ వచ్చేసింది.. జాగ్రత్త..!

  • 7,200mAh బ్యాటరీ, 8.39mm మందంతో Vivo Y6 5G లాంచ్.. ఫీచర్స్, ధర ఇలా.!

  • 165Hz రిఫ్రెష్ రేట్‌, 12.3 అంగుళాల డిస్‌ప్లే, 10,100mAh బ్యాటరీతో Honor MagicPad 3 Pro లాంచ్.!

  • వేసవికాలంలో చల్లటి కబురు.. 22,000 భారీ తగ్గింపుతో Lloyd Air Conditioner.. త్వరపడండి.!

  • రూ. 9,999కే 6.88 అంగుళాల పెద్ద స్క్రీన్, 5200mAh బ్యాటరీ.. POCO C81 సిరీస్ లాంచ్..!

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions