Rajasthan: కోడలిపై కన్నేసిన మామ.. కొడుకు బయటికెళ్లడం చూసి బాత్రూంలోనే..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Rajasthan: రాజస్థాన్ రాష్ట్రంలో సభ్య సమాజం తలదించుకునే ఘటన చోటు చేసుకుంది. చురు జిల్లా రతన్నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో కోడలిపై కన్నేసిన మామ ఆమెపై అత్యాచారం చేసి తీవ్రంగా గాయపరిచాడు. మహిళా పోలీసు అధికారి ఇంద్రలాల్ మహర్షి తెలిపిన వివరాల ప్రకారం.. బాధితురాలికి సర్దర్శహర్ గ్రామానికి చెందిన యువకుడితో వివాహమైంది. ఒక రాత్రి ఆమె బాత్రూంకి వెళ్ళింది. అదే సమయంలో ఆమె వెళ్లడం భర్త మామ చూశాడు. ఆ సమయంలోనే కొడుకు పనిమీద బయటికి వెళ్లాడు. ఆ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని.. ఆమెను అనుసరించి లోపలికి కూడా వెళ్లాడు.
Read Also: ChatGPT : సంసారాల్లో చిచ్చు పెడుతున్న చాట్ జీపీటీ.. హాంకాంగ్ లో ఘటన
Also Read
- Supreme Court: మహిళకు ఉద్యోగం నిరాకరించినందుకు పనిష్మెంట్.. రూ.12 లక్షలు పరిహారం చెల్లించాలని తీర్పు
- Third Front: దేశంలో ‘‘థర్డ్ ఫ్రంట్’’.. కనిమొళి వరస భేటీలతో కొత్త చర్చ..
- Marital Rape: వైవాహిక అత్యాచారంపై సుప్రీంకోర్టు కీలక విచారణ.. తెగే పంచాయితీనేనా?
- Pakistan: అరేబియా సముద్రంలో భారత్-పాక్ నేవీ ఢీ.. చైనా వ్యూహాలపై అనుమానం.!
మామ లోపలికి రాగానే సదరు మహిళ షాక్ కు గురైంది. వెంటనే భయపడి కేకలు వేయడం ప్రారంభించింది. అయితే నిందితుడు అతని దగ్గర ఉన్న కత్తిని బయటకు తీశాడు. అరిస్తే చంపేస్తానని బెదిరించాడు. అక్కడే ఆమెను అతి క్రూరంగా అనుభవించి బాత్రూం గడియ పెట్టి పారిపోయాడు. బాధితురాలు తేరుకుని ఇంట్లోకి వచ్చి ఆమె అత్తగారికి చెప్పింది. కానీ అదే సమయానికి నిందితుడైన మామ విక్రమ్ కూడా అక్కడికి వచ్చాడు. ఆమె అబద్ధం చెబుతుందని బాధితురాలిని ముగ్గురు తీవ్రంగా కొట్టారు.
Read Also: H3N8 Bird Flu: చైనాలో బర్డ్ ఫ్లూతో ఒకరు మృతి.. ప్రపంచంలోనే తొలి కేసుగా నమోదు..
ఇదంతా బాధితురాలి తల్లికి తెలియడంతో వెంటనే కూతురిని తీసుకుని మెట్టినింటికి వెళ్లింది. మళ్లీ వారిద్దరినీ తీవ్రంగా కొట్టడం ప్రారంభించారు. ఎలాగోలా వారిద్దరూ అక్కడి నుంచి పారిపోయి రతన్నగర్ పోలీస్ స్టేషన్కు చేరుకున్నారు. కానీ పోలీసులు రాత్రి రెండు తెల్లకాగితాలపై బాధితురాలి సంతకం తీసుకుని ఉదయం కేసు నమోదు చేస్తామని చెప్పారు. ఆ తర్వాత బాధితురాలు మళ్లీ పోలీస్ స్టేషన్కు వెళ్లి విక్రమ్పై కేసు పెట్టింది. ప్రభుత్వ ఆసుపత్రిలో బాధితురాలికి పోలీసులు వైద్య పరీక్షలు నిర్వహించారు. పోలీసులు నిందితుడి కోసం గాలిస్తున్నారు. తదుపరి విచారణ జరుపుతున్నారు.
తాజావార్తలు
-
Story Board : డీలిమిటేషన్ పై కేంద్రం వ్యూహమేంటి..? తెలుగు రాష్ట్రాల్లో ఏం జరుగుతుంది..?
-
CM Revanth Reddy :హైదరాబాద్లో హార్వర్డ్ కోర్సులు.. డిసెంబర్ నుంచే క్లాసులు
-
Telangana SIR : ఓటర్లకు ఈసీ గుడ్న్యూస్.. నోటీసులకు ఇక ఇలా స్పందించొచ్చు
-
Supreme Court: మహిళకు ఉద్యోగం నిరాకరించినందుకు పనిష్మెంట్.. రూ.12 లక్షలు పరిహారం చెల్లించాలని తీర్పు
-
OTR: వైసీపీ ప్లాన్ రివర్స్! రేపల్లెలో ఫ్యాన్కు బ్రేక్!
ట్రెండింగ్
-
Samsung Phones: పర్సుకి ఫోన్కు తేడా తెలియదు.. అతి చిన్న సైజ్లో శామ్సంగ్ ఫోల్డబుల్ ఫోన్స్..
-
Rishabh Pant-BCCI: విండీస్తో వన్డేలకు రిషభ్ పంత్ దూరం.. అసలు కారణం ఇదే!
-
AMOLED డిస్ప్లే, 50MP ట్రిపుల్ కెమెరా, ఆరేళ్ల సెక్యూరిటీ అప్డేట్స్ తో Samsung Galaxy A18 4G లాంచ్..!
-
200MP కెమెరా, 3D వేపర్ ఛాంబర్, 7100mAh బ్యాటరీతో Nubia NaviX Ultra లాంచ్.!
-
Meta One వచ్చేసింది.. ఇంస్టాగ్రామ్, వాట్సాప్, ఫేస్ బుక్ కు కొత్త సబ్స్క్రిప్షన్ ప్లాన్ ధరలు ఇదిగో.!